logo

గడువు తీరిన ప్యాకెట్ల విక్రయం

శావల్యాపురం మండలంలో కారుమంచి, వయ్యకల్లు తదితర గ్రామాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా ఆహారపదార్థాల నియంత్రణ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా

Published : 30 Mar 2023 05:28 IST

శావల్యాపురం, న్యూస్‌టుడే: శావల్యాపురం మండలంలో కారుమంచి, వయ్యకల్లు తదితర గ్రామాల్లో గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నా ఆహారపదార్థాల నియంత్రణ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. దీని వల్ల చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. శీతల పానీయాలు  కూడా  గడువు తీరినవే విక్రయిసుక్తన్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు గ్రామాల్లో గతంలో ఇదే విధంగా కాలం చెల్లిన ప్యాకెట్లు, శీతలపానీయాలు బయటపడినా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని