విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల వసూలు అన్యాయం
గతంలో కంటే కరెంటు వాడకంలో పెద్దగా మార్పు లేకున్నా సర్దుబాటు ఛార్జీ(ట్రూఆప్) పేరుతో వినియోగదారులపై కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం వేసిందని గుంటూరు నగర విద్యుత్తు వినియోగదారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు సయ్యద్ ఆదాం సాహెబ్ తెలిపారు.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న విక్టర్ ఇమ్మానుయేల్, పక్కన మురళీకృష్ణ యాదవ్, వెంకటకృష్ణ '
గుంటూరు విద్యుత్తు, న్యూస్టుడే: గతంలో కంటే కరెంటు వాడకంలో పెద్దగా మార్పు లేకున్నా సర్దుబాటు ఛార్జీ(ట్రూఆప్) పేరుతో వినియోగదారులపై కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం వేసిందని గుంటూరు నగర విద్యుత్తు వినియోగదారుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు సయ్యద్ ఆదాం సాహెబ్ తెలిపారు. విద్యుత్తు భవన్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక విద్యుత్తు అదాలత్లో ఆదాంసాహెబ్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో విద్యుత్తు సరఫరా వ్యయం, వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూఆప్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం అన్యాయమన్నారు. అంతేగాకుండా విద్యుత్తు బిల్లులో వేర్వేరు సుంకాల పేరుతో చేస్తున్న వసూళ్లు ప్రజలు భరించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగది ఉంటేనే నూతన సర్వీసు మంజూరు చేస్తామని డిస్కం అధికారులు పెట్టిన నిబంధనతో పేదలకు ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై సెంట్రల్ డిస్కం విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఛైర్పర్సన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ (పూర్వ జిల్లా న్యాయమూర్తి) మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) అనుమతించిన మేరకే విద్యుత్తు సంస్థలు ట్రూఆప్ పేరుతో వసూలు చేస్తున్నాయన్నారు. సదస్సులో మీరిచ్చిన ఫిర్యాదును ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
మానవత్వం ఉండాలి.. దుగ్గిరాలకు చెందిన సత్యవతికి 19 ఏళ్ల వెనుక నుంచి లెక్కించి బిల్లు వేశారని సదస్సులో వచ్చిన ఫిర్యాదుపై విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ అధికారులు ఎలా పడితే అలా బిల్లులు తయారు చేయకుండా మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. కొంతమంది వినియోగదారులు తమకు అదనంగా బిల్లులు వచ్చాయని ఫిర్యాదు చేయగా వెంటనే విచారణ చేసి వారికి న్యాయం చేయాలని సూచించారు. చట్ట పరిధిలో వచ్చే అన్ని ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలుంటే వెంటనే ఉత్తర్వులిస్తామన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు కె.వెంకటకృష్ణ, ఎం.సునీత, ఎస్ఈ మురళీకృష్ణయాదవ్, ఈఈ శ్రీనివాసబాబుతోపాటు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు లక్ష్మీనారాయణ, జోగారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
SI Exam Results: ఏపీలో ఎస్సై పరీక్ష తుది ఫలితాలు విడుదల
[ 06-12-2023]
ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు(SI Exam Results) విడుదలయ్యాయి. -
డ్రైనేజీ కాలువకు గండి.. నీట మునిగిన పంటలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలోని చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి దక్షిణం వైపున ఉన్న డ్రైనేజీ కాలువకు గండి పడింది. -
ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీటమునిగిన పంటలు
[ 06-12-2023]
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ వాగు పొంగడంతో నియోజకవర్గంలోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. -
ప్రత్తిపాడులో 163 మి.మీ వర్షపాతం
[ 06-12-2023]
జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 99.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. -
పెదనందిపాడులో పరవళ్లు తొక్కుతున్న వాగులు
[ 06-12-2023]
మండలంలోని పొలాల్లో బుధవారం కూడా వర్షపు నీరు నిలిచి ఉంది. పంటలపై ఆశలు వదులుకున్నామని రైతులు వాపోయారు. -
AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ
[ 06-12-2023]
విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. -
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
[ 06-12-2023]
ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. -
TDP: తితిదే బడ్జెట్ను వైకాపా ఎలక్షన్ బడ్జెట్లా మార్చేశారు: తెదేపా నేత విజయ్కుమార్
[ 06-12-2023]
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. -
నిర్వాసితులకు పరామర్శ
[ 06-12-2023]
చీరాల మండలం వాడరేవులో మంగళవారం తుపాను బాధితులను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. సముద్ర తీరంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు వంద మందిని సోమవారం రాత్రి అక్కడ నుంచి తరలించి, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చారు. -
తీరం.. అంధకారం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీచిన ఈదురు గాలులకు వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలవాలాయి. -
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నాగార్జున
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నాగార్జున భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పలుచోట్ల వర్షాలకు నేలవాలిన వరి పంటను ఆయన మంగళవారం పరిశీలించారు. -
కష్టాలు ఆవరించి.. ఆశలు నేలకూర్చి
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులు, సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేకపోయారు. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘దుకాణం ధ్వంసం చేశారు’
[ 06-12-2023]
తన అద్దె దుకాణాన్ని సంబంధిత యజమాని, స్థానిక వైకాపా నాయకులతో కలిసి ధ్వంసం చేయించారని వ్యాపారి పెదబాబు ఆరోపించారు. -
చాట, చీపిరితోనే శుభ్రం చేస్తారా..?
[ 06-12-2023]
ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేల మంది రోగులు, సహాయకులు వస్తుంటే పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఏజైల్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ కిరణ్కుమార్ మంగళవారం తెలిపారు. -
అమరావతి ఉద్యమం.. రాజకీయాలకు అతీతం
[ 06-12-2023]
అమరావతి ఉద్యమం కులమతాలు, పార్టీలకు అతీతంగా జరుగుతోందని రాజధాని రైతులు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 1,449వ రోజుకు చేరాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించి అక్కడకు వస్తున్న ఫోన్కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వ్యవసాయంలో నికర ఆదాయమే ప్రధానం
[ 06-12-2023]
రైతులు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే మేలని జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ సంచాలకులు డాక్టర్ ఆర్.కె.మాధూర్ తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు మంగళవారంతో ముగిసింది. -
గర్జించిన మిగ్జాం
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఒకవైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలుల ధాటికి ప్రజలు రహదారుల మీదకు రావడానికి భయపడ్డారు. -
కల్లాల్లో కల్లోలం
[ 06-12-2023]
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
NCRB: దేశంలో అధిక హత్యలకు కారణం అవే.. ఎన్సీఆర్బీ నివేదిక
-
Karnataka: నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. 10ఏళ్ల వరకు జైలు, రూ.10కోట్ల జరిమానా!
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్లతో జాగ్రత్త!
-
Shah Rukh Khan: ఆ క్షణం ప్రపంచానికి రాజునయ్యాననిపించింది: షారుక్
-
SA vs IND: దక్షిణాఫ్రికాలో ఆడటం సవాలే.. అలా చేస్తేనే బ్యాటర్లు సక్సెస్ అవుతారు: ద్రవిడ్
-
INDw vs ENGw: ఇంగ్లాండ్తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్లో ఓడిన భారత్