వైకాపా నేతల ఇసుక యుద్ధం
ఇసుక తవ్వకం అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీగా తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు.
అక్రమ తవ్వకాలపై జేసీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
బాపట్ల మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలతో గోతులు ఇలా..
ఇసుక తవ్వకం అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి భారీగా తవ్వి రూ.కోట్లు గడిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి మూడేళ్లుగా బినామీల ద్వారా యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తూ విక్రయాల ద్వారా రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఈ క్రమంలోనే అమాత్యుడి కన్ను ఇసుకపై పడింది. ఆయన అనుచరులు రంగప్రవేశం చేశారు. బాపట్ల-చీరాల మండలాల సరిహద్దుల్లో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. బాపట్ల పట్టణ శివారున జమ్ములపాలెం రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి మెరక వేయటానికి అవసరమైన బుసక సరఫరాకు ఎమ్మెల్యే వర్గీయులతో పాటు మంత్రి వర్గీయులు పోటీ పడుతున్నారు. జేసీబీలతో తవ్విన ఇసుకను లారీల్లో బయటకు తరలించటానికి అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్సీ పొలాల నుంచి దారి వేసుకుంటామని నేరుగా ఆయనకే అమాత్యుని వర్గీయులు చెప్పారు. అక్రమ తవ్వకాలపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి తరఫున సదరు ఎమ్మెల్సీ జేసీ శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు.
నీ నిర్మాణ రంగంలో ఇసుక, బుసకకు విపరీతమైన డిమాండ్ ఉంది. బాపట్ల, చీరాల మండలంలోని అసైన్డ్ భూములను వైకాపా ఎమ్మెల్యే తన బినామీ ద్వారా కొనుగోలు చేశారు. 216ఏ జాతీయ రహదారి, విజయవాడ- చెన్నై రైల్వేలైన్ మూడో ట్రాక్ నిర్మాణానికి అంటూ బుసక తవ్వకానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఐదడుగులకు మించి తవ్వరాదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ 25 అడుగులకు పైగా బుసక, ఇసుక తవ్వి రోజూ వందల ట్రిప్పులు విక్రయించి రూ.కోట్లు గడించారు. భూమిలో పై నాలుగు అడుగులు బుసక ఆ తర్వాత తవ్వితే ఇసుక వస్తున్నాయి. ప్రస్తుతం టిప్పర్ బుసుకకు రూ.10 నుంచి 12 వేలు, ఇసుకకు రూ.15 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.
* బాపట్ల మండలం పడమర బాపట్ల, వెదుళ్లపల్లి, స్టూవర్టుపురం, చీరాల మండలం దేవినూతల, కావూరివారిపాలెం, బోయినవారిపాలెంలోని అసైన్డ్ భూముల్లో అక్రమ దందా కొనసాగుతోంది. ఇసుక తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతం చుట్టూ కూరగాయలు, పూలతోటలు ఉన్నాయి. అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అర ఎకరా, ఎకరా భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు పంటలు కోల్పోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పట్టణ శివారున రూ.510 కోట్లతో వైద్య కళాశాల, బోధనాసుపత్రి నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు. కళాశాలకు చెరువు భూములు కేటాయించారు. ఈ నేపథ్యంలో మెరక వేయటానికి బుసక అవసరమైంది. ఓ ఎమ్మెల్యే తన బినామీ ద్వారా బుసక సరఫరా చేస్తున్నారు. తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతంలో వైకాపా ఎమ్మెల్సీకి చెందిన పంట భూములున్నాయి. అక్రమ తవ్వకాల వల్ల తన పంట భూములు దెబ్బతింటున్నాయని, ఇతర రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యేకు నేరుగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలతో తనకు సంబంధం లేదని జాతీయ రహదారి విస్తరణ పనుల గుత్తేదారు తవ్వుతున్నారని సదరు ఎమ్మెల్యే చెప్పినట్లు తెలిసింది.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసి..
ఇసుక తవ్వకాలు, విక్రయాల ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్న విషయం తెలిసి ఇటీవల ఓ మంత్రి తన అనుచరులను బాపట్ల, చీరాల మండలాలకు పంపించారు. తెనాలి నుంచి వచ్చిన అనుచరులు 12ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. టిప్పర్లలో ఇసుక తరలించటానికి తాత్కాలికంగా రహదారి వేశారు. వైద్య కళాశాల నిర్మాణానికి మెరక పనులకు తాము బుసక సరఫరా చేస్తామని వచ్చారు. ఎమ్మెల్సీకి ఫోన్ చేసి మమ్నల్ని మంత్రి పంపించారని చెప్పారు. తాము ఇసుక తవ్విన ప్రాంతం నుంచి వాహనాల్లో తరలించటానికి మీ భూముల నుంచి రోడ్డు వేస్తామన్నారు. రోడ్డు ప్రతిపాదనపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాపట్ల, చీరాల మండలాల రైతులు కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో అక్రమ తవ్వకాలు, బుసక, ఇసుక రవాణాపై ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తన వ్యవసాయ భూముల చుట్టూ మాత్రమే తవ్వారని, ఇక నుంచి నేరుగా ఆ భూముల నుంచే రోడ్డు వేసి ఇసుక తరలిస్తామని అమాత్యుని అనుచరులు నేరుగా ఫోన్ చేసి చెప్పటంతో ఆ ఎమ్మెల్సీకి కోపం వచ్చింది. కలెక్టరేట్కు వెళ్లి జేసీ శ్రీనివాసులును కలిసి పరిస్థితి వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించి తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేయించారు. ఇసుక, బుసక తవ్వకాల విషయంలో అమాత్యుడు, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు