logo

స్పందనలో స్పృహ కోల్పోయిన వృద్ధురాలు

పోలీసు కార్యాలయంలో సోమవారం ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోవడం ఆందోళన రేకెత్తించింది. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన వడ్లమూడి సీతామహాలక్ష్మి భర్త రంగారావు మృతి చెందారు. 

Published : 28 Mar 2023 06:10 IST

సీతామహాలక్ష్మిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు కార్యాలయంలో సోమవారం ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోవడం ఆందోళన రేకెత్తించింది. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన వడ్లమూడి సీతామహాలక్ష్మి భర్త రంగారావు మృతి చెందారు.  ఆమెకు భర్త తరపున వట్టిచెరుకూరు మండలంలోని వింజనపాడులో ఎకరం పొలం ఉంది. దాన్ని తనకు తెలియకుండా బంధువులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు తనపై దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారంటూ ఎస్పీ స్పందన కార్యక్రమంలో అనేకసార్లు విన్నవించారు. సోమవారం మళ్లీ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు అందించారు. స్పందించిన ఆయన తెనాలి పోలీసులకు ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అంతలో స్పృహ తప్పి పడిపోవడంతో ఎస్సై మీరావలి, హెడ్‌ కానిస్టేబులు జానయ్య మహిళా సిబ్బందితో కలిసి 108లో జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని