కృష్ణానదికే అడ్డుకట్ట
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిలో భారీ యంత్రాలతో చేపట్టిన రహదారి నిర్మాణాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం నిలిపి వేయించారు.
యథేచ్ఛగా ఇసుక తరలింపునకు సన్నాహాలు
పనులు నిలిపివేయించిన రెవెన్యూ అధికారులు
నీటిలో ఇసుకను తోడి రహదారి నిర్మాణం కోసం మెరక వేస్తున్న వైనం
కొల్లూరు, న్యూస్టుడే: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిలో భారీ యంత్రాలతో చేపట్టిన రహదారి నిర్మాణాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం నిలిపి వేయించారు. ఇక్కడ ఇసుకతో రహదారి నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ఎక్సకవేటర్లను సంఘటనా స్థలం నుంచి ఒడ్డుకు తరలించి ఇక మీదట పనులు కొనసాగిస్తే కేసులు నమోదు చేసి యంత్రాలను స్వాధీనం చేసుకుంటామని చోదకులను హెచ్చరించారు. పడవలో అమర్చిన ఆయిల్ ఇంజన్ ద్వారా నీటిలో నుంచి ఇసుకను తోడి రహదారి నిర్మాణం కోసం పైపుల ద్వారా మెరక వేస్తున్న పనులను నిలిపి వేయించడంతో పాటు వారికి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. వర్షాలు ప్రారంభమయ్యే సమయం కావడంతో ఒకవేళ నదికి వరదలు సంభవిస్తే ఇసుకకు ఇబ్బంది లేకుండా కృష్ణానదిలో ఇసుకను తరలించి, నిలువ ఉంచి విక్రయించేందుకు కృష్ణాజిల్లా సరిహద్దులో బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్య ఉన్న ఇసుక దిబ్బ వరకు ఇసుకను తరలించే వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా జేపీ కంపెనీ వారు రహదారి నిర్మాణం చేపట్టినట్లు తహసీల్దార్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి నదిలో రహదారి నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. జువ్వలపాలెం సమీపంలో కృష్ణానది ఒడ్డు నుంచి నదిలోకి సుమారు కిలోమీటరు పొడవునా రహదారి నిర్మాణం అప్పటికే పూర్తయిన విషయాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి పనులను పర్యవేక్షిస్తున్న మేస్త్రీని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. రహదారి నిర్మాణ పనులకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న జేపీ కంపెనీ ప్రతినిధికి ఫోన్ చేసి అనుమతుల విషయమై ప్రశ్నించారు. త్వరలో రాత పూర్వక అనుమతులు తీసుకుంటామని, నదిలో రహదారి నిర్మాణానికి సంయుక్త కలెక్టర్ శ్రీధర్ ఇప్పటికే అనుమతులు ఇచ్చారని, అవసరమైతే నేరుగా సంయుక్త కలెక్టర్ లేదా కలెక్టర్తోనైనా మాట్లాడుతామని, నిర్మాణ పనులను నిలిపివేయొద్దని ఆయన బదులిచ్చారు. వెంటనే తహసీల్దార్ అనుమతుల విషయమై సంయుక్త కలెక్టర్ను ఫోన్లో సంప్రదించారు. నదిలో రహదారి నిర్మాణానికి తాను ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అసలు ఆ విషయం తన దృష్టిలోనే లేదని, వెంటనే పనులను నిలిపి వేయించాలని సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. దీంతో తహసీల్దార్ యంత్రాలను తక్షణం ఒడ్డుకు చేర్చాలని, నీటిలో నుంచి ఇసుకను తోడి మెరక వేస్తున్న పడవను తక్షణం అక్కడ నుంచి పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడం, లేదా మరల్చడం నదీ పరిరక్షణ, వాల్టా చట్టాల ప్రకారం నేరం కదా? అని అక్కడకు చేరుకున్న స్థానికులు తహసీల్దార్ను ప్రశ్నించారు. జేపీ కంపెనీ చట్టాలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా నదిలోని ఇసుకను తరలిస్తుంటే చర్యలు తీసుకోరా? సామాన్యులైతే కేసులు పెట్టి రూ.వేలు, రూ.లక్షల్లో అపరాధ రుసుము వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వారిని సముదాయించారు. వారం రోజులుగా పనులు చేపట్టి కిలోమీటరు మేర రహదారి నిర్మాణం చేస్తే ఏం చేస్తున్నారు? సమాచారం ఇప్పుడే అందడం ఏమిటి? గ్రామ స్థాయి రెవెన్యూ, సచివాలయ, ప్రభుత్వ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ? స్థానికులు ఆగ్రహం వెలిబుచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి