అప్రమత్తతతో మెలగాలి..!
‘పది’ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు.
ఫిజిక్స్, ఎన్ఎస్ పరీక్షపై విద్యార్థుల్లో ఆందోళన
ప్రతి 15 నిమిషాలకు గుర్తుచేయాలని అధికారుల ఆదేశం
ఈనాడు, అమరావతి
‘పది’ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. గతేడాది ఏడు పేపర్లు పెట్టగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాటిని ఆరు పేపర్లకే కుదించి పరీక్షలు నిర్వహించేలా పరీక్ష విధానంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిజిక్స్, నేచురల్ సైన్స్(ఎన్ఎస్)కు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు, వేర్వేరుగా ఆన్సర్ బుక్లెట్లు ఇస్తారు. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో బాగా ఆందోళన నెలకొంది. ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ప్రీ పబ్లిక్ పరీక్షలో ప్రాక్టీస్ చేయించినా చాలా స్కూళ్లల్లో విద్యార్థులు ఫిజిక్స్ ఆన్సర్ బుక్లెట్లో ఎన్ఎస్ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు రాశారు. ఈ పొరపాటు పబ్లిక్ పరీక్షలో పునరావృతమైతే అంతిమంగా విద్యార్థులు నష్టపోతారని గుర్తు చేస్తున్నారు. రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఆన్సర్ బుక్లెట్లు ఒకేసారి ఇస్తారు. దీంతో విద్యార్థులు వారికి ఏ పేపర్ తేలిగ్గా ఉందో దాన్ని ముందుగా రాసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ సమాధాన పత్రాలు వేర్వేరు ఆన్సర్ షీట్లపై రాయాల్సి ఉంది. దీంతో వాటిని రాసే క్రమంలో ఏదైనా పొరపాటున ఒక దానిపై రాయాల్సింది మరోదానిపై రాస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పి వేర్వేరుగా కాకుండా ఒకే ఆన్సర్బుక్లెట్లో సమాధానాలు రాసేలా వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఉపాధ్యాయులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. పిల్లలకు ఈ నూతన విధానం అలవాటు కావాలని, ఎన్సీఈఆర్టీ పరీక్షలు రాసేవారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా మూడు పేపర్లు విడివిడిగా రాస్తారని, కనీసం మన విద్యార్థులు రెండు పేపర్లయినా రాయకపోతే ఎలా అని చెప్పి పాఠశాల విద్యాశాఖ రెండు పేపర్లు వేర్వురుగా రాసేలా ఈ ఏడాది నూతన విధానం ప్రవేశపెట్టింది.
సీరియల్ నంబరు వేర్వేరుగానే..
సీరియల్ నంబరు ఒకటి నుంచి 16 వరకు ఫిజిక్స్, 17 నుంచి 33వ ప్రశ్న దాకా ఎన్ఎస్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పొరపాటున 17వ నంబరు ప్రశ్నకు ఫిజిక్స్ సమాధాన పత్రంలో రాస్తే ఆ మేరకు ఇన్వాలిడ్గా పరిగణిస్తారు. ఇది లేకుండా ఉండాలంటే 1 నుంచి 16 దాకా ఫిజిక్స్ ప్రశ్నావళికి ఆ ఆన్సర్ బుక్లెట్పైనే రాయాలి. ఎన్ఎస్కు కేటాయించిన 17 నుంచి 33 నంబర్ల దాకా సంబంధిత ఆన్సర్షీట్పై సమాధానాలు రాయాలని ప్రతి 15 నిమిషాలకు ఇన్విజిలేటర్లు గుర్తు చేస్తూ పిల్లలను అప్రమత్తం చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ విషయాన్ని ప్రతి పరీక్ష గదిలో బోర్డుపై సైతం రాయాలని సూచించారు. తాము ఎంత ప్రాక్టీస్ చేయించినా ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలో నిర్వహించిన పరీక్షలోనే అయోమయం చెంది ఒకటే బుక్లెట్పై ఫిజిక్స్, ఎన్ఎస్కు సమాధానాలు రాశారని పలువురు హెచ్ఎంలు తెలిపారు. పరీక్ష ఒకే రోజు పెడుతున్నప్పుడు ఆన్సర్షీట్ సైతం రెండింటికి కలిపి ఒకటే ఇచ్చి రాయమంటే బాగుండేదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది.
ఏర్పాట్లలోనే...
పరీక్షలు సమీపించినా ఇంకా ఏర్పాట్లపైనే మల్లగుల్లాలు పడుతున్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో తొలిసారిగా ఏ జిల్లాకు ఆ జిల్లా పరిధిలోనే పరీక్షలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. గుంటూరు జిల్లాతో పోలిస్తే పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పట్టణాలు అంతగా లేవు. దీంతో ఆయా స్కూళ్లకు ఫర్నీచర్ సమకూరక పల్నాడు, బాపట్ల జిల్లాలో కొందరుచీఫ్ సూపరింటెండెంట్లు ఈ సమస్య ఎలా అధిగమించాలని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లపై ప్రతి రోజూ ఫొటోలు తీసి పంపమంటున్నారు. దీంతో ఫర్నీచర్ సమకూరకపోతే సంబంధిత పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వాటిని సమీకరించుకోవడానికి ముందస్తుగా నిధులు ఇవ్వలేదని వాటిని ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీని బదిలీచేయండి: ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు
[ 25-04-2024]
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో భాజపా నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సినీ నటుడు నిఖిల్
[ 25-04-2024]
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ