ప్రసూతి విభాగం.. వసూళ్ల పర్వం..
వైద్య ఖర్చులు భరించలేక సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వస్తున్న పేద, మధ్య తరగతి రోగులను జీజీహెచ్లో కొంతమంది సిబ్బంది జలగల్లా పీడించి లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నా వారిలో మార్పు.
అబ్బాయి పుడితే రూ.2 వేలు, అమ్మాయికి రూ.1,000 ఇవ్వాల్సిందే
ప్రసూతి విభాగం
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: వైద్య ఖర్చులు భరించలేక సర్వజనాసుపత్రికి చికిత్స కోసం వస్తున్న పేద, మధ్య తరగతి రోగులను జీజీహెచ్లో కొంతమంది సిబ్బంది జలగల్లా పీడించి లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని సస్పెండ్ చేయడం, అనంతరం విచారణలో ఏమీ తేలలేదని మొత్తం జీతం ఇచ్చి తిరిగి విధుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మంగళవారం ఆసుపత్రికి వచ్చి లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులు ఎవరో తనకు తెలియాలని డిమాండ్ చేయడంతో కలకలం రేపింది. దీనిపై తనకు చాలా మంది ఫిర్యాదు చేశారని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో సమాధానం చెప్పేవారే కరవయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ, గుంటూరు సర్వజనాసుపత్రిలో అందుకు భిన్నంగా జరుగుతుండటం గమనార్హం.
లంచం అడిగారు.. ఇచ్చాం
జీజీహెచ్లో లంచాలు వసూలు చేయడంపై ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సివిల్ సర్జన్ ఆర్ఎంవో సతీష్కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ ప్రసూతి విభాగంలో రహస్యంగా విచారణ జరిపారు. అధికారులు నేరుగా వార్డుకు వెళ్లి చికిత్స పొందుతున్న తల్లులతో పాటు, వారి బంధువులతో మాట్లాడారు. దీంతో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. వార్డులో ఉన్నవారిలో 14 మంది తాము ఉద్యోగులకు లంచాలు ఇచ్చిన మాట వాస్తవమేనని రాతపూర్వకంగా తెలియజేశారు. ముఖ్యంగా గర్భిణులను శస్త్రచికిత్స మందిరానికి తీసుకెళ్లి సిజేరియన్ చేసిన అనంతరం శిశువులను ఇవ్వాలంటే అక్కడ పని చేసే సిబ్బందికి లంచం ఇవ్వాల్సి వస్తోందని తెలిపినట్లు సమాచారం. మగ బిడ్డ పుడితే ఒక రేటు, అమ్మాయి అయితే మరో రేటు పెట్టి వసూళ్లకు తెగబడుతున్నారని తెలిపారు. అనంతరం ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ విభాగంలో పని చేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు తాఖీదులిస్తూ సూపరింటెండెంట్ ఆదేశాలిచ్చారు.
సరైన చర్యలు లేకపోవడం వల్లే
సర్వజనాసుపత్రి ప్రసూతి విభాగంలో నెలకు 900 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మగబిడ్డ పుడితే రూ.2 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.1,000 రేటు పెట్టి అక్కడ పని చేసే సిబ్బంది ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్నిబట్టి లక్షల రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటికి తెలిస్తే తూతూమంత్రంగా విచారణ చేసి చేతులు దులిపేసుకోవడం అధికార యంత్రాంగానికి అలవాటైపోయింది. దీంతో తమను ఏమీ చేయరనే భావన అక్కడ పని చేసే వారిలోనూ ఏర్పడింది. ప్రసవం సమయంలో తాము ఎంతో కష్టపడి పని చేస్తుంటామని, అన్నీ తామే శుభ్రం చేస్తుంటామని తెలియజేస్తారు. పది నెలల కిందట అదే విభాగంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇటీవలే విచారణ పూర్తి చేసి తదుపరి చర్యల కోసం జిల్లా పాలనాధికారికి దస్త్రం పంపి తిరిగి వారిని విధుల్లోకి తీసుకున్నారు. నాలుగు నెలల కిందట మరో కేసులో లంచం ఇచ్చామని ఫిర్యాదు చేసిన వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత వారిని విచారణకు రావాల్సిందిగా కోరడంతో వారు రాలేకపోయారు. ఆసుపత్రిలో నాలుగు రోజులు ఉన్నా ఎందుకు విచారణ చేయలేదని వారడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో విచారణను ముగించి ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని అక్కడి నుంచి మార్చేసి చేతులు దులిపేసుకున్నారు. అలాకాకుండా ప్రత్యేక నిఘా పెట్టి లంచం అడిగేవారిపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోలేకపోతున్నారు.
పర్యవేక్షణ కరవు
సర్వజనాసుపత్రిలో పర్యవేక్షణకు చాలా మంది అధికారులే ఉన్నారు. అయినప్పటికీ వారంతా కార్యాలయాలకే పరిమితమైపోతున్నారు. దీంతో వార్డుల్లో పని చేసేవారి గురించి పట్టించుకోవడంలేదు. నిత్యం తనిఖీలు చేసి రోగుల సహాయకులతో మాట్లాడితే వారు ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పత్రికల్లో వార్తలు వచ్చిన రెండు రోజులు కొద్దిగా హడావుడి కనిపిస్తుంది. ఆ తర్వాత పరిస్థితి మామూలుగానే ఉంటుంది తప్ప ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
[ 18-04-2024]
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
[ 18-04-2024]
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
[ 18-04-2024]
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం