బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ.. నిందితుల అరెస్టు
చీరాల షణ్ముక జ్యూయలరీ దుకాణంలో మార్చి 28న బంగారు ఆభరణాల చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్
బాపట్ల, న్యూస్టుడే: చీరాల షణ్ముక జ్యూయలరీ దుకాణంలో మార్చి 28న బంగారు ఆభరణాల చోరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.నాలుగు లక్షల విలువైన 80 గ్రాములు బరువు కలిగిన ఏడు బంగారు గొలుసులు, చీరాలలోని మరో దుకాణంలో అపహరించిన రూ.25 వేల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర పుణే నగరానికి చెందిన శేఖర్ హేమ్రాజ్ వాని, జ్యోత్స్న సూరజ్ కచ్వి, అనిల్ దీపక్ జాదవ్, పూజా శ్రావణ్ పరమార్, రక్షా రాజు బగడే మార్చి 28న రాత్రి చీరాల షణ్ముఖ జ్యూయలరీ దుకాణానికి వచ్చి యజమాని పెనుగొండ శ్రీనివాస్ను బంగారు గొలుసులు చూపించమని అడిగారు. యజమాని దృష్టి మరల్చి చేతిలోని రుమాల్ వేసి ఏడు చైన్లు గుత్తిగా ఉన్న దానిని దొంగలించి వెళ్లిపోయారు. బంగారు గొలుసులు చోరీకి గురైన విషయాన్ని యజమాని గుర్తించి చీరాల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మల్లికార్జునరావు దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని పరిశీలించి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులు హైదరాబాద్లో ఉన్నట్లు తెలుసుకుని సీఐ పోలీసు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. నిందితులు గతంలో హనుమకొండలోని కల్యాణ్ జ్యూయలరీస్ దుకాణంలో ఓ బంగారు గొలుసు దొంగిలించి పుణేలో విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితులను సత్వరమే పట్టుకుని ఆభరణాలు రికవరీ చేసినందుకు సీఐ మల్లికార్జునరావు, ఎస్సై భాస్కరరావును అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. చీరాల డీఎస్పీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.