బరువెక్కిన విత్తు.. భారమవుతున్న సాగు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు డప్పు కొడుతున్నారు.
పచ్చిరొట్ట విత్తనాల ధర పెంపు
పొన్నూరులో పచ్చిరొట్ట సాగు కోసం దుక్కి దున్నుతూ..
పొన్నూరు, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామంటూ ప్రజాప్రతినిధులు డప్పు కొడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించే పచ్చిరొట్ట విత్తనాల ధర పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 66,478 హెక్టార్లలో వరిపైరు సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు.
* సాగులో రసాయనిక ఎరువుల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. వాటిని వినియోగించడం వల్ల భూమిలో సారం దెబ్బతిని పరోక్షంగా దిగుబడులపై ప్రభావం చూపుతుంది. సారవంతమైన భూమిని తయారు చేసేందుకు పచ్చిరొట్ట సాగు చేసుకోవడం మేలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆ పచ్చిరొట్ట విత్తనాలు గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వం ధరలు పెంచడంతో అదనపు భారం పడిందని వారు వాపోతున్నారు.
* జీలుగ ఎకరాకు 12 కిలోలు, జనుమ 16 కిలోలు, పిల్లి పెసర 8 కిలోల చొప్పున విత్తనాలు చల్లాలని చెబుతున్నారు. జీలుగ, పిల్లిపెసర ధర మాత్రం పెంచారు. జనుమ విత్తనాలు మాత్రం కిలోకి రూపాయి తగ్గించారు. ప్రస్తుతం కొంతమంది రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసేందుకు రొటోవేటర్, దుక్కి దున్నే ప్రక్రియలో అన్నదాతలు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుదారులకు ఇచ్చే ప్రోత్సాహాలకంటే మోపే భారాలే అధిక మయ్యాయని కర్షకులు మనోవేదనకు గురవుతున్నారు. సాగు చేయడం ఏడాదికాయేడాది భారమవుతోందని ఇలాంటి తరుణంలో సాగుదారులపై అదనంగా భారం మోపడం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విత్తనాలు 50 శాతం రాయితీపై రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు సన్నద్ధం చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
* దీనిపై ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ జి.సుబ్బయ్యను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా జీలుగ, పిల్లిపెసర ధర పెరిగిందని, జనుము ధర తగ్గిందన్నారు. జిల్లాలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేసే ప్రక్రియను నిర్వహిస్తాం. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవాలని చెబుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?