YSRCP: మంగళగిరి వైకాపాలో అంతర్యుద్ధం!
రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి.
ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న వేళ ఆయన వైరివర్గం నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆళ్ల లేని సమయంలో ఆయన వ్యతిరేకవర్గానికి చెందిన దొంతిరెడ్డి వేమారెడ్డికి తాడేపల్లి, మంగళగిరి నగర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతో ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దూరంగా ఉండడం, పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతో అధిష్ఠానంతో అంతరం పెరిగింది. దీనిని ఆయన వ్యతిరేకవర్గం అనుకూలంగా మార్చుకుని ముందుకెళ్తోంది.
దొంతిరెడ్డి వేమారెడ్డి వర్గం పార్టీలో క్రియాశీలకమై నియోజకవర్గంలోని పార్టీ నేతలను కలిసి అధిష్ఠానం టికెట్ ఇచ్చినవారిని గెలిపించుకుందామనే నినాదం తెరపైకి తెచ్చారు. మంగళగిరి, తాడేపల్లితో పాటు దుగ్గిరాల మండలాల్లో నేతలతో భేటీ అవుతున్న దొంతిరెడ్డి వేమారెడ్డి అందరూ కలసి పనిచేద్దామని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకోకుండా ముందుకెళ్దామని కోరుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు తాడేపల్లి, మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆర్కే అనుచరులు పదవులు పోవడం, వ్యతిరేక వర్గానికి కీలకపదవి వరించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉంది. తమ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వకపోగా కొత్తగా కొందరిని పార్టీలోకి చేర్చుకుని వారికి వెంటనే పదవులు కట్టబెట్టడంపైనా ఆగ్రహంతో ఉన్నారు. ఇది పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం అని సరిపెట్టుకున్నామని, అయితే వరుసగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తొలి నుంచి అసంతృప్తి వర్గం
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు కొందరు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తమకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా కావడం లేదని పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరంతా వైకాపాలోనే కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలు ప్రత్యేకంగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరి వర్గానికి పదవి దక్కడంతో క్రియాశీలమై నేతలందరినీ కలుస్తున్నారు. వీరితో నియోజకవర్గ స్థాయి నేతలు కూడా కొందరు చేయి కలపడం, కొందరు అంతర్గతంగా మద్దతు తెలపడంతో మంగళగిరిపై పట్టు సాధించే దిశగా కదులుతున్నారు. వేమారెడ్డి అభినందన సభకు నియోజకవర్గంలో ముఖ్య నేతలంతా హాజరు కావడం, ఎమ్మెల్యే వర్గం దూరంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే, ఆయన వ్యతిరేకవర్గం ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం పార్టీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇప్పుడు వేమారెడ్డి కబురు చేస్తున్నందున అక్కడికి వెళితే ఎమ్మెల్యే నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అన్న మీమాంసలో కొందరున్నారు. పార్టీ నియమించినందున ఆయనను కలవకపోతే ఎలా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల మండలంలోనూ పార్టీలో ఒక నేత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మిగిలిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారందరూ ఇప్పుడు చురుకైన పాత్ర పోషించడానికి ముందుకొస్తున్నారు. సీఎం నివాసం ఉన్న నియోజకవర్గంలోనే గందరగోళ పరిస్థితి నెలకొనడం, ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువవుతుంటే అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది. ఈ నెలలోనే రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. అప్పటికి అమెరికా నుంచి ఎమ్మెల్యే వచ్చి కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్న విషయమై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు