logo

నేడు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

గుంటూరు బార్‌ అసోసియేషన్‌కు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. 1924లో ఏర్పాటు చేసిన బార్‌ అసోసియేషన్‌కు వందో సంవత్సర ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Published : 31 Mar 2023 05:34 IST

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: గుంటూరు బార్‌ అసోసియేషన్‌కు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. 1924లో ఏర్పాటు చేసిన బార్‌ అసోసియేషన్‌కు వందో సంవత్సర ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2700 మంది న్యాయవాదులున్న అసోసియేషన్‌లో 1965 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. అందులో 650 మంది మహిళా న్యాయవాదులు. అధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. కేవీకే సురేష్‌, కాసు వెంకటరెడ్డి, మంగళపురి శ్రీనివాసరావు, తోట సంగమేశ్వరరావులు పోటీలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఆర్‌.నాగవంశీకృష్ణ(వంశీ), కంచర్ల బాబు, మల్లెంపాటి సురేంద్రబాబులు పోటీలో నిలిచారు. ఇతర పదవులకు పలువురు పోటీలో ఉన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి వెంటనే కౌంటింగ్‌ చేపడతామని ఎన్నికల అధికారి దావులూరి శామ్యూల్‌జాన్‌ తెలిపారు. ఇతరులకు బార్‌ అసోసియేషన్‌ వద్ద ప్రవేశం లేదని, సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ తెరలు, బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునే న్యాయవాదులు తమ గుర్తింపు కార్డులను తీసుకు రావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని