మోసాలు.. బయటికొస్తున్నాయ్
అచ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్.. లాగిన్ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.
ప్రభుత్వ ఉద్యోగులతో రేఖాశ్రీ కుమ్మక్కు
వారికి డబ్బులు ముట్టజెప్పి శిక్షణ తతంగం
నకిలీ ఎస్ఆర్లతో నిరుద్యోగులకు టోపీ
ఈనాడు, అమరావతి,న్యూస్టుడే,సూర్యారావుపేట
అచ్చు ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చినట్లే నియామక పత్రం.. ఐడీ కార్డు.. సర్వీసు రిజిస్టర్.. లాగిన్ ఐడీ.. ఎక్కడా అనుమానం రాకుండా ప్రభుత్వ కార్యాలయంలోనే శిక్షణ.. నెలానెలా ఠంఛనుగా బ్యాంకు ఖాతాలో జీతం.. కళ్ల ముందే అన్నీ కనిపిస్తుండడంతో నిజమే అని నిరుద్యోగ యువత నమ్మారు. రూ.లక్షల్లో డబ్బు ముట్టజెప్పి చేరారు. చివరకు వ్యవహారం తిరగబడడంతో అవాక్కయ్యారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతను మోసం చేసిన రేఖశ్రీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి రూ.కోట్లలో డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో సూర్యారావుపేట పోలీసులు ఆమెను శనివారం అరెస్టు చేశారు. నిందితురాలిపై వివిధ జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 11 కేసులు ఉన్నట్లు తేలింది.
పాత పరిచయాలు ఉపయోగించుకుని..
ఒక్కో శాఖలో ఒక్కో ఉద్యోగితో మిలాఖత్ అయి.. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి నిరుద్యోగులకు అనుమానం రాకుండా వ్యవహారం అంతా నడిపిస్తుంది. విద్యుత్తు శాఖ, అంగన్వాడీ, రెవెన్యూ.. ఇలా శాఖల్లో కొంత మందితో నిందితురాలు మాట్లాడుకుంది. వారికి డబ్బులు ఇచ్చి ఒప్పించింది. నిరుద్యోగులకు ప్రొబేషన్ కాలంలో వారి కార్యాలయంలోనే నామమాత్రంగా శిక్షణ ఇప్పించింది. ప్రభుత్వ కార్యాలయమే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ఇదంతా చేస్తుంది. ఉద్యోగం అంటూ వారి నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత సంబంధిత ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చింది. రేఖశ్రీ గతంలో ఉయ్యూరులో వీఆర్వోగా పనిచేసింది. అప్పటి పరిచయాలతో ఆమెకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తీసుకుని సహకరించారు.తమకు పని ఉండడం లేదని అభ్యర్థులు అడిగితే.. ప్రారంభంలో పెద్ద పనేం ఉండదని నిందితురాలు నమ్మించింది. నిరుద్యోగులకు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు రేఖశ్రీ శిక్షణకు పంపించినట్ల పోలీసుల విచారణలో తేలింది. విచారణలో వారు ఈ వ్యవహారం గురించి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తే రేఖశ్రీకి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనేది వెలుగుచూసే అవకాశం ఉంది.
నియామక పత్రంతో పాటే సర్వీసు రిజిస్టర్
శిక్షణలో చేరిన సమయంలోనే నిందితురాలు అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే సర్వీసు రిజిస్టర్ను కూడా అభ్యర్థుల ఇళ్లకు పోస్టులో పంపించింది. ఇందులో సంబంధిత వ్యక్తికి సంబంధించి అన్ని వివరాలను పొందుపర్చి తయారు చేసింది. వేలిముద్రలు, హోదా, జీతం, ఉద్యోగంలో నియమితులైన తేదీ, తదితర అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. దీంతో నిజమే అని నిరుద్యోగులు నమ్మారు. కానీ సర్వీసు రిజిస్టర్ను ఇంటికి పంపడంపై కొంత మంది నిందితురాలిని ప్రశ్నించారు. ఎస్ఆర్ అనేది పై అధికారి వద్ద ఉంటుంది కదా.. మాకు ఎందుకు పంపించారు? అని అడిగారు. ఉన్నతాధికారి వద్ద కూడా ఉంటుంది.. మీకు డూప్లికేట్ కాపీ ఇస్తున్నాం.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరామని మీకు భరోసా కల్పించేందుకు ఇచ్చానని ఆమె నమ్మించింది. ప్రభుత్వ ఉద్యోగుల వెబ్సైట్ అని భ్రమింపజేసేలా దీనిని కూడా సొంతంగా తయారు చేయించినట్లు బయటపడింది. ఇందులో లాగిన్ అయ్యేందుకు ప్రతి ఒక్కరికి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కూడా ఇచ్చింది. ఇందులో ఉద్యోగుల పేరు, చిరునామా, పనిచేసే కార్యాలయం, ఫొటో, సంతకం, తదితర వివరాలు పొందుపర్చింది. ఇంత పకడ్బందీగా రేఖశ్రీ వెనుక పెద్ద ముఠా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. మోసపోయిన నిరుద్యోగులు తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే నిందితురాలు నిరాకరిస్తోంది. తన వద్ద డబ్బులేదని, ఏమీ చేయలేనని, అవసరమైతే జైలుకైనా వెళ్తానని సమాధానం ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం 15 మంది వరకు బాధితులు సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ముందుకు వస్తేనే ఎంత మేరకు మోసం జరిగిందో గుర్తించవచ్చని పోలీసులు చెపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో