వారికిది మామూలే
గుంటూరు నగరంలో ఈ-ఆటోలు వినియోగంలోకి తేకుండా మూలపెట్టేశారు. పర్యవసానంగా అవి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ దుమ్ముధూళి కొట్టుకుపోయి నామరూపాలు కోల్పోతున్నాయి.
రూ.12కోట్ల వాహనాలు షెడ్కే పరిమితం
సీఎం ప్రారంభించాలని ఎదురుచూపులు
కేవీపీ కాలనీలో వాహన షెడ్లో ఆరుబయటే వందలాది ఈ-ఆటోలు
ఈనాడు, అమరావతి: గుంటూరు నగరంలో ఈ-ఆటోలు వినియోగంలోకి తేకుండా మూలపెట్టేశారు. పర్యవసానంగా అవి ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ దుమ్ముధూళి కొట్టుకుపోయి నామరూపాలు కోల్పోతున్నాయి. నాలుగైదు నెలలుగా కేవీపీ కాలనీలోని వాహన షెడ్కే అవి పరిమితమయ్యాయి. గతేడాది నవంబరులో 220 ఈ-ఆటోలు (ఎలక్ట్రికల్ ఆటోస్) కొనుగోలు చేశారు. వాటికి రూ.12 కోట్లు వెచ్చించారు. వాటి ప్రారంభానికి సీఎం అపాయింట్మెంట్ దొరక్క ఎప్పటికప్పుడు వాటి వినియోగాన్ని వాయిదా వేస్తున్నారు. వాటిని ఇంకెన్నాళ్లు మూలపెడతారనే విమర్శలు వస్తున్నా అధికారులు, కౌన్సిల్ మాత్రం కిమ్మనడం లేదు.
కాలుష్య రహిత నగరమే లక్ష్యంగా...
కాలుష్య రహిత నగరాలే ధ్యేయంగా సాధ్యమైనంత వరకు బ్యాటరీ సాయంతో నడిపే ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన యునెడో సంస్థ సూచిస్తోంది. నగరంలోని 207 సచివాలయాల పరిధిలో ఈ-ఆటోల కొనుగోలుకు యునెడో రూ.8కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. మిగిలిన రూ.4కోట్లు నగరపాలక జనరల్ ఫండ్స్ నుంచి వెచ్చించారు. ఇప్పటికే వాహనాలు సమకూర్చుకున్నా వినియోగంలో పెట్టలేదు. ఈ వాహనాలకు ఇంధనం అవసరం లేదు. కేవలం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు వాహనాలు నడుస్తాయి. సంగంజాగర్లమూడి వద్ద ఉన్న నగరపాలక జలాశయంలో నీళ్లపై తేలాడే సోలార్ పలకల ద్వారా విద్యుత్తు సమకూర్చుకునేలా సోలార్ యూనిట్ నెలకొల్పారు. ఒక్కో సచివాలయం పరిధిలో ఒక ఆటోను నడపటానికి అవసరమైన వాహన డ్రైవర్లు, చెత్త సేకరణకు పారిశుద్ధ్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. కానీ వాహనాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం ట్రాక్టర్లు, డీసీఎం వాహనాలతో నగరంలో చెత్త సేకరణ చేస్తున్నారు. ఆ భారీ వాహనాలు కొన్ని వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాలు రావడం లేదని చెప్పి ఇంటింటా వెలువడే చెత్తను రోడ్లు, మురుగు కాల్వల వెంబడి పడేస్తున్నారు.దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఇంటికి, వీధికి వాహనం వెళ్లి చెత్త సేకరించుకొచ్చేలా చిన్న సైజులో ప్రత్యేకంగా ఈ-ఆటోలను రూపొందించారు.
ఇంధన వ్యయాలు ఆదా...
ఈ వాహనాల వినియోగంతో కాలుష్యం తగ్గుతుంది. ఇంధన వ్యయాలు ఏటా రూ.కోట్లలో ఆదా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలతో ఇమిడి ఉన్న ఈ వాహనాలను సీఎం చేతులమీదుగా ప్రారంభించాలని చెప్పి నెలల తరబడి పక్కన పెట్టడం ఏమిటి? మేయర్, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులను పిలిచి వాటిని ప్రారంభిస్తే ఇంధన వ్యయాలు ఆదా అయ్యేవని నగరపాలక వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చెత్తసేకరణ వాహనాలతో పాటు అధికారులు వినియోగించే వాహనాల కోసం నెలకు రూ.50 లక్షలు ఇంధన బిల్లులే అవుతున్నాయి.
కౌన్సిల్లో అడిగితే.. రిజిస్ట్రేషన్ కాలేదని...
ఆటోలు వినియోగించకుండా పక్కన పెట్టిన విషయమై గతంలో కొందరు కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రశ్నించారు. అప్పట్లో ఆ వాహనాలు రిజిస్ట్రేషన్ కాలేదని, అందుకే వినియోగించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు బదులిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వాటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. అయినా ఇప్పటి వరకు వాటిని వినియోగంలోకి తేలేదు. ప్రయోగాత్మకంగా కొన్ని వాహనాలు నడుపుతున్నాం. చెత్త సేకరణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని మిగిలినవి కూడా సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయమై చర్యలు తీసుకుంటామని నగరపాలక ఎస్ఈ పీవీవీ భాస్కర్ ‘ఈనాడు’కు తెలిపారు. జూన్ 2న నగరంలో సీఎం కార్యక్రమం ఉందని, ఆయన చేతులమీదుగా వాహనాలు ప్రారంభించేలా కలెక్టర్తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!