ఇసుకాసురుల.. కాసుల వేట
తీర గ్రామాల్లో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. జేసీబీలు, పొక్లెయిన్లతో పచ్చని పొలాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది
చెరువులుగా మారుతున్న పంట భూములు
అడ్డగోలు తవ్వకాలకు అధికార పార్టీ నాయకుల వత్తాసు
కర్లపాలెం, న్యూస్టుడే
చెరువుగా మారిన పొలం
తీర గ్రామాల్లో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. జేసీబీలు, పొక్లెయిన్లతో పచ్చని పొలాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. వ్యవసాయ భూముల్లో మెరక తీసే పేరిట నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వేస్తూ జేబులు నింపుకొంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కొందరు ఇసుక తరలింపును లాభసాటి వ్యాపారంగా మార్చుకొని రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
తీర ప్రాంతంలోనున్న కర్లపాలెం మండల పరిధిలో వేల ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. ఆయా భూములపై ఇసుక మాఫియా కన్ను పడింది. వీరు ముందుగా ఆయా భూ యజమానులకు కొంత సొమ్ము చెల్లించి భూములను హస్తగతం చేసుకొని ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు ఇసుకను బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోరు. ఇష్టానుసారం తవ్వేసి సొమ్ము చేసుకుంటూ రూ.లక్షల్లో ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. గణపవరంలో ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారు. పలుచోట్ల అక్రమ తవ్వకాలకు అడ్డువచ్చే వారికి ముడుపులు ఇస్తూ అక్రమాలకు ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.
బాహాటంగానే తరలింపు
మండలంలోని గణపవరం, పెదగొల్లపాలెం, నల్లమోతువారిపాలెం, పాతనందాయపాలెం, పేరలిపాడు, యాజలి, బుద్దాం గ్రామ పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో పంట పొలాల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో ఇసుక, మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. సీనరేజీ రూపంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండికొడుతున్నారు. మరీ ముఖ్యంగా గణపవరం, పెదగొల్లపాలెం పంచాయతీల పరిధిలోని పంట పొలాల్లో లోతుగా తవ్వకాలు జరిపి చెరువులుగా మారుస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక, మట్టి అక్రమ రవాణా ప్రభుత్వ కార్యాలయాల ముందు నుంచే సాగుతుండటం గమనార్హం. కనీసం పట్టాలు సైతం కప్పకుండా బాహాటంగా ఈ దందా నిరాటంకంగా సాగుతోంది. టిప్పర్లు, ట్రాక్టర్లతో కళ్ల ముందే అక్రమ రవాణా జరుగుతున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఛిద్రమవుతున్నరహదారులు
భారీ వాహనాలపై ఇసుక, మట్టిని తరలిస్తుండటంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న గ్రామీణ రహదారులు మరింత ద్రమవుతున్నాయి. రాకపోకలు సాగించడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. దుమ్ము రేగడం, రోడ్లపై మట్టిపడి అధ్వానంగా తయారవుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా మట్టి బురదగా మారి ప్రమాదాల బారినపడుతున్నట్లు ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకొని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కర్లపాలెం తహశీల్దారు కేశవనారాయణరావు పేర్కొన్నారు. తాజాగా ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఎవరైనా అనుమతులు తీసుకొని మాత్రమే, మట్టి, ఇసుకను తరలించాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!