పరిష్కారాలు పల్టీ కొట్టాయి
వెలగని వీధి దీపాలు.. పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు.. గతుకుల దారులు.. కుక్కల బెడద.. పందుల సంచారం..
ఫిర్యాదులపై అధికారులకు తప్పుడు నివేదికలు
క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా గణాంకాలు
న్యూస్టుడే, పొన్నూరు, మంగళగిరి: వెలగని వీధి దీపాలు.. పొంగి పొర్లుతున్న మురుగు కాలువలు.. గతుకుల దారులు.. కుక్కల బెడద.. పందుల సంచారం.. ఇవీ పట్టణ, నగర ప్రాంతాల్లో వివిధ రకాల సమస్యలు.. వీటిపై ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి జనం నుంచి వినతులు వెల్లువెత్తుతుంటాయి. ఇవికాక పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చేవి మరికొన్ని.. ఇలా వచ్చే ప్రతి సమస్యను డీఎంఏ (డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు నమోదు చేసుకుంటారు. వీటిని స్థానిక యంత్రాంగానికి పంపి వివరణ కోరతారు. ఇంతవరకు వ్యవస్థ బాగానే ఉన్నా ఆ సమస్యల పరిష్కారంలోనే డొల్లతనం కనిపిస్తోంది. ఇందులో కొన్ని సమస్యలకు వీలైనంత త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. నివేదికలు పంపిన తర్వాత నిధులు లేవనే కారణంతో వాటిని పరిష్కరించడం లేదు. కొన్ని పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు చెబుతున్నారు. చూడడానికి ఇబ్బందులు చిన్నవే అనిపించినా దగ్గరగా ఉండి అనుభవించే వారికే ఆ బాధ తెలుస్తుంది. ఎంతో ప్రయాసకోర్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చివరకు పరిష్కరించామని నమోదు చేసి వదిలేస్తుండడంతో సమస్య మొదటికొస్తోంది.
ఉదాహరణలు కొన్ని...
మహిళల మరుగుదొడ్డికి తలుపులు లేని తీరిది..
* పొన్నూరు పట్టణం 4వ వార్డు కొప్పాక వెంకయ్య కూరగాయల మార్కెట్ సెంటర్లో పురపాలక సంఘం అధికారులు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు మలమూత్రశాలను అందుబాటులో ఉంచారు. మహిళలు ఉపయోగించే మరుగుదొడ్లకు తలుపులు లేవని గతేడాది డిసెంబరు 26న ఈనాడులో కథనం ప్రచురితమైంది. దీనిపై డీఎంఏ(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు స్థానిక మున్సిపల్ యంత్రాంగాన్ని వివరణ కోరారు. ఇందుకు పురపాలక సంఘం అధికారులు మూడు రోజుల్లోపే ఆ మరుగుదొడ్లకు తలుపులు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నాటి నుంచి నేటి వరకు ఆ మరుగుదొడ్డికి తలుపులు ఏర్పాటు చేయకపోగా సమస్య పరిష్కరించినట్లు చూపారు.
2022 డిసెంబర్ 12న మూడు రోజుల్లో తలుపులు ఏర్పాటు చేస్తామని డీఎంఏకు పంపిన నివేదిక
జిల్లాలో గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్తో పాటు పొన్నూరు, తెనాలి పురపాలక సంఘాలు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 10,594 ఫిర్యాదులు రాగా అందులో 10,337 పరిష్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అందులో పందుల సంచారంపై 1310 ఫిర్యాదులు రాగా 1242, కుక్కల బెడదపై 965 ఫిర్యాదులు రాగా 955 పరిష్కారమైనట్లు గణాంకాల్లో పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో జనం గోడు పట్టించుకునేవారు లేకుండా పోయారు. నిధుల లభ్యతను బట్టి పనులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. పొన్నూరు పురపాలక సంఘంలో 530 ఫిర్యాదులు రాగా అన్నీ పరిష్కరించేశామని పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘంలో 494 ఫిర్యాదులకు 493 పరిష్కరించినట్లు వెబ్సైట్లో గణాంకాలు పొందుపర్చారు. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు గణాంకాలు విరుద్ధంగా ఉన్నాయి.
పొన్నూరు పట్టణం 12వ వార్డు వడ్డిముక్కల రోడ్డులో సైడుబరమ్స్ లేక ప్రమాదకరంగా ఇలా..
* పొన్నూరు పట్టణం 12వ వార్డు వడ్డిముక్కల రోడ్డులో నిర్మించిన రహదారికి సైడుబరమ్స్ ఏర్పాటు చేయలేదు. ప్రమాదం పొంచి ఉందని గత ఏడాది ఆగస్టు 18న ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు సైడుబరమ్స్ ఏర్పాటు చేసేందుకు అంచనాలు తయారు చేశామని, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వీలైనంత త్వరితగతిన పనులు చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. నాటి నుంచి నేటి వరకు రహదారికి సైడుబరమ్స్ ఏర్పాటు చేయలేదు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలోని నులకపేట నుంచి బ్రహ్మానందపురానికి వెళ్లే మార్గం ఇప్పటికీ గోతులమయమే..
*తాడేపల్లి పరిధిలోని నులకపేట నుంచి బ్రహ్మానందపురానికి వెళ్లే మార్గం చిందరగా మారింది. ఆ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. వాహనదారులు రాకపోకలు నిర్వహించే సమయంలో ఇబ్బందులు పడుతున్నారని ఈ ఏడాది జనవరి 19న ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఇందుకు అధికారులు స్పందించి తాత్కాలికంగా గోతులను పూడ్చారు. మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఆ సమస్య పరిష్కరించినట్లు అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలెక్కించలేదు.. పట్టించుకోలేదు
[ 29-03-2024]
కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఏటా లక్షల బస్తాల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. -
మీ పనులకో దండం!
[ 29-03-2024]
గుంటూరు నగరపాలికలో గడప గడపకు మన ప్రభుత్వం కింద చేసిన అభివృద్ధి పనులకు పది నెలల నుంచి బిల్లులు చెల్లించలేదు. ఇవి రూ.కోట్లలో పేరుకుపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. -
భారీ ఎత్తున సరకుల దిగుమతిపై నిఘా
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెద్ద మొత్తాల్లో సరకుల లావాదేవీలు నిర్వహించే సంస్థలపై నిఘా ముమ్మరం చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుంటూరు-2 జాయింట్ కమిషనర్ మధుబాబు తెలిపారు. -
మౌనానికి వెలకట్టి.. ముడుపులు మూటకట్టి..
[ 29-03-2024]
ఆ అధికార పార్టీ నేత లక్ష్యం రూ.కోట్లు సంపాదించడమే.. వ్యాపారుల నుంచి వసూళ్లు సాగిస్తున్న వైనంపై ప్రతిపక్ష నేత వేసిన సూటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. -
పాలకా.. ఇది తగునా?
[ 29-03-2024]
పొన్నూరు పురపాలక సంఘంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదు. అధికార పార్టీకి ఒక లాగా... ప్రతిపక్ష పార్టీకి మరోలా అమలు చేస్తూ అధికారులు వివక్ష చూపుతున్నారు. -
నిబంధన.. పాటించకుంటే దండన
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. -
ప్రభుత్వం మారితేనే యువతకు భవిత
[ 29-03-2024]
ప్రజలకు తాగు నీటిని అందించలేని వైకాపా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను మాత్రం విచ్చలవిడిగా అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు తీరని నష్టాన్ని కలిగిస్తోందని ఎన్డీయే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. -
అనుమతి ఒకచోట..ప్రచారం మరోచోట
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని యంత్రాంగం చెబుతుంటే.. అధికార పార్టీకి చెందిన వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో వాలంటీరు హల్చల్పై ఫిర్యాదు
[ 29-03-2024]
మండలంలోని కారంపూడిపాడు గ్రామంలో ఈ నెల 22న వైకాపా అభ్యర్థి బలసాని కిరణ్కుమార్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీరు కె.నరసింహరావు పాల్గొన్నారు. -
రోడ్డునే మింగేసిన ఇసుకాసురులు
[ 29-03-2024]
జనం ఇబ్బంది పడితే మాకేంటి? మా ప్రయోజనం నెరవేరితే చాలనేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించారు. అక్రమార్జనకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదులుకోలేదు. -
కోడ్ ఉన్నా.. చోద్యం చూస్తున్నారు!
[ 29-03-2024]
ఈ చిత్రం చూశారా.. కృష్ణా తీరంలోని అమరావతి మండలం మల్లాది రీచ్లో గురువారం రాత్రి వేళ భారీ యంత్రాలతో ఇసుక తవ్వి లారీలకు నింపుతున్నారు. అనుమతి ఉన్న రీచ్లలో సైతం సూర్యాస్తమయం తర్వాత కూలీల చేత కూడా ఇసుక తవ్వకాలు చేయకూడదు. -
బల్లికురవ ఎస్సైపై విచారణకు ఆదేశం
[ 29-03-2024]
అధికార వైకాపా నేతల మెప్పు పొందాలని చూసినా.. బాధితులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకునే పోలీసు అధికారులు తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పడానికి తాజాగా బల్లికురవ ఎస్సై నాగశివారెడ్డి ఉదంతమే ఓ నిదర్శనం. -
ఓటరు జాబితాలో మీ పేరుందా?
[ 29-03-2024]
‘సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది... త్వరలో జరగబోయే ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి ఓటున్న ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి... ఎవరికి వారు తాము వేయకపోతే ఏమవుతుందనే భావన విడనాడాలి. -
నియమావళి అమలు ఇలాగేనా?
[ 29-03-2024]
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 12 రోజులు గడిచింది. అమలుకు సంబంధించి ప్రత్యేకాధికారులను నియమించినా కొన్నిచోట్ల కోడ్ ఉల్లంఘనలు కనపడుతూనే ఉన్నాయి. -
గుండ్లకమ్మ జలాశయంలో మొసలి కలకలం
[ 29-03-2024]
గుండ్లకమ్మ జలాశయంలో మత్స్యకారుడి వలకు మొసలి చిక్కడంతో స్థానికంగా కలకలం రేగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కన్ను పడితే కబ్జానే..
[ 29-03-2024]
తిమ్మాయిపాలెం గ్రామంలోని 7.05 ఎకరాలు నక్కలవాగు పేరుతో వాగు పోరంబోకు స్థలం ఉంది. ఇది జాతీయ రహదారికి పక్కనే రోడ్డుకు ఆనుకొని ఉండటంతో దీనిపై వైకాపా నేత గద్దలా వాలిపోయారు. -
వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. -
మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
[ 29-03-2024]
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. -
ఎత్తిపోతల పథకాలు హుళక్కే
[ 29-03-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా పాలన ఐదేళ్లలో కొత్తగా ఒక్క ఎత్తిపోతల పథకం నిర్మించలేదు. నీటి అనుమతులిచ్చి నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. -
12 మంది వైకాపా కౌన్సిలర్ల వేరు బాట
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రభావం పురపాలక సంఘంలోని పాలకపక్షంపై పడింది. చిలకలూరిపేట శాసనసభ స్థానంలో అధికార వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తల మార్పు వ్యవహారం కౌన్సిలర్ల మధ్య చీలికకు దారి తీసింది. -
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం
[ 29-03-2024]
రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతో నరసరావుపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెల నెలా పేదలకు బియ్యం సక్రమంగా పంపిణీ చేస్తున్నామని చెప్పే అధికారులు ఆ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్నికల నిబంధనలు బేఖాతర్
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ అమలై పదిరోజులు దాటినా నేటికీ పలు చోట్ల అధికారపార్టీ ఆగడాలకు అదుపు లేకుండా ఉంది. క్రోసూరు ఎస్టీ కాలనీ, గాదెవారిపాలెంలోని మంచినీటి పథకం ట్యాంకులకు వైకాపా రంగులు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు