ఇదేం సంప్రదాయం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబరు నెలలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
నాలుగేళ్లుగా నిలిచిన యూనిఫాం పంపిణీ
ఆర్టీసీ కార్మికులపై రూ.4.42కోట్ల ఆర్థిక భారం
పొన్నూరు డిపోలో విధులు ముగిశాక సేద తీరుతూ...
* మంగళగిరి డిపోనకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్కు నెలకు రూ.35వేలు జీతం వస్తుంది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఆ రుణం కింద ప్రతి నెలా రూ.20వేలు బ్యాంకు ఖాతాకు జమ అవుతున్నాయి. మిగిలిన రూ.15వేలతో కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యూనిఫాం చినిగిపోవడంతో రూ.4వేలు అప్పు చేసి రెండు జతల ఖాకీ దుస్తులు కుట్టించుకున్నట్లు వాపోయారు.
* పొన్నూరు ఆర్టీసీ డిపోలో 210 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు రూ.5.5 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూర్చుతున్నారు. ఏడాదిలో ఒకటిన్నర రోజు ఆదాయాన్ని ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తే ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాం ఇచ్చే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కార్మికులపైన అదనపు భారం పడుతోందని కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబరు నెలలో ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు ప్రజా రవాణా సంస్థగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతోనైనా కొంత ఆర్థికపరంగా వెసులుబాటు కలుగుతుందని కార్మికులు సంబర పడ్డారు. కానీ రానురాను ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాది డ్రైవర్, కండక్టర్కు రెండు జతల ఖాకీ యూనిఫాం, మెకానిక్ విభాగంలో పనిచేసే కార్మికులకు బులుగు యూనిఫాంను పంపిణీ చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా ఈ ప్రక్రియను కాగితాలకే పరిమితం చేశారు. దీంతో కార్మికులే సొంత డబ్బులతో యూనిఫాంను కొనుగోలు చేస్తున్నారు. ఒక జత కొనుగోలు చేయాలంటే సుమారు రూ.2వేలకు పైగా ఖర్చు అవుతోందని కార్మికులు వాపోతున్నారు. గతంలో నుంచి వస్తున్న కొత్త యూనిఫామ్ ఇచ్చే సంప్రదాయాన్ని నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కేటాయింపులు పెంచాలి...
ప్రస్తుతం కుట్టు కూలి ఖర్చు కూడా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా కేటాయింపులు పెంచి ప్రతి కార్మికునికి యూనిఫాంను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల సంఖ్యకు అనుగుణంగా సంస్థకు వచ్చే రెండు, మూడు రోజుల ఆదాయాన్ని సమకూరుస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి వెసులుబాటు కలుగుతుందని కార్మిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రభుత్వం అందించాల్సిన యూనిఫాంను అందించకపోవడంతో గత నాలుగేళ్ల నుంచి కార్మికులపై సుమారు రూ.4.42 కోట్లు ఆర్థిక భారం పడిందని వారు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నేసి.. కబ్జా చేసి..!
[ 24-04-2024]
వైకాపా నేతలు అధికారం అండతో అయిదేళ్లు బరితెగించారు. యథేచ్ఛగా పేదల భూములు ఆక్రమించారు. దేవుడి మాన్యాలను వదల్లేదు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, వాగులు, వంకలు, డొంక రోడ్లు కావేవి కబ్జాకు అనర్హం అన్నట్లు భూదందాలు సాగించారు. -
వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు
[ 24-04-2024]
పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. -
నాడంతా నటన.. ఓటేశాక వంచన..
[ 24-04-2024]
చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోం. -
అంతా... మా ఇష్టం
[ 24-04-2024]
పొన్నూరు రిటర్నింగ్ కార్యాలయం మార్పు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల అధికారులు అవగాహన లోపంతో తీసుకున్న నిర్ణయంతో గుంటూరు-బాపట్ల ప్రధాన రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. -
ఇదేమి చోద్యం జగన్!
[ 24-04-2024]
విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు -
కోన రఘుపతి.. ఓ భూబకాసురుడు
[ 24-04-2024]
దొంగలు, భూబకాసురులు, అవినీతిపరులకు సీఎం జగన్ వైకాపా తరఫున ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
[ 24-04-2024]
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. -
నాదెండ్ల మనోహర్ నామినేషన్
[ 24-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి తెనాలి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు మంగళవారం తెలిపాయి. -
అట్టహాసంగా తెదేపా అభ్యర్థుల నామినేషన్
[ 24-04-2024]
తెదేపా బాపట్ల లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తెన్నేటి కృష్ణప్రసాద్, వేగేశన నరేంద్రవర్మ నామినేషన్ల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. -
రోడ్డుపై రోడ్డు
[ 24-04-2024]
ప్రజాధనం దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠ. ఓ అధికార పార్టీ నాయకుడు చెప్పాడని..పదేపదే స్పందన, సీఎంవోకు ఫిర్యాదులు చేస్తున్నాడన్న కారణంతో అధికారులు గుంటూరు పలకలూరురోడ్డు సాయిబాబానగర్ ప్రధాన రోడ్డులో బాగున్న సీసీ రహదారిపైనే యథావిధిగా మరో రోడ్డు వేస్తున్నారు. -
పండగ చేస్తానన్నావ్.. ప్రాణాలు తీస్తున్నావ్
[ 24-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో రైతులను గాలికొదిలేశారు. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు అందక.. అధిక వడ్డీలకు తెచ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర దక్కక రైతు కునారిల్లాడు.. -
‘పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన సీఎం’
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ మెడికల్ సీట్లను కూడా వదల్లేదని కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లను అమ్ముకున్నారని యువనేత, -
‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’
[ 24-04-2024]
ఆంధ్రా ప్యారిస్ను ఇక్కడి సిటింగ్ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి