ఉలిక్కిపడిన గుంటూరు
చినపలకలూరులో స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో గుంటూరు నాయుడుపేటకు చెందిన పగడాల వెంకటేష్ (23) మృతి చెందాడు.
ఒకే రోజు రెండు హత్యలు
నల్లచెరువులో మహిళ...
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: గుంటూరు నగరంలోని లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. నిందితుడు ఆమెను కత్తితో కిరాతంగా హతమార్చి, దర్జాగా చొక్కా మార్చుకొని అక్కడి పరారైనట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు వాసి భారతీబాయ్ (43) తన భర్తతో మనస్పర్థల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం గుంటూరుకు వచ్చి దాసరిపాలెంలో ఉంటూ, మిర్చియార్డు వద్ద మిరప తొడిమలు తీసుకుంటూ జీవనం సాగించేవారు. కొన్ని నెలల క్రితం నల్లచెరువుకు మారారు. అక్కడ ఇంటిని అద్దెకు తీసుకొని కొడుకుతో ఉంటున్నారు. మిర్చియార్డు వద్ద పరిచయమైన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం కూలి పనికి వెళ్లిన కొడుకు సాయంత్రం ఇంటికి వచ్చారు. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. తూర్పు ఏఎస్పీ షల్కే, లాలాపేట సీఐ సుబ్బారావు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి ముఖం, చేతులు, మెడపై కత్తి పోట్లు ఉండటంతో కిరాతకంగా హతమార్చినట్లు భావిస్తున్నారు. నిందితుడు ఆమెను కత్తితో పొడిచే క్రమంలో చొక్కాపై రక్తపు మరకలు పడటంతో దాన్ని అక్కడే వదిలేసి, మరొకటి వేసుకొని వెళ్లిపోయినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేశారా వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమెతో సహజీనం చేసిన వ్యక్తిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
మద్యం మత్తులోదారుణం
యువకుడి మృతదేహాన్ని పరిశీలిస్తూ..
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: చినపలకలూరులో స్నేహితుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. ఈ ఘటనలో గుంటూరు నాయుడుపేటకు చెందిన పగడాల వెంకటేష్ (23) మృతి చెందాడు. దీనికి సంబంధించి నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం.. వెంకటేష్, రమేష్, కార్తీక్, మునాఫ్ పనులు చేసుకుంటూ, రాజకీయ పార్టీల ర్యాలీలకు, కార్యక్రమాలకు వెళ్తుంటారు. నలుగురు కలిసి మద్యం తాగేందుకు చినపలకలూరు గ్రామ శివార్లలోకి వెళ్లారు. మద్యం తాగే క్రమంలో వెంకటేష్ మీ వెంట వస్తున్నా కదా.. డబ్బు ఇవ్వమని రమేష్ను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది పెరిగి పెద్దదై ఘర్షణకు దారి తీసింది. వెంకటేష్ తన వద్ద ఉన్న బీరు సీసా పగులగొట్టి రమేష్ కాలిపై పొడిచాడు. దీనికి రెచ్చిపోయిన రమేష్ కూడా బీరు సీసాను పగులగొట్టి వెంకటేష్పై దాడి చేశాడు. వెంకటేష్ తిరగబడటంతో రమేష్తో పాటు కార్తీక్, మునాఫ్ ముగ్గురు కలిసి దాడి చేశారు. గాయాలపాలైన వెంకటేష్ అక్కడకికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటేష్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ