నదీ తీరానికెళితే.. ముక్కు మూసుకోవాల్సిందే
లక్షలాది మందికి తాగునీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ నీటితో కళకళలాడుతూ జీవనదిగా పేరొందిన కృష్ణానది కలుషితం బారిన పడుతోంది.
డంపింగ్ యార్డును తలపిస్తున్న కృష్ణా తీరం
నేరుగా మురుగు మళ్లింపుతో దుర్గంధం వ్యాప్తి
ఈనాడు, అమరావతి
అమరావతిలోని అమరేశ్వరఘాట్ వద్ద నదిలో కలుస్తున్న మురుగు
లక్షలాది మందికి తాగునీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ నీటితో కళకళలాడుతూ జీవనదిగా పేరొందిన కృష్ణానది కలుషితం బారిన పడుతోంది. మానవుల స్వార్థం...లోపించిన పర్యవేక్షణ.. పట్టించుకోని కృష్ణా పరిరక్షణ విభాగం వెరసి స్వచ్ఛమైన నది నీరు కలుషితమవుతోంది. ఇదే లక్షల మంది తాగునీటి అవసరాలకు సరఫరా అవుతోంది.
అమరావతిలోని యాదవకాలనీ, పల్లపు వీధి, శివగంగ వీధి, ప్రధాన రహదారిలోని కొంత భాగం నుంచి వచ్చే మురుగునీటిని నేరుగా అమరేశ్వరఘాట్ పక్కనే నదిలోకి కలుపుతున్నారు. దీంతో నది కలుషితమవుతోంది. మురుగు వచ్చి నదిలోకి కలిసిన తర్వాత ప్రవాహం ముందుకు వెళ్లకుండా ఇసుక రవాణాకు వేసిన రోడ్డు అడ్డుగా ఉంది. దీంతో మురుగు వెనక్కి వచ్చి తీరం కలుషితమవుతోంది. అదేవిధంగా సాయిబాబా ఆలయం సమీపంలోని ఘాట్ వద్ద అమరావతి నుంచి వచ్చే మురుగునీరు కలుస్తోంది. ఇది నదిలో కలిసిన తర్వాత ప్రవాహం తాగునీటి పథకాల మీదుగా ప్రవహిస్తోంది. ఇక్కడే గోరంట్ల తాగునీటి పథకం ద్వారా పదుల గ్రామాలకు నీరు అందిస్తారు. అమరావతి పంపింగ్ పథకం కూడా ఇక్కడే ఉంది. వేలమందికి తాగునీటి అందించే పథకం పక్కనే మురుగునీరు కలుస్తున్నా అటు పంచాయతీ గానీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం గానీ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. శుద్ధి చేసి పంపిణీ చేసినా మురుగునీరు కలవడంతో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయలేని పరిస్థితి.
మురుగు చెంతనే స్నానాలు : పంచారామాలలో ప్రథమారామం అమరావతి అమరలింగేశ్వరస్వామి దర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు. పర్వదినాలలో వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో పుణ్య స్నానాలు చేసి అమరేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. అమరావతి ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతం కావడంతో ప్రజలు పెద్దసంఖ్యలో రాకపోకలు చేస్తుంటారు. దీనికితోడు కర్మకాండలు చేయడానికి అమరావతి తీరం ప్రసిద్ధి చెందడంతో రోజూ ఇక్కడ వందల మంది స్నానాలు చేస్తారు. వీరందరూ అమరావతి ఆలయం ముందు ఉన్న ఘాట్లో స్నానాలు చేస్తుంటారు. ఘాట్ పక్కనే మురుగునీరు వచ్చి నదిలో కలుస్తుండటంతో ఆ ప్రాంతం మురుగుమయమవుతోంది. దీంతో భక్తులు స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలనే ఉద్దేశంతో కొంత దూరం నదిలోకి వెళుతున్నారు. అక్కడ లోతు తెలియక పలువురు ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మురుగునీరు కలవకుండా ఏర్పాటు చేస్తే తీరంలోనే స్వచ్ఛమైన నీటిలో స్నానం చేసే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల భక్తులు ప్రమాదాల బారినపడకుండా నివారించవచ్చు.
ధ్యానబుద్ధ ఘాట్ వద్ద ఇలా..
డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు
అమరావతిలో వచ్చే చెత్త తీసుకొచ్చి నదీతీరంలో డంప్ చేస్తున్నారు. వాడేసిన కొబ్బరి బొండాలు, తాటికాయలు తీసుకొచ్చి నదిలోపలి వైపు ఒడ్డున వేస్తున్నారు. ఆలయం నుంచి వచ్చే వృథాను ఆలయ ఉత్తర గాలిగోపురం వైపు నదిలోకి పడేస్తున్నారు. తాడేపల్లి మండలంలోని సీతానగరం ఘాట్, కనకదుర్గమ్మ వారధి వద్ద ఆ పరిసరాలల్లోని చెత్త మొత్తం నది ఒడ్డున వేస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడి చెత్తకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఇవన్నీ ఒడ్డున వేస్తుండటంతో కుళ్లిపోయి ఆ మురుగు నదిలోకి కలుస్తోంది. దీంతో నదీతీర ప్రాంతంలోని నివాసాల నుంచి వచ్చే చెత్త మొత్తం నదిలోకి డంప్ చేస్తున్నారు. నదికి వరదలు వచ్చినప్పుడు ఇది నదిలో కొట్టుకుపోతోంది. దీంతో ఆహ్లాదకర వాతావరణానికి నిలయంగా ఉండాల్సిన తీరప్రాంతం చెత్తమయంగా మారుతోంది. ఇదంతా నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చి ఘాట్ల సమీపంలో నిలిచిపోతోంది. దీంతో ఘాట్లలో స్నానాలు చేయడానికి కూడా భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నదిలోకి మురుగునీరు నేరుగా విడుదలపై అమరావతి పంచాయతీ కార్యదర్శి నాగరాజును వివరణ కోరగా ఎప్పటి నుంచో నదిలోకి మురుగునీరు వదులుతున్నామని, కాలువలు నదిలోకి ఉన్నందున తామేమీ చేయలేమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై వాలంటీర్ ఆనంద్బాబు పోటీ
[ 24-04-2024]
వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
[ 24-04-2024]
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
[ 24-04-2024]
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 24-04-2024]
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
వైఎస్ఆర్ను తిట్టిన బొత్స.. జగన్కు తండ్రి సమానులా?: షర్మిల
[ 24-04-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. -
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం