ప్రచార ప్రహసనం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ప్రచారమే ధ్యేయంగా నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గుంటూరు నుంచి తాడేపల్లికి ఈ-ఆటోలు
జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం
సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవం కోసం గుంటూరు కార్పొరేషన్ షెడ్ నుంచి తాడేపల్లికి తరలిస్తున్న ఈ-ఆటోలు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే,నగరపాలక సంస్థ (గుంటూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని ప్రచారమే ధ్యేయంగా నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గురువారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఈ-ఆటోలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ, తాడేపల్లి-మంగళగిరి నగరపాలక సంస్థల నుంచి వందల ఈ-ఆటోలు తరలించారు. జూన్ 2న గుంటూరులో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ పంపిణీకి వందల కిలోమీటర్ల నుంచి గుంటూరు తరలించి మళ్లీ సొంతూళ్లకు తీసుకెళ్లారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు చెందిన లబ్ధిదారులు తమ వాహనాలతో ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఒకచోట ముఖ్యమంత్రి ప్రారంభించి మిగిలినచోట ఆయా ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తే సరిపోయేదానికి వందల వాహనాలు ఒకచోటికి తీసుకురావడం ప్రయాసగా మారింది. రైతులు మూడు రోజుల పాటు పనులు మానుకుని వాహనాలు తీసుకురావాల్సి వచ్చింది. ఎండలు మండిపోతున్న వేళ ప్రభుత్వ ఆర్భాటం కోసం లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి రావడం గమనార్హం. గురువారం తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఈ-ఆటోల ర్యాలీ ప్రారంభానికి గుంటూరు నుంచి 30 కిలోమీటర్ల దూరం వాహనాలను తరలించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటిని మళ్లీ తిరిగి గుంటూరుకు తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే ఈ-ఆటోలు తిరిగి వెళ్లాల్సి ఉంది. వీటన్నిటిని ఒకచోటకి చేర్చడం, మళ్లీ తీసుకెళ్లడం, ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతోంది. ఈ వాహనాలన్నీ కూడా జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాల్సి రావడంతో ఆ మార్గంలో రద్దీ పెరగనుంది. అలాగే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గం మొత్తం ఈ-ఆటోలతో నిండిపోతే అక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. జూన్ 2న ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమం రోజున ట్రాక్టర్లు ర్యాలీగా వెళ్లడానికి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకేసారి వందల వాహనాలు చూపించడం ద్వారా కార్యక్రమం అట్టహాసంగా చేశామనే గొప్పల కోసం అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం కోసం ఈ ప్రహసనమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నెలల తరబడి ఎదురుచూపులు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలకు అందించేందుకు 220 ఈ-ఆటోలు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ నుంచి గతేడాది అక్టోబరులోనే గుంటూరులోని వెహికల్ షెడ్కు వచ్చాయి. ఇందుకు రూ.12కోట్ల సొమ్ము వెచ్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ సమర్థంగా చేపట్టి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ఈ-ఆటోలు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్లు కాలేదని కొన్నాళ్లు, సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని కొన్నాళ్లు ఇలా కొన్ని నెలలుగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇటీవల వైఎస్ఆర్ వాహన సేవ పథకంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ-ఆటోలు ప్రారంభించాలని అనుకున్నా చేయలేకపోయారు. దీంతో అందుబాటులోకి వచ్చిన వాహనాలను వినియోగంలోకి తీసుకురాకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
వాడకుండానే మొరాయింపు...
గత అక్టోబరు నెలలో తెచ్చిన ఈ-ఆటోలను వాడకంలోకి తీసుకురాకుండా కేవీపీ కాలనీ వాహనాల షెడ్డులోనే వదిలేయడం వల్ల చాలా ఆటోలు పాడయ్యాయి. సుమారు 50 నుంచి 60 ఆటోలు బ్యాటరీ సమస్యలు, స్టీరింగ్ బిగుసుకుపోవడం, బ్రేకులు ఫెయిల్ కావడం వంటి సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. సీఎం చేత ప్రారంభోత్సవానికి తాడేపల్లి తరలించేందుకు ప్రయత్నిస్తే కొన్ని ఆటోలు మొరాయించాయి. దీంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని అదనపు సిబ్బందిని రప్పించి వాటిని మరమ్మతు చేసి బాగైన ఆటోలను వెంటనే తాడేపల్లికి తరలించే ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికి కూడా మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రారంభించే సమయంలోనే చెత్త సేకరణ వాహనాల పరిస్థితి ఇలా ఉంటే డివిజన్లలో తిరిగేటప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!