ఇదేనా భరోసా?
రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గాలి. దిగుబడి రెండింతలు పెరిగి నికర ఆదాయం పెరిగేలా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది.
జూన్ వచ్చినా ప్రారంభం కాని భూసార పరీక్షలు
కోరిన మిర్చి విత్తనం దొరక్క రైతుల ఇబ్బందులు
ఖరీఫ్ సీజన్ ముందున్నా.. నిద్ర లేవని అధికారగణం
ఈనాడు, అమరావతి: రైతుకు పెట్టుబడి వ్యయం తగ్గాలి. దిగుబడి రెండింతలు పెరిగి నికర ఆదాయం పెరిగేలా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. విత్తనం నుంచి ఉత్పత్తుల కొనుగోలు వరకు ఆర్బీకేలు రైతును చేయిపట్టుకుని నడిపిస్తాయని చెబుతున్నారు. ఆచరణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించి ఫలితాలు విశ్లేషించి రైతులకు సూచనలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా జూన్ నెల వచ్చినా ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. ఒక్కొక్క ఆర్బీకే పరిధిలో వందల నమూనాలు సేకరిస్తామని ప్రకటించినా చివరికి పదుల సంఖ్యకే పరిమితం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి ప్రయోగాలు చేయాల్సి ఉన్నా వివిధ కారణాలతో ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. జూన్ నెల రావడంతో ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభమవుతున్నా మట్టి పరీక్షలపై అతీగతీ లేదు. దీంతో రైతులు ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. నియోజకవర్గానికి ఒక ప్రయోగశాలను ఆర్భాటంగా ప్రారంభించినా అవి పూర్తి స్థాయిలో రైతులకు సేవలు అందించలేని దుస్థితి.
జడ్పీలో గొంతెత్తినా కానరాని పరిష్కారం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి ప్రధాన వాణిజ్య పంట. లక్ష హెక్టార్లకు పైగా ఇక్కడ మిర్చి సాగవుతుంది. మిర్చికి నల్లతామర ఆశించడంతో గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని రకాల విత్తనాలు నల్లతామర పురుగుకు తట్టుకుంటున్నాయని ప్రచారం జరగడంతో ఆయా కంపెనీల విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. రైతులు రెండు నుంచి మూడు కంపెనీల విత్తనాలు కావాలని కోరుతున్నారు. డిమాండ్ మేరకు మార్కెట్లో విత్తన లభ్యత లేకపోవడంతో రైతులు అధిక ధర వెచ్చించి నల్లబజారులో కొనుగోలు చేస్తున్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ రైతులు కోరుతున్న విత్తనాలు అందుబాటులో ఉంచాలని నేతలు కోరినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. నామమాత్రంగా ఆర్బీకేల్లో అందుబాటులోకి తెచ్చినా పది శాతం మందికి కూడా అందని పరిస్థితి. రైతులు కోరిన విత్తనం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకోవడం, ఇక్కడే అధిక ధర చెల్లించి నల్లబజారులో కొనుగోలు చేసి సమకూర్చుకుంటున్నారు. విత్తన డిమాండ్ను అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రణాళికతో విత్తన నిల్వలు ఉండేలా చూసినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. పత్తి విత్తనాలకు సంబంధించి గరిష్ఠ చిల్లర ధర కంటే తక్కువకే మార్కెట్లో లభిస్తుండడంతో రైతులు వ్యాపారుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కోరిన విత్తనం దొరికితే చాలన్న భావనలో ఉన్న రైతులు బిల్లులు అడిగితే విత్తనాలు ఇవ్వరన్న ఉద్దేశంతో వ్యాపారులపై నమ్మకంతో తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నాణ్యత లేని విత్తనాలతో రైతులు నష్టపోతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి.
కౌలు రైతుల పరిస్థితి ఏంటీ?
గత ఖరీఫ్ సీజన్లో మిర్చి పంటకు నల్లతామర పురుగు ఆశించింది. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న పంటను రైతులు తొలగించి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, శనగ సాగు చేశారు. రైతులు అప్పటివరకు మిర్చికి పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోయారు. అప్పట్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తొలగించిన పంటను ప్రత్యక్షంగా చూశారు. నల్లతామర పురుగుకు రసాయనాలు పిచికారీ చేసి కాపాడుకున్న రైతులకు దిగుబడులు బాగున్నా.. పంటను కాపాడుకోలేక తొలగించిన వారు మాత్రం నష్టపోయారు. కౌలుకు తీసుకుని సాగు చేసిన మిర్చి రైతులు మరింత కుంగిపోయారు. వీరికి ఇప్పటివరకు ఎలాంటి భరోసా లభించకపోవడం గమనార్హం.
రాయితీ సొమ్ముకు ఎదురుచూపులు..
వ్యవసాయ యంత్రసేవా పథకంలో భాగంగా రైతు భరోసా కేంద్రాల పరిధిలో బృందాలుగా ఏర్పడితే వారికి రాయితీ యంత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇందులో 50 శాతం సొమ్ము రైతులు చెల్లిస్తే మరో 50 శాతం బ్యాంకులు రుణంగా అందిస్తున్నాయి. యంత్ర పరికరాలకు సంబంధించి వంద శాతం సొమ్ము సమకూరిన తర్వాతే ఆయా కంపెనీలు పరికరాలను రైతులకు సరఫరా చేస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం రాయితీ సొమ్ము రైతు ఖాతాకు జమ చేస్తోంది. గతేడాది జూన్ 7న రైతుల ఖాతాకు రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అప్పట్లో వివిధ సాంకేతిక కారణాలతో ఆ రోజు నాటికి రాయితీ జమకాని రైతులు ఇప్పటివరకు ఎదురుచూడాల్సి వచ్చింది. గతంలో రాయితీ సొమ్ము పోగా మిగిలినది చెల్లిస్తే పరికరాలు అందించేవారు. ప్రభుత్వం నేరుగా ఆయా కంపెనీలకు రాయితీ సొమ్ము చెల్లించేది. దీంతో రాయితీ సొమ్ము జమ చేయడం ఆలస్యమైనా రైతులకు ఇబ్బంది ఉండేదికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి