ఉపాధ్యాయ ఖాళీలపై కన్ను!
ఉపాధ్యాయ ఖాళీలు కొన్ని బ్లాక్ చేస్తున్నట్లు జాబితా ఒకటి బయటకు రావడంతో టీచర్లలో ఆందోళన నెలకొంది. మంజూరైన పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని బ్లాక్ చేస్తూ తాజాగా విడుదలైన జాబితాతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.
ముందుగానే బ్లాక్ చేసినట్లు బయటకొచ్చిన జాబితా
సంఘాల నాయకుల అభ్యంతరం
గుంటూరు డీఈవో కార్యాలయంలో హెచ్ఎం, ఎంఈవోలతో రద్దీ
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ ఖాళీలు కొన్ని బ్లాక్ చేస్తున్నట్లు జాబితా ఒకటి బయటకు రావడంతో టీచర్లలో ఆందోళన నెలకొంది. మంజూరైన పోస్టులు, వాటిల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుని కొన్నింటిని బ్లాక్ చేస్తూ తాజాగా విడుదలైన జాబితాతో ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రం తామేమి బ్లాక్ చేయలేదని చెబుతున్నారు. తాజాగా విడుదలైన సీనియారిటీ ప్రొవిజనల్ జాబితాలో క్లియర్ వేకెన్సీలు, లాంగ్ స్టాండింగ్ వేకెన్సీలు, డెత్ వేకెన్సీలు, పదవీ విరమణ ఖాళీలతో పాటు బ్లాక్డు ఖాళీలు చూపుతూ ఆ జాబితా ఉంది. ఖాళీలు బ్లాక్ చేయలేదంటూనే ఒకవైపు బ్లాక్డ్ ఖాళీలు అని ఎందుకు చూపించారని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఖాళీలు బ్లాక్ చేయడం ఏమిటి? అవి ఎందుకు, ఎవరి కోసం బ్లాక్ చేస్తున్నారో చెప్పాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఇప్పటికే బదిలీలు కోరుతూ చేసుకున్న దరఖాస్తుల్లో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో వాటిపై బుధవారం, గురువారం రెండు రోజుల పాటు డీవైఈఓలు, ఎంఈఓలు, పరిశీలన బృందాలు తనిఖీ చేశాయి. పదోన్నతి పొందిన టీచర్లు సైతం కొందరు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వారు తమ దరఖాస్తులు తొలగించాలని స్వయంగా వారే అభ్యంతరం పెట్టుకోగా మరికొందరు ఉపాధ్యాయులు కేటగిరీతో సంబంధం లేకుండా పాత స్టేషన్ పాయింట్లు ఎక్కువ నమోదు చేసుకున్నారు. ఇలాంటి వాటిపై మొత్తం 470కు పైగా అభ్యంతరాలు రాగా గురువారం రాత్రికి 80 శాతం పూర్తయ్యాయి. మూడు జిల్లాల నుంచి హెచ్ఎంలు, ఎంఈఓలు వచ్చి ఖాళీలు ఏవైనా బ్లాక్ చేసి ఉంటే వాటిని స్వయంగా ఐటీ బృందాలతో చెప్పి తొలిగిస్తున్నారు. గతంలో కొన్ని ఖాళీలు బ్లాక్ చేసి అప్పట్లో బదిలీలకు అర్హుల జాబితా రూపొందించారు.
తొలగించాలని హెచ్ఎంలకు ఆదేశాలు
ఆ జాబితాలో ఉన్నత పాఠశాలల్లో ఎక్కడైనా పొరుపాటున ఖాళీలు బ్లాక్ చేస్తే వెంటనే వాటిని దగ్గరుండి తొలిగించుకోవాలని హెచ్ఎంలను ఆదేశించారు. గురువారం గుంటూరులోని డీఈఓ కార్యాలయానికి మూడు జిల్లాల నుంచి హెచ్ఎంలు, ఎంఈఓలు తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడుతోంది. శుక్రవారం తుది సీనియారిటి జాబితా ప్రదర్శించాలి. అయితే నిర్దేశిత సమయంలోపు జిల్లాలో ఆ జాబితాను ప్రదర్శించడం సాధ్యం కాదని, శుక్రవారం గుంటూరులో సీఎం పర్యటన ఉండడంతో కొందరు అధికారులు అటు వెళ్లాల్సి ఉండటంతో శనివారం నాటికి ఈ పరిశీలన పూర్తి చేసి కమిషనర్ కార్యాలయానికి జాబితా అందజేస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2, 3 తేదీల్లో సీనియారిటీ జాబితాలు ప్రదర్శించి 4న తుది ఖాళీల జాబితా ప్రకటించేలా బదిలీల షెడ్యూల్ ఉంది. దీంతో బదిలీకి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి అత్యధికంగా 5,767 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 11వేల మంది పనిచేస్తుంటే సగానికి పైగా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్ చేయలేదని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ వారు విడుదల చేసిన సీనియారిటీ ప్రొవిజనల్ జాబితా కాలం చివరిలో బ్లాక్డ్ వేకెన్సీలు చూపారని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బసవలింగారావు పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
[ 29-03-2024]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
[ 29-03-2024]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా