పంచాయతీరాజ్ సంస్థల్లో ఆన్లైన్లోనూ ఆడిట్ నిర్వహణ
ఏపీ పంచాయతీరాజ్ సంస్థల్లో వార్షిక ఆడిట్ని మాన్యువల్తో పాటు ఆన్లైన్లోనూ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
గడువు లోపు క్లెయిమ్స్ పరిష్కరించుకోవాల్సిందే
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: ఏపీ పంచాయతీరాజ్ సంస్థల్లో వార్షిక ఆడిట్ని మాన్యువల్తో పాటు ఆన్లైన్లోనూ నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకులు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ఆడిట్ని అక్టోబరు 31 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) మాడ్యూల్ను నూతనంగా ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం పంచాయతీరాజ్ సంస్థలైన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తుల నిధుల వ్యయానికి సంబంధించి ఆన్లైన్లో ఆడిట్ చేస్తారు. జిల్లా ఆడిట్ శాఖ అధికారులు, సిబ్బంది దీనిపై శిక్షణ పొందారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులకు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రికార్డులను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే రికార్డులను కూడా అప్లోడ్ చేయాలని సూచిస్తారు. పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో రికార్డులు నమోదు చేసిన తర్వాత ఆడిట్ శాఖ అధికారులు వాటిని పరిశీలన చేయనున్నారు. చివరగా అభ్యంతరాలను నమోదు చేసి వారికి పంపుతారు. ఆడిట్ క్లెయిమ్స్ని 2024 మార్చి 31 లోపు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఆడిట్తో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధుల వ్యయానికి సంబంధించి ఈ-గ్రామ్ స్వరాజ్ వెబ్సైట్లో విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆడిట్ అధికారులు వెబ్సైట్లో వివరాలు పరిశీలించి సరిగా ఉంటే అవును, వివరాలు నమోదు చేయకుంటే కాదు అని చెక్లిస్ట్లో నమోదు చేస్తారు. గతంలో ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించుకోవడానికి నిర్ణీత గడువు అంటూ లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం విధిగా గడువు లోపు అభ్యంతరాలకు వివరణ ఇచ్చి రద్దు చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆడిట్ శాఖ గ్రామ పంచాయతీలో నిధుల వ్యయం, అభ్యంతరాలను గ్రామసభలో...మండల పరిషత్తులు, జిల్లాపరిషత్తు వివరాలు సర్వసభ్య సమావేశంలో చదివి వినిపిస్తారు. దీనివలన అధికారుల పనితీరు, విధుల్లో నిర్లక్ష్యం, నిధుల వ్యయం చేయడంలో నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా తెలియజేస్తారు. తద్వారా బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొలాలు ఏరులై.. కన్నీటి ధారలై..
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటినప్పటికీ అది మిగిల్చిన నష్టం మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీటి పాలయ్యాయి. -
లోకేశ్ చొరవతో పొలాల్లో నీరు బయటకు...
[ 07-12-2023]
రైతుల్ని ఆదుకుంటాం అని మాటలతో చెప్పి వదిలేయకుండా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదకొండూరులో లోకేశ్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కొత్త... -
మాట మార్చారు.. కౌలు మరిచారు..!
[ 07-12-2023]
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. నిబంధనల ప్రకారం ఏటా మే నెలలో చెల్లించాలి. ఈ ఏడాది డిసెంబర్ వచ్చినప్పటికీ తమకు సీఆర్డీఏ నుంచి కౌలు జమ కాలేదు. -
అంధకారంలో పల్లెలు.. అందని విద్యుత్తు వెలుగులు
[ 07-12-2023]
తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
యువకులను కాపాడిన పోలీసులు
[ 07-12-2023]
పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్క చేయకుండా కారులో వాగు దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అద్దంకి పోలీసులు కాపాడారు. ఈ సంఘటన అద్దంకి నుంచి రేణంగివరం వెళ్లే దారిలో నల్లవాగు వద్ద మంగళవారం ఆర్ధరాత్రి దాటాక జరిగింది. -
వార్డు సచివాలయంపై వైకాపా జెండా!
[ 07-12-2023]
బాపట్ల 10వ వార్డు సచివాలయ భవనంపై వైకాపా జెండా ఏర్పాటు చేయడాన్ని తెదేపా బాపట్ల బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మ తప్పుపట్టారు. ప్రభుత్వ కార్యాలయంపై ఎమ్మెల్యే కోన రఘుపతి చిత్రంతో ఉన్న వైకాపా జెండాను ఏర్పాటు చేశారని,... -
జగనన్న కాలనీకి పడవలో వెళ్లాల్సిందేనా!
[ 07-12-2023]
జగనన్న కాలనీలో కనీస వసతులు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలంటూ అధికారులు లబ్ధిదారుల వెంటపడ్డారు. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాలనీ జలమయమైంది. -
నిర్వహణ గాలికొదిలేసి.. నిలువునా ముంచేసి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను రైతును తీవ్రంగా నష్టపరిచింది. అయితే ప్రకృతి వల్ల ఎదురైన విపత్తు కొంచెమైతే.. ప్రభుత్వ తప్పిదాలు, నిర్వాకం వల్ల అన్నదాతకు అపార నష్టం ఎదురైంది. జిల్లా పరిధిలో కాల్వలు, డ్రైనేజీలు వాగులు, వంకల నిర్వహణను ప్రభుత్వం విస్మరించింది. -
అంతర్జాతీయ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రథమ స్థానం
[ 07-12-2023]
ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్పూరి చంద్రబాగ్ బీచ్లో ఈ నెల ఒకటి నుంచి అయిదు వరకు జరిగిన అంతర్జాతీయ శాండ్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమస్థానం లభించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరానికి... -
సీఆర్డీఏ నుంచి రాజధాని రైతులకు మళ్లీ నోటీసులు
[ 07-12-2023]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని, -
మిగ్జాం బీభత్సం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను తీరం దాటిన తర్వాత బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో అవి తెగి స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బుధవారం ఉదయాన్నే అగ్నిమాపక సిబ్బంది చెట్ల కొమ్మలను విద్యుత్తు స్తంభాలకు అడ్డం లేకుండా తొలగించారు. -
టిడ్కో గృహ సముదాయంలో కుంగిన నేల
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా కురిసిన వర్షాలకు రాజధాని గ్రామం పెనుమాక టిడ్కో గృహ సముదాయం నేల కుంగడంతో డ్రైనేజీ పైపులు విరిగిపోయాయి. దీంతో నివాసితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు సమన్వయంతో సాగాలి
[ 07-12-2023]
కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ శాఖలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చీఫ్ కమిషనర్ సంజయ్ పంథ్ సూచించారు. -
ఇదేనా ‘నాడు-నేడు’ నాణ్యత?
[ 07-12-2023]
రాష్ట్రంలో విద్యా వ్యవస్థల్లో మార్పు తెచ్చాం...కార్పొరేటుకు దీటుగా ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నాం...వేదికలపై ప్రభుత్వ పెద్దలు చెప్పే పదే పదే చెప్పే గొప్పలు ఇవి. -
రైతులకు పరిహారం చెల్లించాలి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ధాటికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణ పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. సంతమాగులూరు మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. -
పంట నష్టం అంచనా వేస్తున్నాం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ పి.రంజిత్బాషా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలసి ఆయన పాల్గొన్నారు. -
బిక్కుబిక్కుమంటూ.. రాత్రంతా జాగరణ
[ 07-12-2023]
చుట్టూ నీళ్లు.. రాత్రంతా చీకటి.. దోమల బెడద.. దిక్కుతోచనిస్థితిలో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కనీసం తాగేందుకు నీరు దొరక్క అల్లాడిపోయారు. ముప్పాళ్ల మండలం గోళ్లపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సుమారు 280 మంది విద్యార్థినులు చదువుతున్నారు. -
జగనన్నా.. కాలనీకి దారేదన్నా!
[ 07-12-2023]
-
నేర వార్తలు
[ 07-12-2023]
తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న బొప్పన కుసుమప్రియ(22) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి మహానాడుకు చెందిన కుసుమప్రియ విజయవాడలోని... -
తడిసిన ధాన్యాన్నీ కొనాల్సిందే: మాజీ మంత్రి
[ 07-12-2023]