ముంచెత్తిన వాన
జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్మి గాలి దుమారం చెలరేగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాన పడింది.
వాగులో ఉద్ధృతంగా నీటి ప్రవాహం
పిడుగుపాటుకు జిల్లాలో ఒకరి మృతి
పర్చూరు: బోడవాడ వద్ద మిరప కల్లం చుట్టుముట్టిన వరద నీరు
బాపట్ల, న్యూస్టుడే: జిల్లాలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల సమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు కమ్మి గాలి దుమారం చెలరేగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాన పడింది. పిడుగుపాటుకు బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న మార్టూరుకు చెందిన అక్కయ్యస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడు పోలేశ్వరరావుకు గాయాలయ్యాయి. భారీ వర్షానికి మార్టూరు మండలం డేగరమూడి వద్ద వాగు పొంగి ప్రవహించింది. పర్చూరు మండలం బోడవాడకు చెందిన కూనంనేని వీరాంజనేయులు మార్టూరులో బంధువుల ఇంట శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తూ డేగరమూడి వద్ద చప్టాపై వాగు నీటి ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. వాగులో ముళ్ల చెట్ల మధ్య ఇరుక్కుపోయిన వీరాంజనేయులును స్థానికులు, పోలీసులు కాపాడి చికిత్స నిమిత్తం మార్టూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాపట్ల, పర్చూరు, అద్దంకి, కొరిశపాడు, చినగంజాం, చెరుకుపల్లి, రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, అమృతలూరు మండలాల్లో వర్షం కురిసింది. చినగంజాంలో కురిసిన వర్షానికి ఉప్పు కరిగి రైతులు భారీగా నష్టపోయారు.
ఉప్పు కరగడంతో పారతో కువ్వను సరిచేసుకుంటున్న రైతు
మడుల్లో ఉప్పు కరిగి రూ.1.60 కోట్ల నష్టం
చినగంజాం, న్యూస్టుడే: చినగంజాంలో మంగళవారం భారీ వర్షం కురవడంతో ఉప్పు రైతులకు నష్టం వాటిల్లింది. పది రోజుల వ్యవధిలో రెండోసారి వర్షం కురవగా మధ్యలో తీవ్రమైన ఎండలు, వడగాలులు వీచడంతో కొఠారు మడుల్లో ఉప్పు కల్లు పెరిగింది. మరో రెండు రోజుల్లో పంట మడుల నుంచి తీద్దామనుకుంటున్న తరుణంలో కురిసిన వర్షానికి సుమారు 2,000 ఎకరాల్లోని ఉప్పు నీటి పాలయిందని రైతులు ఆర్.వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారావు తెలిపారు. ఎకరానికి 20 క్వింటాళ్ల చొప్పున 40 వేల క్వింటాళ్ల ఉప్పు కరిగింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.400 ఉండగా దీని ప్రకారం రూ.1.60 కోట్ల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడులు పెరగడానికి మే నెల కీలకం. అలాంటి మాసంలో పది రోజుల్లో రైతులను కోలుకోలేని విధంగా వర్షం రెండో దపా దెబ్బతీసిందని రైతు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మార్టూరు: జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలిచిన వర్షపు నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.