పైసలిస్తేనే.. దస్త్రం కదిలేది!
భూముల రీసర్వే రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి, పొరపాటున ఇతరులు లేదా ప్రభుత్వ భూమిగా నమోదై ఉండడం వంటి వాటిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెవెన్యూలో అవినీతి జలగలు
లంచం ఇచ్చుకోలేక సామాన్యుల గగ్గోలు
బాపట్ల, పర్చూరు, చెరుకుపల్లి గ్రామీణ న్యూస్టుడే: భూముల రీసర్వే రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. పూర్వీకుల ఆస్తి, పొరపాటున ఇతరులు లేదా ప్రభుత్వ భూమిగా నమోదై ఉండడం వంటి వాటిని ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, అక్రమాలపై ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిపై విచారణ జరగకుండా మచ్చిక చేసుకోవడం, ఒక వేళ జరిగినా చర్యలు లేకుండా నివేదికలు పక్కన పెట్టించుకోవడం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారుల అనుసరిస్తున్న వైఖరిగా చెబుతున్నారు. వివాదాలలో ఉన్న భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు కోరుకునే వారి నుంచి మరింత మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే ఏదొక సాకు చూపి బాధితులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. జాతీయ రహదారులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపుల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 216ఏ జాతీయ రహదారి భూసేకరణలో భూమి కోల్పోయిన బాపట్లకు చెందిన రైతు అలపర్తి కోటేశ్వరరావుకు పరిహారం చెల్లించటానికి రూ.లక్ష డిమాండ్ చేసి తహశీల్దారు కార్యాలయంలో లంచం వసూలు చేస్తుండగా తహశీల్దారు రాఘవయ్యను అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
అలా ఇవ్వగానే.. ఇలా పని పూర్తి
జిల్లాలోని ఓ తీర గ్రామంలో సర్వే కోసం రైతు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగాడు. అధికారులు, సిబ్బంది రోజూ తిప్పించుకున్నారు. రూ.80 వేలు లంచం ఇవ్వగానే ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేసి ధ్రువీకరణ పత్రం అందజేశారు. జిల్లా కేంద్రం బాపట్ల, చీరాల పట్టణం, తీర ప్రాంతంలో స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. లేఅవుట్ వేయాలంటే వ్యవసాయ భూమిని మార్పిడి చేసుకోవాల్సి ఉంది. తీరంలో రిసార్టుల నిర్మాణం చేపడుతున్నారు. భూ మార్పిడికి ఎకరాల ఆధారంగా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన సొమ్ములో కొంత భాగం నేతలు, పై అధికారులకు చెల్లిస్తున్నారు. భూములు, స్థలాల మ్యుటేషన్లు చేయాలన్నా వీఆర్వోలు, ఆర్ఐలు రైతులు, యజమానుల నుంచి రూ.వేలు వసూలు చేస్తున్నారు. ప్రతి దస్త్రంపై సంతకం చేయడానికి రెవెన్యూ అధికారికి నగదు ముట్టజెప్పాలి. అధికారులను అడ్డుపెట్టుకుని కింది స్థాయి సిబ్బంది చెలరేగిపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల జారీకి దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి రూ.వేలు వసూలు చేస్తున్నారు. అర్హత లేకున్నా ఈబీసీ పత్రాలు జారీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. రీ సర్వేను సైతం వదలడం లేదు. యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తామంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారు. డెల్టాలో రెవెన్యూ సిబ్బంది వల్ల ఆన్లైన్లో చోటుచేసుకున్న తప్పిదాలు సరిదిద్దడానికి డిమాండ్ చేసి రైతుల నుంచి రూ.వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు.
రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు ప్రజల్ని పీడిస్తున్నాయి. ప్రతి పనికి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. భూములు, స్థలాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నా, సర్వే, మ్యుటేషన్లు, భూ మార్పిడి చేయాలన్నా, ధ్రువీకరణ పత్రాల జారీకి ముడుపులు చెల్లించనిదే పనులు జరగడం లేదు. ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరు అధికారులు నేరుగా నగదు తీసుకోకుండా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామ సచివాలయంలో భూమి వివరాలు ఆన్లైన్లో నమోదుకు వీఆర్వో స్వాతి స్థానిక రైతు నుంచి రూ.18 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడటం రెవెన్యూలో వసూళ్లు మరోమారు చర్చనీయాంశంగా మారాయి.
ఆన్లైన్లోనూ చెల్లించే అవకాశం
జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు నేరుగా నగదు తీసుకోవడం లేదు. భూములు ఆన్లైన్, భూ మార్పిడికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా వసూళ్లు చేస్తున్నారు. తమకు తెలిసిన వారి ఫోన్ నంబరు ఇచ్చి దానికి నగదు పంపించాలని చెబుతున్నారు. ఇచ్చిన ఫోన్ నంబరు ఖాతాలో నగదు జమకాగానే దస్త్రాలపై సంతకాలు చేసి పంపుతున్నారు. గ్రామ సచివాలయాల్లో సర్వేయర్లు డిమాండ్ చేసి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ తీర మండలంలో రెవెన్యూ అధికారి కింది స్థాయి సిబ్బంది ద్వారా ప్రతి నెలా లక్ష్యం నిర్దేశించి కార్యాలయానికి సేవలు నిమిత్తం వచ్చే వారి నుంచి వసూలు చేయిస్తున్నారు. అడిగినంత ఇవ్వలేం కొంచెం తగ్గించుకోండి.. అని అడిగితే మా ఖర్చులు చాలా ఉన్నాయి. అన్నీ మీకు బహిరంగంగా చెప్పలేం. చెప్పిన సొమ్ములు ముట్టజెబితేనే మీ పని త్వరగా అవుతుందని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. పలుచోట్ల కంప్యూటర్ ఆపరేటర్లు వసూళ్ల రాయుళ్లుగా అవతారం ఎత్తారు. స్థిరాస్తి వ్యాపారులతో కార్యాలయాల్లో రాత్రులు మంతనాలు జరుపుతూ వారికి అనుకూలంగా వ్యవహరించడానికి భారీగా నగదు తీసుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి వసూళ్లకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామీణులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
[ 29-03-2024]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
[ 29-03-2024]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్