అసమానతలపై ఉద్యమమే నిజమైన నివాళి
సమాజంలో నెలకొన్న అసమానతలు, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే మహాకవి గుర్రం జాషువాకు మనమిచ్చే నిజమైన నివాళి అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.
గోవర్ధన్ను సత్కరిస్తున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు తదితరులు
గుంటూరు నగరం, సాంస్కృతికం, న్యూస్టుడే: సమాజంలో నెలకొన్న అసమానతలు, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే మహాకవి గుర్రం జాషువాకు మనమిచ్చే నిజమైన నివాళి అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. శనివారం జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కార్డ్స్ హాలులో జయంతిని ఘనంగా నిర్వహించారు. కల్చరల్ సెంటర్ గౌరవాధ్యక్షులు బాలస్వామి ఆధ్యక్షత వహించిన వేడుకల్లో ప్రముఖ బౌద్ధ రచయిత, సామాజిక ఉద్యమకారులు బొర్రా గోవర్ధన్కు గుర్రం జాషువా సాహితీ పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. అతిథిగా హాజరైన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాదు మాట్లాడుతూ జాషువా సాహిత్యం చదవడం, రాయడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు వస్తాయన్నారు. జాషువా, అంబేడ్కర్లు విస్తృత అధ్యయనంతో దళిత జాతికి వెలుగునిచ్చారని గుర్తుచేశారు. వీసీకే పార్టీ రాష్ట్ర అద్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో దళిత వాదాన్ని మహాకవి జాషువా బలంగా వినిపించారని తెలిపారు. విశ్రాంత తెలుగు రీడర్ డాక్టర్ స్వర్ణలతదేవి, జాషువా కల్చరల్ సెంటర్ ప్రధాన కార్యదర్శి రమణ, సామాజిక ఉద్యమకారులు బ్రహ్మయ్య తదితరులు మహాకవి సాహిత్యాన్ని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెదనందిపాడులో పరవళ్లు తొక్కుతున్న వాగులు
[ 06-12-2023]
మండలంలోని పొలాల్లో బుధవారం కూడా వర్షపు నీరు నిలిచి ఉంది. పంటలపై ఆశలు వదులుకున్నామని రైతులు వాపోయారు. -
ప్రత్తిపాడులో 163 మి.మీ వర్షపాతం
[ 06-12-2023]
జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 99.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. -
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
[ 06-12-2023]
ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీటమునిగిన పంటలు
[ 06-12-2023]
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ వాగు పొంగడంతో నియోజకవర్గంలోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. -
TDP: తితిదే బడ్జెట్ను వైకాపా ఎలక్షన్ బడ్జెట్లా మార్చేశారు: తెదేపా నేత విజయ్కుమార్
[ 06-12-2023]
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. -
డ్రైనేజీ కాలువకు గండి.. నీట మునిగిన పంటలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలోని చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి దక్షిణం వైపున ఉన్న డ్రైనేజీ కాలువకు గండి పడింది. -
నిర్వాసితులకు పరామర్శ
[ 06-12-2023]
చీరాల మండలం వాడరేవులో మంగళవారం తుపాను బాధితులను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. సముద్ర తీరంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు వంద మందిని సోమవారం రాత్రి అక్కడ నుంచి తరలించి, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చారు. -
తీరం.. అంధకారం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీచిన ఈదురు గాలులకు వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలవాలాయి. -
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నాగార్జున
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నాగార్జున భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పలుచోట్ల వర్షాలకు నేలవాలిన వరి పంటను ఆయన మంగళవారం పరిశీలించారు. -
కష్టాలు ఆవరించి.. ఆశలు నేలకూర్చి
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులు, సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేకపోయారు. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘దుకాణం ధ్వంసం చేశారు’
[ 06-12-2023]
తన అద్దె దుకాణాన్ని సంబంధిత యజమాని, స్థానిక వైకాపా నాయకులతో కలిసి ధ్వంసం చేయించారని వ్యాపారి పెదబాబు ఆరోపించారు. -
చాట, చీపిరితోనే శుభ్రం చేస్తారా..?
[ 06-12-2023]
ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేల మంది రోగులు, సహాయకులు వస్తుంటే పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఏజైల్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ కిరణ్కుమార్ మంగళవారం తెలిపారు. -
అమరావతి ఉద్యమం.. రాజకీయాలకు అతీతం
[ 06-12-2023]
అమరావతి ఉద్యమం కులమతాలు, పార్టీలకు అతీతంగా జరుగుతోందని రాజధాని రైతులు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 1,449వ రోజుకు చేరాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించి అక్కడకు వస్తున్న ఫోన్కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వ్యవసాయంలో నికర ఆదాయమే ప్రధానం
[ 06-12-2023]
రైతులు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే మేలని జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ సంచాలకులు డాక్టర్ ఆర్.కె.మాధూర్ తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు మంగళవారంతో ముగిసింది. -
గర్జించిన మిగ్జాం
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఒకవైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలుల ధాటికి ప్రజలు రహదారుల మీదకు రావడానికి భయపడ్డారు. -
కల్లాల్లో కల్లోలం
[ 06-12-2023]
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
Wikipedia: వికీపీడియాలో భారత్ హవా..!
-
Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్కు నిమ్మగడ్డ వినతి
-
Elon Musk: మస్క్ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
KCR: కేసీఆర్కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!