పండగ పూట విషాదం
వారిద్దరూ శ్రీరాముడి కల్యాణ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.. అనంతరం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.
ఈతకు వెళ్లి ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృత్యువాత
పల్నాడు జిల్లాలో ఘటన
అమరావతి, న్యూస్టుడే: వారిద్దరూ శ్రీరాముడి కల్యాణ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.. అనంతరం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం పల్నాడు జిల్లా అమరావతిలో చోటుచేసుకుంది. పెదకూరపాడు మండలం 75త్యాళ్లూరుకు చెందిన మల్లికార్జునరెడ్డి(17), రాజశేఖరరెడ్డి(17) గుంటూరులోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. ఇటీవలే పరీక్షలు రాసి సొంతూరికి వచ్చారు. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరికీ పానకం, వడపప్పు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం చరవాణి మరమ్మతు చేయించుకోవాలని చెప్పి స్నేహితులు కార్తీకరెడ్డి, నాగనితిన్రెడ్డితో కలిసి అమరావతి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. అక్కడ లోతు తెలియకపోవడంతో మల్లికార్జునరెడ్డి, రాజశేఖరరెడ్డి నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు స్నేహితులు భయంతో కేకలు వేయగా సమీపంలోని స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఇద్దరూ మృత్యువాత పడ్డారు. రాజశేఖరెడ్డి తండ్రి అంకిరెడ్డి మృతి చెందగా తల్లి కుటుంబ బాధ్యతలు మోస్తూ తన ఇద్దరు కుమారులను చదివిస్తోంది. రామలింగారెడ్డి రెండో కుమారుడు మల్లికార్జునరెడ్డి. వీరిది వ్యవసాయం కుటుంబం. సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరూ విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగాయి. 75 త్యాళ్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మట్టి వంతెనే కారణం
అమరావతి రీచ్లో తవ్వకాలు జరిపిన ఇసుక రవాణా కోసం కృష్ణానదికి అడ్డుగా మట్టి వంతెన వేశారు. ఈ వంతెన కోసం ఇరువైపులా సుమారు 20 అడుగుల లోతు మేర గుంతలు తవ్వారు. ఆ గుంతలు ప్రమాదకరంగా మారాయి. వంతెన కింద తూములు వేయడంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టడానికి అనువుగా ఉందని భావించి విద్యార్థులకు వంతెన వద్ద దిగారు. ఇసుక రీచ్ నిర్వాహకులు అడ్డగోలుగా గుంతలు తవ్వేయడంతో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య