శస్త్రచికిత్సలకు కొత్త యంత్రాలు
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు అత్యాధునిక సీయామ్ యంత్రాలు (మిషన్లు) ఎట్టకేలకు సమకూరాయి. వాటి కోసం సుమారు ఏడాది నుంచి వైద్యులు నిరీక్షిస్తున్నారు.
అసౌకర్యం తప్పిందన్న జీజీహెచ్ వైద్యులు
ఈనాడు, అమరావతి
యూరాలజీ విభాగంలో సీయామ్ పరికరం
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు అత్యాధునిక సీయామ్ యంత్రాలు (మిషన్లు) ఎట్టకేలకు సమకూరాయి. వాటి కోసం సుమారు ఏడాది నుంచి వైద్యులు నిరీక్షిస్తున్నారు. ఇవి అందుబాటులో లేక శస్త్రచికిత్సలు వాయిదా పడేవి. వైద్యులు పదేపదే ఉన్నతాధికారులకు మొరపెట్టుకోగా స్పందించిన ప్రభుత్వం తాజాగా వాటిని పంపింది. ప్రస్తుతం ఉన్న యంత్రాలు బాగా పాతవి. అవి ఎప్పుడు పనిచేస్తాయో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఉన్న యంత్రాలతోనే అతికష్టం మీద రోగులకు అసౌకర్యం కలగకుండా శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. ప్రస్తుతం కొత్త పరికరాల సహాయంతో శస్త్రచికిత్సలు సులభంగా, వేగంగా పూర్తి చేయడానికి అవకాశం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాలు
న్యూరో సర్జరీ, యూరాలజీ, ఆర్థో విభాగాలకు సుమారు రూ.కోటి విలువైన యంత్రాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ వైద్య, మౌలిక సదుపాయాల కల్పనా అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) కొనుగోలు చేసి పంపింది. వాటిని ఆయా విభాగాల్లో టెక్నీషియన్లు బిగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో తరచూ శస్త్రచికిత్సలు వాయిదా వేస్తూ ఉండేవారు. ఆపై ఇంప్లాంట్స్, స్క్రూస్ అమర్చినప్పుడు అవి సరైన స్థితిలో ఇమిడాయో లేదోనని ఆందోళన చెందేవారు. యంత్రాలు పనిచేస్తుంటే ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఓ రకంగా ఇవి ఎక్సరే లాంటివని, ఎక్కడ ఎముకలు విరిగాయి, ఎక్కడ వంకర ఉన్నాయో కూడా ఎక్సరే తీయడం ద్వారానే బయటపడుతుంది. ఎక్సరే తీయడం వల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయో సీయామ్ యంత్రాలను అలాగే వినియోగించుకోవచ్చు. కాళ్లకు ఇంప్లాంట్స్, మెదడు, నరాలకు క్లిప్స్, ఎముకల పటిష్ఠానికి వాడే ప్లేట్స్, రాడ్స్ వంటి పరికరాలు సరైన స్థితిలో ఉన్నాయా? లేదా అనేది సర్జరీ సమయంలో సరిచూసుకుంటారు. ప్రస్తుతం పంపిన ఆ మూడు యంత్రాలు ఎముకలు-కీళ్లు, నరాలు-మెదడు, మూత్రపిండాల విభాగాలకు కేటాయించడంతో సంబంధిత విభాగాధిపతులు ఇక మీదట శస్త్రచికిత్సలు వేగవంతంగా పూర్తి చేయడానికి ఆస్కారం కలిగిందని తెలిపారు.
త్వరగా కొలిక్కి...
ఆయా విభాగాల్లో ఈ యంత్రాలు లేకుండా రోగికి శస్త్రచికిత్సలు చేయడం చాలా క్లిష్టతరంతో కూడుకున్న వ్యవహారమని, అదే వాటిల్లో చూస్తూ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు. సుమారు ఏడాది క్రితం రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఆసుపత్రి పరిశీలనకు రాగా అప్పట్లో ఆసుపత్రి వైద్యులు, పీజీ డాక్టర్లు యంత్రాల లేమి కారణంగా పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యంత్రాలు అందుబాటులో ఉంటే రోగికి చేసే శస్త్రచికిత్సకు సంబంధించి ప్రతిదీ అందులో చూసుకుని చేస్తాం కాబట్టి కచ్చితంగా దాని నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తవు. అవి లేకుండా శస్త్రచికిత్సలకు ఉపక్రమిస్తే చాలా సమయం తీసుకుంటోందని, వాటిని సమకూర్చాలని కోరారు. ఒక రోగి మోకాలికి ఇంప్లాంట్ వేసినా, ఇంకేదైనా స్క్రూ బిగించినా దాని పొజిషన్ చెక్ చేసుకోవటానికి ఈ యంత్రాలు ఉపకరిస్తాయని ఏడాది నుంచి మొర పెట్టుకుంటే తాజాగా మూడు యంత్రాలు జీజీహెచ్కు పంపారని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM