logo

ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ ఆత్మహత్య

ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన కాకర్ల జయకృష్ణ (23) గతంలో సొంతంగా వ్యవసాయం చేశారు.

Published : 31 Mar 2023 05:34 IST

కాకర్ల జయకృష్ణ (పాతచిత్రం)

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన కాకర్ల జయకృష్ణ (23) గతంలో సొంతంగా వ్యవసాయం చేశారు. ఆ సమయంలో అప్పులపాలయ్యారు. ప్రస్తుతం ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నా.. అప్పులు తీర్చలేక బాధ పడుతున్నారు. బుధవారం రాత్రి  అందరూ నిద్రిస్తుండగా.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొంత సమయం తర్వాత భార్య కోటేశ్వరమ్మ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అతనిని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందారు. మృతుడి తల్లి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు చెప్పారు. జయకృష్ణకు ఏడాది కిందట కోటేశ్వరమ్మతో వివాహమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని