అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీస కరుణ చూపడం లేదని, వారి బాధలను ఆలకించేందుకే వచ్చినట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
పరామర్శిస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు
నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీస కరుణ చూపడం లేదని, వారి బాధలను ఆలకించేందుకే వచ్చినట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటం సోమవారంతో 19వ రోజుకు చేరింది. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలను ఆయన సోమవారం పరామర్శించారు. శ్రీనగర్ 7వ లైన్లోని కుటుంబాన్ని ఆయనతో పాటు జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్, జిల్లా అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు, కార్యదర్శి కిరణ్కుమార్ పలకరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటామని ప్రమాణం చేశారు. ఉద్యోగులు తమ కుటుంబంలో భాగమని చెబుతున్న ప్రభుత్వం, వారికి కష్టమొస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కుటుంబ పెద్ద అర్ధంతరంగా చనిపోతే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీలో అయిదు, ఇతర శాఖలకు సంబంధించిన రెండు కుటుంబాలను ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో ఏపీ హెచ్ఎం సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, వీఆర్వో సంఘం రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో ఇల్లన్నావు.. తోడేళ్లకు తోడున్నావు..
[ 17-04-2024]
ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. -
పట్టుదలతో శ్రమించి.. విజేతలుగా నిలిచి
[ 17-04-2024]
ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్లో మెరిశారు. -
‘రా’క్షస రాజ్యం పారదోలుదా‘మా’
[ 17-04-2024]
రాముడు సకల గుణాభిసోముడు.. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాడు. పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. ప్రకృతిని ప్రేమించాడు. -
అల్లరిమూకల అరాచకం..!
[ 17-04-2024]
గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు. -
మేము దాచుకుంది.. నీ నవరత్నాల కోసం కాదు
[ 17-04-2024]
ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్ లీవ్, డీఏ, జీపీఎఫ్.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు. -
‘చేనేత కుటుంబాలపై ఎమ్మెల్యే ఆర్కే కక్షసాధింపు’
[ 17-04-2024]
ఎమ్మెల్యే ఆర్కే తొలి నుంచి చేనేత కుటుంబాలపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ను గెలిపించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు మహిళా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నదీ గర్భాన్ని తోడేస్తూ.. నిలువునా దోచేస్తూ
[ 17-04-2024]
అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. -
కంచు మోతలే.. సరైన వసతులేవి మామ!
[ 17-04-2024]
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు. -
రీయింబర్స్మెంట్ లేదు.. చేయూత నిధులు అందలా..
[ 17-04-2024]
వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది. -
పోలీసుల చూపు ఒక వైపే..!
[ 17-04-2024]
జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్
-
రాయి దాడి కేసు.. బొండా ఉమాను ఇరికించే ప్రయత్నంలో వైకాపా: కేశినేని చిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అమేఠీ నుంచి పోటీపై రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..?
-
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
-
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?