వర్షాలతో ఇటుక పరిశ్రమ కుదేలు
గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో సైతం తరచూ కురుస్తున్న వర్షాలు స్థానిక రైతులనే కాదు ఇటుక వ్యాపారులనూ నష్టాల పాల్జేశాయి.
మండుటెండలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న వలస కూలీలు
కొల్లూరు, న్యూస్టుడే: గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో సైతం తరచూ కురుస్తున్న వర్షాలు స్థానిక రైతులనే కాదు ఇటుక వ్యాపారులనూ నష్టాల పాల్జేశాయి. అకాల వర్షాలు, తుపానుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా, అత్యంత నాణ్యమైన ఇటుకను ఉత్పత్తి చేసే కొల్లూరు ఇటుక రాతి పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. ఏటా 40కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఇటుక ఇక్కడ ఉత్పత్తి అయ్యేది. అకాల వర్షాల పుణ్యమాని ఈ ఉత్పాదకత 30 కోట్లకు మించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటుక తయారీకి అవసరమైన ఊక (వరి పొట్టు), బొగ్గు, మట్టి ధరలు కొన్ని రెట్లు పెరిగిపోవడానికి ఈ అకాల వర్షాలు తోడు కావడంతో ఇటుక వ్యాపారం కుదేలైంది. దీనికి తోడు అప్పటికే తయారు చేసిన ఇటుక పలుమార్లు కల్లాల్లో తడిసిపోవడంతో ఆరిన ఇటుకను కాల్చేందుకు అవసరమైన బట్టీల ఏర్పాటు ఎప్పటికప్పుడు ఆలస్యమైంది. ఇటుక కాల్చేందుకు రూ.లక్షలు వెచ్చించి సిద్ధంగా ఉంచుకున్న మట్టి, ఊక, బొగ్గు అలాగే ఉండిపోయాయి. వీటిని ఎంత ఎక్కువగా వినియోగించి బట్టీలు నిర్మించి ఇటుకను కాల్చి అమ్మకాలు సాగిస్తే అంత తక్కువ నష్టాలతో బయటపడొచ్చని తయారీదారులు ఆరాట పడుతున్నారు. వర్షానికి తడిసి పనికి రాకుండా పోయిన ఇటుకను కుండీల్లో వేసి ఆ మట్టిని తిరిగి ఇటుకగా తయారు చేయిస్తున్నారు.
కత్తెర్లంకలో అకాల వర్షానికి తడిసి పాడైన ఇటుక (పాతచిత్రం)
ఎండల్లోనూ కొనసాగుతున్న పనులు
ఏటా డిసెంబరులో ఇటుక తయారు చేసే వలస కూలీలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొద్ది సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. వీరి వెంటే వారం పదిరోజుల వ్యవధిలో ఇటుక బట్టీలు పేర్చే పనిని చేసే కూలీలు ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. వీరు సాధారణంగా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో అంటే వేసవి ఎండలు తీవ్రం అయ్యే నాటికి తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతారు. ఈ ఏడు వర్షాల కారణంగా బట్టీల పని పూర్తి కాకపోవడం వల్ల జూన్ నెల ప్రారంభమైనా ఇటుక బట్టీలు పేర్చే పనిని ఇటుక తయారీదారులు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు ఖర్చు భరించడంతో పాటు ఇటుక తయారీ తరుణాన్ని నెల రోజుల పాటు పొడిగించక తప్పని పరిస్థితి బట్టీ యజమానులకు ఏర్పడింది. కూలీలు మండుటెండను సైతం లెక్కచేయక ఇటుక బట్టీలు పేర్చే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటుక ధరలు పెరిగి వినియోగదారుడిపై ఆ మేరకు భారం పడే అవకాశం ఉంది. ఇటుక ధర ఎంత పెరిగినా లాభాల సంగతి అలా ఉంచి కనీసం కోలుకుని రానున్న తరుణంలో తయారీ కొనసాగించగలిగితే చాలని వ్యాపారులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. -
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు