గడువులోగా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అర్జీలు అందించినా పరిష్కారం కాకపోవడంతో జిల్లా పాలనాధికారికి తమ సమస్యను విన్నవించాలని స్పందన కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అర్జీలు అందించినా పరిష్కారం కాకపోవడంతో జిల్లా పాలనాధికారికి తమ సమస్యను విన్నవించాలని స్పందన కార్యక్రమానికి అర్జీదారులు తరలివచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భూమి, బీమా, గ్రామంలో నెలకొన్న డ్రెయినేజీ, బియ్యం కార్డు.. ఇలా వివిధ రకాల అంశాలపై 145 అర్జీలు అందించారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువు లోగా నాణ్యంగా పరిష్కరించాలన్నారు. సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఫిర్యాదుదారు సంతృప్తి పడేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న వాటిపై సమీక్షించి సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖర్రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ లలిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డ్రెయినేజీ శుభ్రం చేయకుండానే చేశామంటున్నారు
పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అధికారులకు వినతిపత్రం అందించాం. దీనిపై డివిజన్ స్థాయి అధికారులు డ్రెయినేజీ శుభ్రం చేయించకుండానే చేశారని నివేదిక ఇచ్చారని ఎ.మల్లికార్జునరావు స్పందనలో అర్జీ అందించారు. గ్రామంలో డ్రెయినేజీ వల్ల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి డ్రెయినేజీని శుభ్రం చేయించాలని కోరారు.
బీమా కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపు: కడియం లూర్దు మేరీ, గౌతమీనగర్, గుంటూరు
2019లో కుమారుడు సుధాకర్ పెయింటింగ్ పని చేస్తూ విద్యుదాఘాతంతో చనిపోయాడు. అప్పుడు ప్రభుత్వం తరఫున వైఎస్సార్ బీమా వస్తుందని చెప్పారు. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బీమా అందలేదు. కుమారుడు చనిపోయిన బాధతో కార్యాలయాలకు వెళ్తున్నా కనీసం అధికారులు స్పందించడం లేదు. గతంలో పని చేసిన ఓ అధికారి తమ వద్ద వివరాలన్నీ సేకరించి, ఇప్పుడు అసలు అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్కు కూడా స్పందించడం లేదు. అధికారులు స్పందించి వైఎస్ఆర్ బీమా అందించాలి.
పొలం కొనుగోలు పేరుతో మోసం
మంగళగిరి మండలం చినవడ్లపూడిలో గతేడాది డిసెంబర్లో ఎకరం పొలాన్ని జి.సాయిలక్ష్మి, అశోక్ దంపతుల నుంచి కొనుగోలు చేశానని, అయితే వారు ఆ పొలాన్ని ముందుగానే మరొకరికి అమ్మి తనను మోసం చేశారని బాధితుడు ఎం.వెంకటేశ్వరరావు వాపోయారు. ఈమేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో అధికారులకు వివరించారు. హైదరాబాద్ నుంచి వచ్చి చినవడ్లపూడి సర్వేనెంబర్ 75/2, 74/3లోని ఎకరం పొలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సదరు దంపతులు తనను మోసగించారని, ఇప్పుడు మాట్లాడదామన్నా వారు స్పందించడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి సదరు భూమికి సంబంధించి అడంగల్, పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు