Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

Published : 02 Jun 2023 17:04 IST

దిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్‌కుమార్‌కు విశాఖపట్నం మర్రిపాలెంలో ఉన్న 17,135 చ.మీ. భూమిని వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 115 జారీ చేసింది. గతంలో ఈ జీవోను కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. సింగిల్‌  బెంచ్‌ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్థించింది. 

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ప్రభుత్వమే భూమి ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదంటూ హైకోర్టు తీర్పునే సమర్థించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు