32 మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశం
గుంటూరు నగరపాలక ప్రణాళిక, రెవెన్యూ విబాగాల్లో పనిచేసే 32 మంది ఉద్యోగులపై అనిశా నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
అనిశా ఆకస్మిక తనిఖీల పర్యవసానం
పొరుగు సేవల ఉద్యోగి తొలగింపు
ఈనాడు-అమరావతి: గుంటూరు నగరపాలక ప్రణాళిక, రెవెన్యూ విబాగాల్లో పనిచేసే 32 మంది ఉద్యోగులపై అనిశా నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. బాధ్యులైన ఉద్యోగులపై అనిశా నివేదికను అనుసరించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి నగర కమిషనర్ను ఆదేశించారు. ఈ ఆదేశాలు శనివారం నగరపాలకకు అందాయి. ఈపరిణామంతో సంబంధిత ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. ఉదయాన్నే ఈ ఆదేశాలు రావడంతో విధులకు హాజరైన కొందరు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా డీలాపడ్డారు. భవిష్యత్లో తమకు ఉద్యోగోన్నతులకు ఈ చర్యలు అడ్డుగా ఉంటాయని ఆందోళన చెందారు.
అసలేం జరిగింది... : 2020 ఫిబ్రవరి 18న ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో ఏసీబీ ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వారి తనిఖీల్లో పలువురు ఉద్యోగుల వద్ద పరిమితికి మించి నగదు పట్టుబడింది. అప్పట్లో రెవెన్యూ విభాగంలో ఓ ఉద్యోగి స్కూటర్ డిక్కీలో రూ.60 వేలు చిక్కింది. ప్రణాళికలో పొరుగుసేవల ఉద్యోగి వద్ద రూ.29,093 స్వాధీనం చేసుకున్నారు. పొరుగుసేవల ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని అనిశా నివేదికలో స్పష్టంగా పేర్కొనటంతో ఆ ఉద్యోగిని శనివారం విధులకు హాజరైనా విషయం చెప్పి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ రెండు విభాగాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులపై అవినీతి, అక్రమాలు నిర్ధారణ కావటం.. అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని అనిశా ప్రభుత్వానికి నివేదించింది.
సొంత లబ్ధి చూసుకున్నారనే... : నగరంలో 20 భవనాలకు వెళ్లి పరిశీలించగా వాటిల్లో ఏ ఒక్క భవనానికి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే వాటిని ఎందుకు అడ్డుకోలేదు? రెవెన్యూ అధికారులు వాటికి నూరు శాతం అపరాధ రుసుం విధించి ఆస్తి పన్ను వేశారు. దాన్ని అనుసరించి కనీసం ఆ భవనాలను బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీంలో పెట్టి అనుమతులు తీసుకునేలా చేయటంలో ప్రణాళికాధికారులు వైఫల్యం చెందారనీ.. దీని వెనక వారు సొంత లబ్ధి చూసుకున్నారని అనిశా అధికారులు అనుమానించి వారి వివరణలు నమోదు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తాము పరిశీలించిన 20 భవనాల్లో ఏ ఒక్కదానికి అనుమతులు లేకుండా నిర్మించటంతో నగరపాలక ఆదాయానికి ఆదాయం రాకుండా నష్టపోయేలా వ్యవహరించారని గుర్తించారు.
ఉద్యోగుల కలవరం... : నిబంధనలు అనుసరించి వాటికి అపరాధ రుసుములు విధించటమో, కూల్చటమో చేయాలి. మొక్కుబడిగా కొన్ని భవనాల్ని కూల్చారు. ఆతర్వాత మిగిలిన వాటిని పట్టించుకోలేదు. దీంతో మరోసారి ఆ భవనాల పరిశీలనకు వెళ్లిన అనిశా యంత్రాంగం కొన్ని భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుసుకుంది. ఏసీపీ, డీసీపీ వంటి అధికారులు నిర్లక్ష్యం వహించారనీ.. వారూ దీనికి బాధ్యులేనని చర్యలకు సిఫార్సులు చేసింది. అనిశా డీజీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 18న నివేదిక వెళ్లటం దాన్ని అనుసరించి తాజాగా చర్యలకు ఆదేశించటంతో ఉద్యోగులు వణుకుతున్నారు. ప్రస్తుతం నగరపాలక ఇన్ఛార్జి కమిషనర్గా పురపాలకశాఖ కమిషనర్ కోటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారి కావటంతో తమపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని బాధ్యులైన ఉద్యోగులు హడలిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!