logo

తెదేపాకు పూర్వవైభవంతోనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి

తెదేపాకు పూర్వవైభవంతోనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన మండలంలోని వేల్పూరులో

Published : 30 Mar 2023 05:28 IST

జాతీయ పశుబల ప్రదర్శన పోటీల వేదికపై కేకు కోస్తున్న వట్టికుంట శేషగిరిరావు, వెన్నా సాంబశివారెడ్డి తదితరులు

వేల్పూరు (అచ్చంపేట), న్యూస్‌టుడే: తెదేపాకు పూర్వవైభవంతోనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆయన మండలంలోని వేల్పూరులో వట్టికుంట ఛారిటబుల్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పశుబల ప్రదర్శన పోటీల వేదికపై జరిగిన తెదేపా ఆవిర్భావ దిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ట్రస్టు ఛైర్మన్‌ వట్టికుంట శేషగిరిరావు, నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేకు కోశారు. సీనియర్‌ నాయకులను సత్కరించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా జాతీయ స్థాయి పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని