పోషకాహార లోపం.. శాపం
బాల్యం బక్కచిక్కుతోంది. పోషకాహారలోపం సమస్య వారిని వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా బాలలు పుష్టిగా తయారవ్వట్లేదు. మరోవైపు కాబోయే అమ్మల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది.
జిల్లాలో 6,219 మందికి సమస్య
ఐసీడీఎస్ ప్రత్యేక సర్వేలో వెల్లడి
సత్తెనపల్లి, న్యూస్టుడే
అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం తింటున్న బాలలు
బాల్యం బక్కచిక్కుతోంది. పోషకాహారలోపం సమస్య వారిని వెంటాడుతోంది. రూ.కోట్లు ఖర్చవుతున్నా బాలలు పుష్టిగా తయారవ్వట్లేదు. మరోవైపు కాబోయే అమ్మల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది. బాలల ఎదుగుదల, అమ్మల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని ఐసీడీఎస్ ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. గత నెల 1 నుంచి 31 వరకు పిల్లల ఎదుగుదల, గర్భిణుల్లో రక్తహీనత సమస్య గుర్తించేందుకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రత్యేక సర్వే నిర్వహించారు. శాస్త్రీయంగా పిల్లల బరువు, ఎత్తు కొలతల్ని, గర్భిణుల నుంచి రక్త నమూనాల్ని సేకరించారు. జిల్లాలో పోషకాహార లోపంతో 6,219 మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడైంది. మరో 14 వేల మందిలో మోస్తరు పోషకాహార లోపం ఉంది.
* మొత్తం చిన్నారుల్లో పోషకాహార లోపంతో 6,219 మంది (5.57 శాతం మంది) బాధపడుతున్నారు. వయసుకు తగ్గ ఎత్తులేని వారిలో ఈపూరు మండలంలో 8.96 శాతం మంది, బొల్లాపల్లిలో 7.10 శాతం, బెల్లంకొండలో 6.41 శాతం, రాజుపాలెంలో 6.06 శాతం మంది ఉన్నారు. వయసుకు తగ్గ బరువులేని వారిలో బెల్లంకొండ మండలంలో 5.09 శాతం, ఈపూరులో 4.86 శాతం, రాజుపాలెం మండలంలో 4.83 శాతం మంది నమోదయ్యారు.
గర్భిణులకు కష్టాలు
కాబోయే అమ్మల్ని రక్తహీనత సమస్య వేధిస్తోంది. గత నెల జిల్లాలో 12,261 మంది గర్భిణులు సర్వేలో నమోదయ్యారు. వారిలో 3,606 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. తేలికపాటి రక్తహీనతతో 2,550 మంది, మోస్తరు 1,054 మంది, తీవ్ర రక్తహీనతతో ఇద్దరు బాధపడుతున్నట్లు గుర్తించారు. 12 మండలాల్లోని గర్భిణుల్లో 40 శాతమంది కంటే ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నట్లు నమోదైంది. గత నెల పరీక్షలు చేయించుకున్న వారిలో పిడుగురాళ్లలో 50.13 శాతం, క్రోసూరులో 49.26 శాతం, బెల్లంకొండలో 48.92 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య గుర్తించారు.
* వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ కింద పోషకాహారం అందజేస్తున్నా పిల్లల్లో ఎదుగుదల, గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా నమోదయ్యేందుకు కారణాల్ని ఉన్నతాధికారులు అన్వేషించాల్సిన అవసరముంది. రేపటి పౌరుల్ని పుష్టిగా మార్చేందుకు శ్రద్ధ చూపించాలి. రక్తహీనత బారిన గర్భిణులు పడకుండా వారికి ఆరోగ్య అవగాహన కల్పించాలి.
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ పౌష్టికాహారం ప్యాకెట్
శ్రద్ధ తీసుకుంటాం
పిల్లల్లో పౌషకాహార లోపం.. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చేసేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ అరుణ చెప్పారు. ప్రత్యేక సర్వేలో వెల్లడైన అంశాలపై విశ్లేషించి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని దిద్దుబాటు చేస్తామన్నారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న మండలాలతోపాటు కేంద్రాలపై శ్రద్ధ చూపిస్తామన్నారు. రక్తహీనత బారినపడకుండా ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో అమ్మలకు అవగాహన కల్పిస్తామని పీడీ తెలిపారు.
సర్వే అంశాలు
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 2031
6 ఏళ్లలోపు చిన్నారులు: 1,27,322
ప్రత్యేక సర్వేలో నమోదైన వారు 1,13,024
బరువు, ఎత్తు వివరాలు సేకరించిన పిల్లలు: 1,11,610
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.