ఉద్యమ నాయకులపై కేసులు అన్యాయం
అమరావతి కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకులను కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం అన్యాయమని తెదేపా అనంతపురం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్దండరాయునిపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న అనంతపురం తెదేపా నాయకులు, రైతులు
తుళ్లూరు, న్యూస్టుడే: అమరావతి కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకులను కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం అన్యాయమని తెదేపా అనంతపురం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు బుధవారానికి 1,268వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెం దీక్ష శిబిరాన్ని అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రాజేంద్ర, మదిగుబ్బ గ్రామ కమిటీ తెదేపా నాయకులు నరసింహులు తదితరులు సందర్శించి రైతు దీక్షలకు మద్దతు తెలిపారు. అమరావతి విషయంలో న్యాయమడిగితే కేసులు పెట్టడం అన్యామన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. అమరావతి దళిత ఐకాస నాయకుడు పులి చిన్నాపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించటం దారుణమన్నారు. 2024లో వైకాపా పాలన అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు