ప్రభుత్వ భూములమ్మినా పట్టించుకోరే
వినుకొండ పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న సుమారు 13.95 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి క్రయ, విక్రయాలు జరిగాయి. ఏపీ అసైన్డ్ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) 1977 ప్రకారం ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం.
వినుకొండలో భూ విక్రయాలపై చర్యలు తీసుకోవాలన్నా లోకాయుక్త
ఆర్నెళ్లయినా అధికారుల చర్యలు శూన్యం
క్రయ, విక్రయాలు జరిగిన అసైన్డ్ భూమి ఇదే..
వినుకొండ, న్యూస్టుడే : వినుకొండ పట్టణానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న సుమారు 13.95 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి క్రయ, విక్రయాలు జరిగాయి. ఏపీ అసైన్డ్ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) 1977 ప్రకారం ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. ఈ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి తిరిగి భూమి స్వాధీనం చేసుకుంటామని కలెక్టర్ శివశంకర్ లోకాయుక్తకు లిఖితపూర్వకంగా నివేదించారు. ఆర్నెళ్లయినా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యం. కనీసం ఆ భూమిలో ఇప్పటి వరకు అధికారులు బోర్డులు ఏర్పాటు చేయకపోగా స్థిరాస్తి వ్యాపారులు నేల చదును చేస్తుంటే చేష్టలుడిగి చూస్తున్నారు.
వినుకొండ మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వివిధ సర్వే నంబర్లలోని అసైన్డ్ భూములు చట్టవిరుద్ధంగా క్రయ, విక్రయాలు జరిగాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హయత్నగర్కు చెందిన టి.సుబ్బారెడ్డి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారులకు నోటీసులు జారీ కావడంతో అప్పటి తహశీల్దార్ జి.అనిల్కుమార్, ఆర్డీఓ శేషిరెడ్డి నివేదికలను అనుసరించి కలెక్టర్ శివశంకర్ లోకాయుక్తకు సమాధానం పంపారు. మొత్తం 13.95 ఎకరాలు చుక్కల భూమితో పాటు కుంట, రోడ్డు తదితరులున్నాయని పేర్కొన్నారు. 1954 తర్వాత వీటిని అసైన్డ్ చేసినందున వాటి క్రయ, విక్రయాలు చెల్లవని తెలిపారు. ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి ప్రభుత్వ భూములను రక్షిస్తామని నివేదికలో వివరించారు.
చర్యలు ఏవీ?: జాతీయ రహదారి పక్కనుండటంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రూ.లక్షల్లో ఉన్న భూమి రూ.కోట్లు పలుకుతోంది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగి కొన్నారు. గతంలో ఈ భూమిని కొన్న వ్యాపారులు వెంచర్ వేస్తే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములను ఎలా అమ్ముతారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి తహశీల్దార్ సైతం అందులో బోర్డు పెట్టించి క్రయ, విక్రయాలు చేయొద్దని హెచ్చరించారు. తర్వాత లోకాయుక్తలో కేసు నమోదు వ్యవహారం బయటపడటం, అధికారులు నివేదిక ఇవ్వడం వంటివి జరిగాయి. ఈసారి అధికార అండతో భూములు కొనడంతో అడ్డంకులు లేకుండా వ్యవహారం నడుస్తోంది. లోకాయుక్తకు నివేదిక ఇచ్చిన అధికారులు ఇప్పుడు నేల చదును చేస్తుంటే చర్యలు తీసుకోవడం లేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న స్థానికులు అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అంటూ ముక్కున వేలుకుంటున్నారు. ఈవిషయమై వినుకొండ తహశీల్దారు కిరణ్కుమార్ని ప్రశ్నించగా, గతంలో మధ్యంతర నివేదిక సమర్పించామని, అన్ని పరిశీలించి త్వరలో పూర్తి వివరాలతో లోకాయుక్తకు నివేదిక ఇస్తామన్నారు. భూములను రక్షిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్