దండిగా అక్రమార్జన
వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం ఇంటూరులో వైకాపా నేత అతిథి గృహంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మంగళగిరిలోని సెబ్ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు మెరుపుదాడి చేసి 24 మంది జూదరులను అరెస్టు చేసి రూ.3.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
జూద శిబిరాల నిర్వహణ.. గ్రావెల్, ఇసుక తవ్వకాలు
అధికారమే అండగా చెలరేగిపోతున్న వైకాపా నేతలు
బాపట్ల, న్యూస్టుడే
వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం ఇంటూరులో వైకాపా నేత అతిథి గృహంలో నిర్వహిస్తున్న జూద శిబిరంపై మంగళగిరిలోని సెబ్ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు మెరుపుదాడి చేసి 24 మంది జూదరులను అరెస్టు చేసి రూ.3.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ చాలా రోజులుగా జూదం ఆడిస్తున్నా, స్థానిక పోలీసులు తమకు తెలియదన్నట్లుగా మిన్నకుండిపోయారు. బడా బాబులు జూదం ఆడుతూ రోజూ రూ.లక్షల్లో నగదు చేతులు మారుతున్నా జిల్లా అధికారుల దృష్టికి సైతం రాకపోవడం గమనార్హం. జూద శిబిరం నిర్వహిస్తున్న నేతే మట్టి అక్రమ తవ్వకాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జిల్లాలో కొంతమంది అధికార పార్టీ నేతలు తమ అతిథిగృహాలు, వ్యవసాయ క్షేత్రాల్లో మినీ క్యాసినోలు, జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. జూదం ఆడిస్తే రోజూ రూ.వేలల్లో లాభం వస్తుండటంతో నేతలు నిర్వాహకులుగా అవతారం ఎత్తుతున్నారు. స్థానిక అధికారుల చేతులు తడుపుతూ ఏ స్థాయిలో అక్రమాలు జరిగినా మిన్నకుండిపోయేలా చేస్తున్నారు. కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పేకాట, కోడి పందాలు నిర్వహిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో మూడున్నరేళ్ల క్రితం ప్రారంభమైన జూదశాలల నిర్వహణ క్రమంగా జిల్లా మొత్తం విస్తరించింది. జిల్లా కేంద్రం బాపట్ల శివారున ఓ వైకాపా నేతకు వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ వందల సంఖ్యలో పందెం కోళ్లు పెంచుతున్నారు. ఇతర జిల్లాల నుంచి పందెం రాయుళ్లను పిలిపించి రూ.లక్షల్లో పందేలు వేస్తున్నారు. ఇటీవల ఇద్దరు వైకాపా నేతలు వ్యవసాయ క్షేత్రంలో జూదశాల నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేసి రూ.లక్షకు పైగా నగదు జూదరులను పట్టుకున్నారు. పైస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావటంతో దాడి వివరాలు బయటకు వెల్లడించలేదు. మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు.
ఇష్టానుసారం తోడేస్తున్నారు..
అద్దంకిలో గ్రావెల్, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ కీలకనేత శింగరకొండ సమీపంలోని అద్దంకి కొండను జేసీˆబీలతో ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. తవ్వకాలు ఆపిస్తే తమపై బదిలీ వేటు పడుతుందన్న భయంతో మైనింగ్, రెవెన్యూ అధికారులు మౌనముద్ర దాల్చారు. నేత అక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు. అద్దంకి సమీపంలో గుండ్లకమ్మ, మోదేపల్లి వద్ద చిలకలేరు వాగులో ఇసుక తోడేస్తున్నారు. మట్టి, ఇసుక ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు ఇసుక వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అనుమతులకు మించి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక, బుసక తవ్వి లేఅవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాలపై సొంత పార్టీ ప్రజాప్రతినిధే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం.
ఫిర్యాదు చేస్తే పట్టించుకొనేవారేరి?
* నగరం మండలంలో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి, నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారు. మురుగు కాలువలను వదలకుండా జేసీˆబీలతో తవ్వేస్తున్నారు. భారీ వాహనాల్లో మట్టి, ఇసుక తరలించి జేబులు నింపుకుంటున్నారు. సిరిపూడి వద్ద వారం రోజులుగా జేసీబీలతో పగలు, రాత్రులు ఇసుక తవ్వేసి టిప్పర్లలో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సెబ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 25 అడుగుల లోతున తవ్వుతుండటంతో అక్రమ క్వారీలు చెరువులుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని నగరం మండలంలో అక్రమ తవ్వకాలపై చినమట్లపూడి వాసులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కొన్ని రోజులు హడావుడి చేసి బడా నేత ఆదేశాలతో చేతులు ఎత్తేశారు.
* అద్దంకి ప్రాంతంలో అధికార పార్టీ నేతల తవ్వకాలపై ఉన్నతాధికారులకు ప్రతిపక్ష ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్లో ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పోటాపోటీగా గ్రావెల్, రేషన్ మాఫియా నడుపుతున్నారు. మార్టూరు మండలంలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఓ బడా నేత, కీలక నేత అనుచరుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అక్రమార్జన విషయంలో వైకాపా నేతల మధ్య విభేదాలు తలెత్తి ఏకంగా సీఎంవో, ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. వేటపాలెం, చినగంజాం మండలాల్లో పోటాపోటీగా ఇసుక తవ్వకాలు చేపట్టి విక్రయాలు చేస్తున్నారు. అక్రమాలపై గతంలో హడావుడి చేసిన సెబ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రస్తుతం పూర్తిగా చేతులెత్తేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
[ 22-04-2024]
వైకాపా అరాచకాలు, అవినీతిపై దిల్లీలో పోరాడుతున్న ఉద్యమకారిణి కోవూరు లక్ష్మిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందించారు. -
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
[ 22-04-2024]
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు. -
పత్తిపాడుకు తరలిన తెదేపా నాయకులు
[ 22-04-2024]
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పత్తిపాడుకు తరలివెళ్లారు. -
చెట్టును ఢీకొట్టిన ఆటో.. నలుగురికి గాయాలు
[ 22-04-2024]
టో చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం చింతపల్లి పాడు గ్రామంలో జరిగింది. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
[ 22-04-2024]
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి వైకాపా మూకలు నిప్పుపెట్టారు. -
సీఎం ఇంటి సమీపంలో గంజాయి గుప్పు.. విక్రేతలను కట్టిపడేసిన స్థానికులు
[ 22-04-2024]
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి విక్రేతలు పట్టుబడడం కలకలం రేపింది. -
జగనన్న.. గూడు పుఠాణి
[ 22-04-2024]
అన్నింట్లో అధినేతనే అనుసరించే కొందరు ప్రజాప్రతినిధులు జగనన్న కాలనీలకు భూసేకరణలోనూ చేతివాటం ప్రదర్శించారు. పేదలు నివాసం ఉండే ఇళ్లకు లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించారు. వాటి మెరక పేరిట మట్టి మెక్కేసి వదిలేశారు. -
దీవెనలన్నావు.. దగా చేశావు!
[ 22-04-2024]
అధికారంలోకి వచ్చాక అతని అసలు రూపం చూపించాడు. అసలు బోధనా రుసుములు ఎప్పుడొస్తాయో తెలియకుండా పోయింది. అది ఎంతమందికి జమవుతాయో.. ఎన్నాళ్లకు జమవుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. -
అమ్మ ఒడి నుంచి రూ.20 కోట్ల నొక్కుడు!
[ 22-04-2024]
ప్రజాధనాన్ని పేదలకు పంచుతుంటే విపక్షాలకు ఎందుకంత కడుపుమంట? వారి సంక్షేమానికి ప్రజాధనం వెచ్చించటం తప్పేనా? అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకునే సీఎం జగన్ అసలేం చేస్తున్నారో తెలుసా..? -
రాజధాని మహిళల కష్టాలు చూస్తే బాధేస్తోంది
[ 22-04-2024]
రాష్ట్రం డ్రగ్స్ క్యాపిటల్గా మారింది.. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లేవు..యువతకు ఉద్యోగాల్లేవు. ఇక్కడి మహిళల కష్టాలు చూస్తోంటే బాధేస్తోంది. -
సైకిల్ దూకుడు
[ 22-04-2024]
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం : బ్రాహ్మణి
[ 22-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించగల సత్తా మహిళలకే ఉందని నారా బ్రాహ్మణి అన్నారు. -
మేం లోకేశ్కే ఓటేస్తాం
[ 22-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థిని మురుగుడు లావణ్యకు నియోజకవర్గంలో ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురైంది. -
ఐదేళ్ల నిర్లక్ష్యానికి ఈ దారే సాక్ష్యం
[ 22-04-2024]
గుంటూరు జిల్లా తెనాలి బాపట్ల జిల్లా చందోలు మధ్య ప్రధాన రహదారి అమృతలూరు మండలంలో పలుచోట్ల ప్రమాదకరంగా మారింది. -
అల్లర్ల వేళ .. బలగాలు చేరేదెలా..
[ 22-04-2024]
గుంతల రహదారులతో ఇప్పటివరకు ప్రజలే కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకూ ఇబ్బందులు తప్పట్లేదు. -
ఈసీ నిబంధనల మేరకే పోస్టల్ బ్యాలెట్
[ 22-04-2024]
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ అన్నారు. -
జడ్పీకి నిధుల పోటు
[ 22-04-2024]
స్థానిక సంస్థలు స్వపరిపాలన చేసినపుడే గ్రామ స్వరాజ్యం సాధించినట్లవుతుందని మహాత్మగాంధీ పేర్కొన్నారు. -
నాడు ‘అన్న’దానం... నేడు అధ్వానం
[ 22-04-2024]
తెదేపా హయాంలో నగరాలు, పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను కలిసికట్టుగా సాగనంపుదాం
[ 22-04-2024]
రాష్ట్రంలో అరాచక పాలనపోయి, శాంతిభద్రతలు సవ్యంగాఉంటేనే వ్యాపారాలూ బాగుంటాయి.. ఈ విషయాన్ని గుర్తించి కలిసి కట్టుగా ముందుకు సాగుదామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. -
ఉపాధ్యాయులపై ఎందుకింత ఒత్తిడి?
[ 22-04-2024]
ఉపాధ్యాయులపై మరింతగా ఒత్తిడి తెస్తున్నారు. పిల్లలతో కలిసి ఎంతో హుందాగా ఉద్యోగం చేసే రోజుల్ని అయ్యవార్లు రెండేళ్ల క్రితమే కోల్పోయారు. -
వైకాపా నాయకుల అరాచకం
[ 22-04-2024]
పల్నాడులో వైకాపా శ్రేణుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా వారి అరాచకాలు సాగుతూనే ఉన్నాయి. -
వైకాపా కార్యకర్త మృతి కేసులో ఇద్దరు యువకుల అరెస్టు
[ 22-04-2024]
తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపం ప్రాంతంలో ఈ నెల 19వ తేదీ రాత్రి ద్విచక్రవాహనం ఢీకొని వైకాపా కార్యకర్త వెంకటరెడ్డి మృతి చెందారు. -
ట్రావెల్స్ బస్సు బీభత్సం
[ 22-04-2024]
నామ్ రహదారిపై అద్దంకి బంగ్లా రోడ్డు వద్ద రెండు ద్విచక్రవాహనాలు, గోపాలపురం వద్ద నాలుగు చక్రాల ఆటోను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. -
ప్రకాశం బ్యారేజీకి 3,209 క్యూసెక్కుల నీరు
[ 22-04-2024]
పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం దిగువకు ప్రకాశం బ్యారేజికి 3209 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా