జాతీయ రహదారిపై లారీ- ఆటో ఢీ
పదహారో నెంబరు జాతీయ రహదారిపై ముందెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వెనక ప్రయాణిస్తున్న ఆటో దాన్ని బలంగా ఢీకొన్న సంఘటన మార్టూరు వద్ద జరిగింది.
ప్రమాదంలో ముందుభాగం నుజ్జయిన ఆటో
మార్టూరు, న్యూస్టుడే: పదహారో నెంబరు జాతీయ రహదారిపై ముందెళ్తున్న వాహనం ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో వెనక ప్రయాణిస్తున్న ఆటో దాన్ని బలంగా ఢీకొన్న సంఘటన మార్టూరు వద్ద జరిగింది. గురువారం స్థానిక అమరావతి నూలు మిల్లు ఎదురుగా మంగళగిరి వైపు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురై ముందు భాగం నుజ్జయింది. చోదకుడు కె.గోపికి రక్త గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. మరో ప్రమాదంలో కూరగాయల మార్కెట్ వద్ద కారు, ఆటో ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.