బదిలీలలు!
బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. రేషనలైజేషన్, రీ అపోర్షన్మెంట్కు గురైన టీచర్లు సర్వీస్ పాయింట్లు ఇష్టానుసారం వేసుకుని దరఖాస్తులు సమర్పించారు.
గుంటూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయం
ఈనాడు, అమరావతి: బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. రేషనలైజేషన్, రీ అపోర్షన్మెంట్కు గురైన టీచర్లు సర్వీస్ పాయింట్లు ఇష్టానుసారం వేసుకుని దరఖాస్తులు సమర్పించారు. బదిలీల సీనియారిటీ జాబితాలో ముందుండాలని ఎవరికివారు అక్రమాలకు పాల్పడ్డారు. అసలు ఈ పాయింట్ల కేటాయింపుపై పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, సర్క్యులర్లు, ఉత్తర్వుల్లో సరైన స్పష్టత ఇవ్వకపోవడం కూడా వారు అడ్డదారులు తొక్కడానికి కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తుల గడువు ముగియడంతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా తయారు చేసి దాన్ని సీఎస్ఈ వెబ్సైట్లో పెట్టారు. అందులో కొందరి టీచర్ల లీలలు బయటపడ్డాయి.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో అన్ని క్యాడర్లలో కలిపి 5767 మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీఎస్ఈ) వెబ్సైట్లో పెట్టి వీటిల్లో ఏమైనా తప్పులున్నా.. తేడాలున్నా, పాయింట్ల కేటాయింపులో పారదర్శకత లోపించినా, రావాల్సిన వాటి కన్నా ఎవరికైనా అధికంగా వచ్చినా అభ్యంతరాలు తెలియజేయాలని సాటి ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం ఒక్క రోజే ఉమ్మడి గుంటూరులో వందల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చి పడ్డాయి. వాటిని చూసి విద్యా శాఖ వర్గాలే ఆందోళన చెందాయి. ఇన్ని అభ్యంతరాలు రావడంతో తలలు పట్టుకుంటున్నారు. హెచ్ఎం, ఎంఈవో, డీవైఈఓలు ప్రొవిజనల్ జాబితా ఖరారు కాకుండానే ఈ అక్రమాలు గుర్తించి బాధ్యులైన టీచర్లతో తిరిగి దరఖాస్తులు చేయిస్తే ఇంత పెద్దమొత్తంలో అభ్యంతరాలకు ఆస్కారం ఉండేది కాదు. కానీ విద్యా శాఖ వర్గాలు ఆ పని చేయలేదు. బదిలీల ప్రక్రియను తేలిగ్గా తీసుకోవడం, వారి ప్రాథమిక పరిశీలన లేకుండానే ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా రూపొందించడం వంటివి వారి నిర్వాకాన్ని తెలియజేస్తున్నాయి. ఎవరైతే ఇష్టానుసారం మార్కులు వేసుకున్నారో వారంతా అప్రమత్తమై వచ్చి తమకు తెలియజేయాలని, ఇందుకు భిన్నంగా తమ పరిశీలనలో ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డారని గుర్తిస్తే వారిపై సీసీఏ రూల్స్ అనుసరించి చర్యలు తీసుకుంటామని గుంటూరు నోడల్ డీఈఓ మంగళవారం సాయంత్రం హెచ్ఎం, ఎంఈఓ, డీవైఈఓలకు సర్క్యులర్ పంపడం గమనార్హం.
* తెనాలి డివిజన్లోని పలు పాఠశాలల్లో విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని ఆ మధ్య రేషనలైజేషన్ చేసి కొందరు టీచర్లను వేరే పాఠశాలకు పంపారు. అదే విధంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల పిల్లలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ప్రక్రియ వల్ల కొందరు టీచర్లకు ఆ పాఠశాలలో పని చేయడానికి వర్క్లోడ్ లేదని, వారిని పోస్టుతో సహా పిల్లలు ఉన్న చోటకు సర్దుబాటు చేశారు. వీరిని రీఅపోర్షన్మెంట్ కింద వచ్చిన టీచర్లుగా పరిగణించి వారికి గతంలో ఏదైతే స్కూల్లో పనిచేశారో ఆ స్కూల్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అసలు మతలబు ఇక్కడే చోటుచేసుకుంది. గతంలో వారు ఎన్నాళ్లయితే ఒక పాఠశాలలో పనిచేశారో ఆ స్కూల్ సర్వీస్తో పాటు ప్రస్తుతం పనిచేసే పాఠశాల సర్వీస్ పాయింట్లు తమకు కలుస్తాయని దరఖాస్తులో పేర్కొన్నారు. దీని వల్ల చాలా మంది టీచర్లకు వాస్తవంగా రావాల్సిన పాయింట్ల కన్నా అధికంగా రావడంతో వారు సీనియారిటీ జాబితాలో ముందుకెళ్లారు.
* ఒక్క తెనాలి డివిజన్లోనే కాదు సత్తెనపల్లి, నరసరావుపేట, బాపట్ల డివిజన్లలోని పలు స్కూళ్లల్లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రొవిజనల్ జాబితాను ముందు పెట్టుకుని బాధ్యులైన ఎంఈఓ, డీవైఈఓలు ఈ సర్వీస్ పాయింట్లపై కుస్తీ పడుతున్నారు. కేటగిరీ పాయింట్లను కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా వేసుకున్నారని గుర్తించారు.
* 30 శాతం హెచ్ఆర్ఏ వర్తించే ప్రధాన నగరాల్లో ఏడాదికి ఒకటి, సబర్బన్ ప్రాంతాల్లో 2, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి 3 పాయింట్ల చొప్పున వారు పనిచేసిన కాలానికి పొందొచ్చు. ఇందుకు విరుద్ధంగా కొందరు దరఖాస్తుల్లో ఎక్కువ పాయింట్లు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ గందరగోళంపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతూ ప్రతి దరఖాస్తును ప్రత్యేక బృందాలను పెట్టి తనిఖీ చేయిస్తున్నారు. సర్వీసు పాయింట్లపై ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే వాటిని కేటాయించనున్నట్లు విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కొందరు తప్పుల తడకగా పెట్టుకున్నారని, వాటిని సరి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తి చేసి ఏ ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
పాయింట్లపై వచ్చిన అభ్యంతరాలు 430
మంగళవారం రాత్రికి పరిష్కరించినవి: 70
స్క్రూట్నీ చేస్తున్న బృందాలు: 3
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
[ 19-04-2024]
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
[ 19-04-2024]
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు