logo

ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం

హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ  ప్రైవేటు కంపెనీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

Published : 30 Mar 2023 05:28 IST

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ  ప్రైవేటు కంపెనీ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని బాదినేనిపల్లెకు చెందిన జోగిపర్తి మల్లికార్జున (35) భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులతో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటున్నారు. అక్కడి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గత ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన మల్లికార్జున ఆచూకీ లేకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని సాగర్‌ చెక్‌పోస్టు సమీపంలో ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా, గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు వచ్చి పరిశీలించి బాదినేనిపల్లెకు చెందిన మల్లికార్జునగా గుర్తించారు. అనంతరం మియాపూర్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని