బాలికల్లో రక్తహీనత!
ఉమ్మడి గుంటూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. సగటున ఏ పాఠశాలలో చూసినా మొత్తం అమ్మాయిల్లో మైల్డ్, మోడరేట్ మధ్య ఉన్నవారే సగం మంది ఉంటున్నారు.
అధిగమించేందుకు మొక్కుబడి చర్యలు
మాత్రలు వేసుకోకున్నా పట్టించుకోరు
పాఠశాలలో రక్తహీనత పరీక్షలు చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది
ఈనాడు, అమరావతి: ఉమ్మడి గుంటూరులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది. సగటున ఏ పాఠశాలలో చూసినా మొత్తం అమ్మాయిల్లో మైల్డ్, మోడరేట్ మధ్య ఉన్నవారే సగం మంది ఉంటున్నారు. ఇంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గుర్తించినా దానిని అధిగమించేందుకు విద్య, వైద్య, ఆరోగ్యశాఖలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదు.
ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ప్రకాష్ గుంటూరు జిల్లా నారాకోడూరు జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పట్లో ఆయన పిల్లల హెల్త్ రికార్డ్స్ పరిశీలించగా చాలా మందిలో రక్తహీనత ఉన్నట్లు తెలుసుకున్నారు. పాఠశాలలకు సెలవులు అయినా అసలు విద్యార్థినులకు ట్యాబ్లెట్లు పంపిణీ చేశారా లేదా? వాటిని వేసుకుంటున్నారా లేదా అని నేరుగా పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఓ విద్యార్థిని అయితే అసలు ట్యాబ్లెట్ షీట్లు ఇచ్చినవి ఇచ్చినట్లు పక్కన పెటినట్లు ఆయన పరిశీలనలో వెలుగుజూసింది. కొందరికి ఆ ట్యాబ్లెట్లు సైతం పంపిణీ చేయలేదు.
ఏప్రిల్ 28 నుంచి పాఠశాలలకు సెలవులిచ్చారు. కొందరు హెచ్ఎంలు ముందుగానే మేల్కొని వేసవి సెలవుల్లోనూ ఇళ్ల వద్దే ఉంటూ మందులు వేసుకోవాలని సూచించారు. ఆ మేరకు వారి పరిధిలోని పీహెచ్సీ వైద్యాధికారులకు చెప్పి పంపిణీ చేయించారు. అయితే సరిపడా ఔషధ నిల్వలు లేవని అరకొరగా ఇచ్చారు. నెలకు ఒక్కో విద్యార్థికి మూడు షీట్లు ఇవ్వాలి. అలాంటిది అత్యధిక పీహెచ్సీల పరిధిలో ఒకటి, రెండు షీట్లకు మించి ఇవ్వలేదని సత్తెనపల్లి డివిజన్కు చెందిన ప్రధానోపాధ్యాయుడొకరు వివరించారు.
* మరోవైపు వైద్యులు తమకు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందించడానికి శిక్షణకు వెళుతున్నామని, సీఎం పర్యటన సభల వద్ద డ్యూటీలు ఉన్నాయని చెప్పి ఆ మందులు ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో చాలా మంది హెచ్ఎంల్లో ఆందోళన నెలకొంది. ట్యాబ్లెట్లు మింగని కారణంగా సమస్య ఇంకాపెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలతో హడల్
ఒకవైపు జేవీకే కిట్ల నాణ్యత, పాఠ్య పుస్తకాలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకోవడానికి ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలు చేస్తున్నారని, నారాకోడూరులో మాదిరి మిగిలిన స్కూళ్ల పరిధిలో కూడా ఆయన పర్యటనలకు వెళితే ట్యాబ్లెట్ల లేమి వంటి సమస్యలు బయటపడతాయని తెలిపారు. ఇది వైద్యాధికారుల తప్పిదమేనని, పిల్లలకు ఎన్ని షీట్లు అవసరమో గుర్తించి ఆ మేరకు నిల్వలు సమకూర్చుకోవాల్సిన బాధ్యత వారిదేనని, తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారని వైద్యుల తీరుపై ఉపాధ్యాయ వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొన్నిచోట్ల అయితే ట్యాబ్లెట్లే పంపిణీ చేయలేదు. వేసవి సెలవులు అయినా నాడు-నేడు పాఠశాలల పనులు, ప్రవేశాల డ్రైవ్, పది ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధించడానికి హెచ్ఎం, క్లాస్ టీచర్లు, సబ్జెక్టు టీచర్లు నిత్యం ఎవరో ఒకరు అందుబాటులోనే ఉంటున్నారు. కనీసం ఇప్పుడు ఇచ్చినా వాటిని తామే పిల్లలు ఇళ్లకు వెళ్లి అందజేస్తామని చెబుతున్నా మా మొర ఆలకించడం లేదని అంటున్నారు.
బీకాంప్లెక్సు ఇవ్వాలంటున్నహెచ్ఎంలు
పిల్లల్లో అభ్యసనా సామర్థ్యాలు లోపించినా, వారు ఉత్తీర్ణులు కాకపోయినా, రక్తహీనతతో బాధపడుతున్నా అన్నింటికి క్లాస్ టీచర్, హెచ్ఎంలను బాధ్యులను చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పౌష్టికాహారం పెట్టాలి. వైద్యులు ఇచ్చే మందులు పిల్లలు వేసుకునేలా చూడాలి. రక్తహీనత సమస్య అధిగమించాలంటే ప్రస్తుతం ఇచ్చే ట్యాబ్లెట్లకు అదనంగా బీకాంప్లెక్సు మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలు కోరుతున్నారు.
సమస్య పెరుగుతుందేమోనని ఆందోళన
వాస్తవానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల్లో రక్తహీనత సమస్య ఏమైనా తగ్గిందా లేదా తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు చేయించాలి. చివరిగా ఫిబ్రవరిలో నిర్వహించారు. వేసవి సెలవులు ముగియగానే స్కూళ్లు తెరిచిన తర్వాత జూన్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని, వాస్తవానికి ఈ సెలవుల్లో ట్యాబ్లెట్లు ఉన్నా ఇంటి వద్ద సరిగా వేసుకోక, కొందరికి అవి వేసుకోవాలనుకున్నా మందులు ఇవ్వని కారణంగా సమస్య మరింత పెరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రతి గురువారం పిల్లల్లో ఎనీమిక్ సమస్య గుర్తించడానికి స్థానికంగా ఉండే పీహెచ్సీ వైద్యులు, వారి సిబ్బంది, గ్రామాల్లో ఉండే ఏఎన్ఎం, అంగన్వాడీ, ఆశా, ఎంపీహెచ్డబ్లూ (ఫిమేల్), సచివాలయంలో ఉండే ఆరోగ్య కార్యకర్తలు వీరంతా ఒక బృందంగా ఏర్పడి ఎనీమిక్ పరీక్షలు నిర్వహిస్తారు. 9-12 గ్రాముల మధ్య రక్తం ఉండే వారికి ఎలాంటి ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంతకన్నా తగ్గితే మాత్రం వారిని మైల్డ్, మోడరేట్, సీవియర్ (మూడు కేటగిరీలు)గా నిర్ధారిస్తారు. ఆ మేరకు డోసులు పెంచి పోలిక్ యాసిడ్, టెర్రా సల్ఫేడ్ టా యబ్లెట్లు ఇచ్చి అవి వాడాలని సూచిస్తారు. ఈ ట్యాబ్లెట్లు పిల్లలు వేసుకుంటున్నారా లేదా అనేది నిత్యం అటెండెన్స్ యాప్లో నమోదు చేయాలి. మైల్డ్, మోడరేట్ వాళ్లు రోజుకు ఒకటి, సీవియర్గా ఉన్నవాళ్లకు రోజుకు రెండు చొప్పున వాటిని వేస్తారు.
ఇవీ కారణాలు
చిన్న వయస్సులో వివాహాలు
మేనరిక పెళ్లిళ్లు
గర్భిణులుగా ఉన్న సమయంలో మందులు సరిగ్గా వేసుకోకపోవడం
జనటిక్ సమస్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!