logo

ఏఎన్‌యూతో ఏపీ ప్రెస్‌ అకాడమీ ఒప్పందం

ఏపీ ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు.

Published : 28 Mar 2023 05:48 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే : ఏపీ ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పర్యటించిన ఆయన.. జర్నలిజం విభాగాన్ని సందర్శించారు. పాత్రికేయ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సుల నిర్వహణకు ఏఎన్‌యూతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్‌ కరుణ, ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి బాల గంగాధర్‌ తిలక్‌ సంతకాలు చేశారు. కోర్సు, తరగతులు, ప్రవేశాలు ప్రెస్‌ అకాడమీ, పరీక్షల నిర్వహణ ఏఎన్‌యూ చేపట్టనున్నాయి. జర్నలిజం విభాగాధిపతి డాక్టర్‌ అనిత, డాక్టర్‌ మధుబాబు, డాక్టర్‌ మాణిక్యరావు, ఆచార్యులు శ్రీనివాసరెడ్డి, ఆచార్య చెన్నారెడ్డి, ఆచార్య ఉదయ్‌కుమార్‌, సీడీఈ సంచాలకులు డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ భవనం నాగకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని