నాణ్యత పాటించలేదని బిల్లుల నిలిపివేత
రహదారి నిర్మాణంలో నాణ్యత పాటించని కారణంగా గుత్తేదారుడికి బిల్లులు చెల్లించేందుకు పురపాలిక సంఘానికి చెందిన అధికారి నిరాకరించారు.
చెల్లించాలంటూ అధికారులపై వైకాపా నేత ఒత్తిడి
పొన్నూరులో నూతనంగా వేసిన రహదారిలో సిమెంటు లేచిపోవడంతో గులకరాళ్లు బయటపడ్డాయిలా..
పొన్నూరు, న్యూస్టుడే: రహదారి నిర్మాణంలో నాణ్యత పాటించని కారణంగా గుత్తేదారుడికి బిల్లులు చెల్లించేందుకు పురపాలిక సంఘానికి చెందిన అధికారి నిరాకరించారు.దీంతో సంబంధింత గుత్తేదారుడు అధికారపార్టీ నేతను ఆశ్రయించడంతో వెంటనే చెల్లించాలని ఆయన పురపాలిక సంఘ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని జీబీసీ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి సాయినగర్ వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద సుమారు రూ.7 లక్షలు ఖర్చు చేసి గత నెలలో సిమెంటు రహదారి నిర్మించారు. నిర్మాణ సమయంలో ఇసుకకు బదులు డస్ట్ను ఉపయోగించడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు నిర్మించిన తర్వాత 21 రోజుల పాటు నీటిని నిల్వ చేయాల్సి ఉన్నా అలా చేయలేదు. నాణ్యత పాటించకపోవడంతో సిమెంటు పోయి గులకరాళ్లు బయటపడుతున్నాయి. పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కొందరు స్థానికులు పురపాలకశాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు రహస్యంగా సమాచారాన్ని సేకరించారు. నాణ్యత పాటించని కారణంగా బిల్లులు చేయలేమని ఇంజినీరింగ్ అధికారి చేతులెత్తేశారు. దీంతో సంబంధిత గుత్తేదారుడు అధికారపార్టీ నేతను ఆశ్రయించగా ఆయన వెంటనే చెల్లించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈమేరకు అధికారులు సైతం ఎందుకు బిల్లులు చెల్లించలేదంటూ సంబంధిత ఇంజినీరింగ్ అధికారికి నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. అయితే అప్పటికే ఆ అధికారి సెలవులో వెళ్లినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో ఇల్లన్నావు.. తోడేళ్లకు తోడున్నావు..
[ 17-04-2024]
ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. -
పట్టుదలతో శ్రమించి.. విజేతలుగా నిలిచి
[ 17-04-2024]
ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య సాధనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్లో మెరిశారు. -
‘రా’క్షస రాజ్యం పారదోలుదా‘మా’
[ 17-04-2024]
రాముడు సకల గుణాభిసోముడు.. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాడు. పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. ప్రకృతిని ప్రేమించాడు. -
అల్లరిమూకల అరాచకం..!
[ 17-04-2024]
గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు. -
మేము దాచుకుంది.. నీ నవరత్నాల కోసం కాదు
[ 17-04-2024]
ప్రతి ఉద్యోగి తన సర్వీసులో ఎంతో కొంత పొదుపు చేసి విశ్రాంత జీవితం సాఫీగా సాగిద్దామనుకుంటారు. సరెండర్ లీవ్, డీఏ, జీపీఎఫ్.. ఇలా పలు రకాల అవకాశాలను పొదుపునకు పెట్టుబడిగా మలచుకుంటారు. -
‘చేనేత కుటుంబాలపై ఎమ్మెల్యే ఆర్కే కక్షసాధింపు’
[ 17-04-2024]
ఎమ్మెల్యే ఆర్కే తొలి నుంచి చేనేత కుటుంబాలపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ను గెలిపించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు మహిళా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
నదీ గర్భాన్ని తోడేస్తూ.. నిలువునా దోచేస్తూ
[ 17-04-2024]
అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. -
కంచు మోతలే.. సరైన వసతులేవి మామ!
[ 17-04-2024]
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ వారి సంక్షేమం కోసం ఎవరూ చేయనంతగా చేస్తున్నానని గొప్పలు చెబుతుంటారు. -
రీయింబర్స్మెంట్ లేదు.. చేయూత నిధులు అందలా..
[ 17-04-2024]
వాలంటీర్ల ద్వారా ఇంటింటికే పథకాలు అందించాం కదా! నాడి ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్న వైకాపాకు ఎదురుదెబ్బ తగులుతోంది. -
పోలీసుల చూపు ఒక వైపే..!
[ 17-04-2024]
జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
-
అయోధ్య బాలరాముడికి ‘సూర్యతిలకం’.. కనువిందు చేసిన అద్భుత దృశ్యం
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్