పనులు జరిగేనా.. నీరు కదిలేనా?
కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు, మురుగునీటి కాలువల దుస్థితి మారేలా లేదు. కాలువల్లో మరమ్మతులకు చాలా ఆలస్యంగా టెండర్లు పిలిచారు. వాటిని ఖరారు చేసే సరికి ఈ నెల రెండో వారం వస్తుంది.
ఆలస్యంగా టెండర్లు
ఖరీఫ్ సమీపిస్తున్నా నిర్వహించని నీటిపారుదల సలహామండలి సమావేశం
న్యూస్టుడే, బాపట్ల
రేపల్లె మురుగు కాలువలో గుర్రపుడెక్క
కృష్ణా పశ్చిమ డెల్టాలో సాగు, మురుగునీటి కాలువల దుస్థితి మారేలా లేదు. కాలువల్లో మరమ్మతులకు చాలా ఆలస్యంగా టెండర్లు పిలిచారు. వాటిని ఖరారు చేసే సరికి ఈ నెల రెండో వారం వస్తుంది. వర్షాలు కురిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైతే పనులు చేపట్టే పరిస్థితి ఉండదు. రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిని కేటాయించాలని నిర్ణయించారు. అధ్వాన కాలువలతో పంటల సాగుకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
* కాలువల్లో మరమ్మతులు చేపట్టటానికి గత ఏప్రిల్లో అనుమతులు ఇచ్చినా జలవనరుల శాఖ అధికారులు పనులు ఖరారు చేసి టెండర్లు పిలవటంలో జాప్యం జరిగింది. జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశాన్ని ఇంకా నిర్వహించలేదు. ఖరీఫ్లో కాలువలకు సాగునీరు ఎప్పుడు విడుదల చేసేది అధికారికంగా ప్రకటించలేదు. గతేడాది మే 19నే నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి జూన్ 10 నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
* సాగు, మురుగునీటి కాలువల్లో పూడిక తీత, కాంక్రీటు పనులకు గత నెల మూడో వారంలో టెండర్లు పిలిచారు. కొన్ని టెండర్లు ఈ నెల 6న, మిగతావి 9న తెరవనున్నారు. రూ.ఐదు లక్షల లోపు పనులు నావినేషన్ పద్ధతిన కేటాయించటానికి రంగం సిద్ధం చేశారు. 17 పనులు షట్టర్లకు సంబంధించి చేయాల్సి ఉంది. వీటిని సాంకేతిక పరిశీలనకు పంపించారు.
* డెల్టాలో సాగు, మురుగు నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. గుర్రపుడెక్క విపరీతంగా పెరిగి పూడిక ఏర్పడింది. కాలువ కట్టలు కోతకు గురై బలహీనపడ్డాయి. షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఊడిపోయాయి. కాలువల్లో రక్షణ గోడలు, కాంక్రీటు లైనింగ్ దెబ్బతింది. వీటికి అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సి ఉంది. మే మొదటి వారంలోగా టెండర్లు ఖరారు చేసి ఈ పాటికే సగానికి పైగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండు వారాలకు పైగా జాప్యం చోటు చేసుకుంది. కాలువల్లో పనులకు ఇటీవల పిలిచిన టెండర్లు ఖరారు కావటానికి ఈ నెల రెండో వారం పడుతుంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమై పనులు చేపట్టటానికి అవకాశం ఉండదు. జూన్ మూడు, నాలుగు వారాల్లో సాగునీరు విడుదల చేస్తే కాలువల్లో మరమ్మతులపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇటీవల నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కాలువల్లో ఈ నెల 15 లోగా మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి కాదు కదా అప్పటికే టెండర్లు పిలిచిన పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదు.
* కాలువల్లో రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తున్నా చేయటానికి ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. గతేడాది చేపట్టిన పనుల తాలూకూ బిల్లులే ఇంకా చెల్లించలేదు. తాజా పనుల బిల్లులు ఎప్పుడు వస్తాయోనని వెనుకంజ వేస్తున్నారు.
పీటీ ఛానల్లో దెబ్బతిన్న షట్టరు
సాగునీటి కాలువల్లో చేపట్టాల్సిన పనులు: 99
కేటాయించిన నిధులు: రూ.6.81 కోట్లు
ఇప్పటికే టెండర్లు పిలిచినవి : 52
రూ.ఐదు లక్షల లోపు నామినేషన్కు కేటాయించనున్నవి : 30
ఆమోదం పొందాల్సిన షట్టర్ల పనులు: 17
మురుగునీటి కాలువల్లో చేపట్టాల్సినవి : 58
కేటాయించిన నిధులు: రూ.6.23 కోట్లు
టెండర్లు పిలిచినవి: 40
నామినేషన్ పద్ధతిలో కేటాయించనున్నవి: 18
నామినేషన్ పనులు వెంటనే చేపడతాం
కాలువల్లో రూ.ఐదు లక్షల లోపు పనులు నామినేషన్ విధానంలో వెంటనే చేపడతాం. టెండర్లు ఖరారు కాగానే మిగతా పనులు ప్రారంభిస్తాం. కాలువల్లో అత్యవసర మరమ్మతులు చేసి ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
మురళీకృష్ణ, జిల్లా జలవనరుల శాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంటూరు జిల్లాలో ప్రబలిన డయేరియా.. 100 మందికి పైగా అస్వస్థత
[ 19-04-2024]
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో గ్రామంలో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. -
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు