భూసారం.. నిర్ధారణలో నిస్సారం
మంచి పంట పండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. వరుసగా పంటలు సాగు చేసే క్రమంలో రసాయన ఎరువులు వాడకం వల్ల నేలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భూమిలో మూలకాలు ఎంత మేరకు ప్రభావితం అవుతున్నాయి.
మట్టి పరీక్షలు చేయడంలో యంత్రాంగం అలక్ష్యం
పోషకాల లోపంతో నాణ్యత, దిగుబడులపై ప్రభావం
ఈనాడు-బాపట్ల, నరసరావుపేట
మంచి పంట పండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. వరుసగా పంటలు సాగు చేసే క్రమంలో రసాయన ఎరువులు వాడకం వల్ల నేలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. భూమిలో మూలకాలు ఎంత మేరకు ప్రభావితం అవుతున్నాయి. ఏ పోషకాలు క్షీణించి ఏమి లోపించాయనే అంశాలు భూసార పరీక్షల ద్వారా తెలుస్తాయి. దీని ఆధారంగానే ఏ పంటలు వేసుకోవాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ పరిమాణాల్లో మార్పులను గ్రహించవచ్చు. ఇంతటి కీలకమైన పరీక్షలు మూడేళ్లుగా చేయకపోవడంతో భూమిలో పోషకాలకు సంబంధించి రైతులకు సమాచారం తెలియడం లేదు. సూక్ష్మపోషకాల లోపంతో పంట దిగుబడులపై ప్రభావం పడుతోంది.
మూడేళ్లుగా నిలిచిన పరీక్షలు
పంటలు వేయడానికి ముందుగా భూసారం పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత అవసరం. భూమి ఆరోగ్యాన్ని సూచించే పరీక్షలు క్రమంగా చేయించుకోవాలి. వేసవి కాలంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టి.. ఖరీఫ్ సీజన్ మొదలయ్యే సమయానికి రైతులకు ఫలితాలు అందించాలి. గత మూడేళ్లుగా భూసార పరీక్షలపై వ్యవసాయ శాఖ శీతకన్ను వేసింది. ప్రస్తుతం రబీ పంటలు కూడా చేతికందే సమయం ఆసన్నమైంది. రెండు నెలలపాటు వేసవిలో పొలాలు ఖాళీగా ఉంటాయి. దీంతో భూసార పరీక్షలు చేయించడానికి అనువైన సమయమిది. భూసార ప్రయోగశాలల్లో యంత్రాలు, పనిముట్లు ఉపయోగంలో ఉంచటం.. మట్టి నమూనాలు సేకరణ, తరలింపు, పరీక్షించడం.. ఫలితాలను రైతులకు చేర్చటానికి అవసరమైన ముందస్తు కార్యాచరణ సిద్ధం కాలేదు. నేలలోని మూలకాల తీరుతెన్నులను, భూమి ఆరోగ్యాన్ని నిర్ధారించుకుని.. అవసరమైన పోషకాలను అందజేయడానికి భూసార పరీక్షలు అవసరం. ప్రతి మూడేళ్లకొకసారి ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. వరుసగా పంటలు సాగు చేస్తున్నందున మూలకాల స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. 2020 నుంచి భూసార పరీక్షలు మరుగున పడ్డాయి. పలు కారణాలతో ప్రభుత్వం దీనిని ప్రాధాన్యం తగ్గిస్తోంది. చాలాచోట్ల పరీక్షలకు ఉపయోగించే యంత్ర పరికరాలు మరమ్మతుకు గురయ్యాయి. వీటిని బాగు చేయించుకుంటేనే పరీక్షలు జరపడానికి వీలవుతుంది. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 80వేల వరకు నమూనాలు సేకరించి విశ్లేషించి రైతులకు ఫలితాలు అందించేవారు.
మారుతున్న భూభౌతిక స్థితి
బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వాణిజ్య పంటల సాగుతో రసాయనిక ఎరువులు వాడకం ఇటీవల గణనీయంగా పెరిగింది. దీనివల్ల భూమి భౌతిక స్థితిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేలతో సేంద్రియ కర్బనం తగ్గిపోవడంతో గుల్లబారే లక్షణాన్ని క్రమంగా కోల్పోయి గట్టి పడుతోంది. డెల్టా ప్రాంతంలోని మాగాణి భూముల్లో కూడా ఇటీవల కాలంలో ఈ సమస్య తీవ్రమైంది. ఎరువుల ధరలు పెరగడంతో యూరియాను విచ్చలవిడిగా వాడటం వల్ల చీడపీడలకు అస్కారం పెరుగుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోవాలంటే తక్షణమే భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాలకు అనుగుణంగా ఎరువులు చల్లుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నేలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకుని సాగు చేసే పంటలకు ఎరువుల మోతాదును నిర్ణయించుకోవచ్చు. నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకుని ఏ నేలలో ఏ పంట వేస్తే మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. వేసిన పంటకు పంటకు నేలతో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా తగ్గిన పోషకాలను అందించి దిగుబడులు పెంచుకోవచ్చు. భూసార పరీక్షల ప్రాధాన్యం గుర్తించి మూడేళ్లు దాటుతుందన్న జాప్యం చేయకుండా పరీక్షలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!