ఒకే వ్యక్తిపేరుతో 500 ఎకరాలు
దాచేపల్లి మండలం తంగెడ గ్రామ పరిధిలో ఒకే వ్యక్తి పేరుతో 500 ఎకరాలు నమోదు కావడం చర్చనీయాంశమైంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, గ్రామ సచివాలయ సిబ్బంది అలసత్వమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దాచేపల్లి మండలంలో మాయాజాలం
సాంకేతిక సమస్యగా రెవెన్యూ అధికారుల నిర్ధారణ
మీ-భూమి పోర్టల్లో నమోదైన వివరాలు
దాచేపల్లి (గురజాల), న్యూస్టుడే: దాచేపల్లి మండలం తంగెడ గ్రామ పరిధిలో ఒకే వ్యక్తి పేరుతో 500 ఎకరాలు నమోదు కావడం చర్చనీయాంశమైంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, గ్రామ సచివాలయ సిబ్బంది అలసత్వమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మీ భూమి పోర్టల్లో నమోదైన వివరాల ప్రకారం.. ఖాతాదారుని పేరు ‘ఇతరులు’ అని, తండ్రి షేక్ తండా సైదా సాహెబ్గా పేర్కొంటూ ఖాతా నెంబరు 9999తో 500 ఎకరాలు నమోదైంది. సర్వే, సబ్ డివిజన్ నంబర్లు 10 నుంచి 997-1 వరకు ఉన్నాయి. భూమి వివరణలో మెట్ట, పుంజ అని నమోదు చేశారు. సాధారణంగా గ్రామ పరిధిలో మిగులు భూములకు ఒక ఖాతా నెంబరు ఇచ్చి ఆన్లైన్లో ఖాతాదారుని పేరు కింద ‘ఇతరులు’ అని నమోదు చేస్తారు. తంగెడ గ్రామ పరిధిలోనూ ఖాతా నెంబరు 9999గా నమోదు చేసి, దానిలో మిగిలిన భూముల సర్వే నంబర్లు నమోదు చేశారు. అయితే ఈ ఖాతా నంబరుకు సైదా సాహెబ్కు సంబంధించి ఆధార్ను లింక్ చేయడంతో అన్ని సర్వే నంబర్ల భూములకు ఆయన పేరు ఆటోమేటిక్గా నమోదైంది. ఇదంతా తంగెడ సచివాలయంలో జరిగింది. వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్ లాగిన్కు రావాల్సి ఉంది. కొద్ది రోజులుగా సైదా సాహెబ్ పేరిట పొలం నమోదు కావడంతో రైతులు ఆందోళన చెంది తహసీల్దార్కు తెలిపారు. దీనిపై తహసీల్దారు ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని, ఈ విషయాన్ని ఆర్డీవోకు తెలియచేసి సరిచేయడానికి గురజాలకు వచ్చామన్నారు. గతంలో మాచర్ల, కారంపూడి, దుర్గిలోనూ ఇలాగే జరిగిందన్నారు. ఇతరుల పొలం సైదా సాహెబ్ పేరున రాయడం లేదా నమోదు చేయలేదన్నారు. తంగెడ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.