logo

నిర్దేశిత గడువులోగా ప్రగతి పనులు పూర్తి

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు కింద చేపట్టిన ప్రగతి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు.

Published : 10 Jun 2023 05:19 IST

పాఠశాలను సందర్శిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు - నేడు కింద చేపట్టిన ప్రగతి పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. అప్పికట్ల నెహ్రూ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో చేపట్టిన పనులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈ నెల 12న జగనన్న విద్యాకానుక పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. డిజిటల్‌ తరగతి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పంపిణీ చేయనున్న విద్యాకానుక కిట్ పరిశీలించారు. డీఈవో రామారావు, ఆర్డీవో రవీందర్‌, తహసీల్దారు సుధారాణి, ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని