వైకాపా ప్రభుత్వానికి బీసీల దెబ్బ రుచి చూపించాలి
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్య శిక్షణ కోసం సీమెన్స్ ప్రాజెక్టు పని చేయడమే తప్పుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారని, నిజం నిప్పులాంటిదని ఆయనను బయటకు తెస్తామని మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత కొల్లు రవీంద్ర అన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
వినుకొండ: బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నైపుణ్య శిక్షణ కోసం సీమెన్స్ ప్రాజెక్టు పని చేయడమే తప్పుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారని, నిజం నిప్పులాంటిదని ఆయనను బయటకు తెస్తామని మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత కొల్లు రవీంద్ర అన్నారు. బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా శనివారం పల్నాడు జిల్లా వినుకొండలోని అరుణ థియేటర్ వద్ద ఆ పార్టీ బీసీ నాయకులు చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జరిగిన అన్యాయాన్ని ప్రతి గుండెకు తాకేలా చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. నాడు మంత్రివర్గం చేసిన తీర్మానం మేరకు అధికారులు కార్యక్రమాన్ని అమలు చేస్తే సీఎం జగన్ కొంతమంది సీఐడీ అధికారులతో కలిసి కుట్రపూరితంగా చంద్రబాబును బాధ్యులను చేశారన్నారు. ఇందులో 2.13లక్షల మంది విద్యార్థులు శిక్షణ తీసుకొని 75వేల మంది అప్పుడే ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగాలు పొందిన విషయం వారికి కనిపించదన్నారు. వైకాపా ప్రభుత్వం తనపై హత్యకేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్జైలుకు పంపిందని, ఇప్పుడు చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్లో 54 రోజులు ఉన్నానని అక్కడ బాత్రూంకు వెళ్లాలంటే మెట్లెక్కాలని 74 ఏళ్ల వయసులో పెద్దాయన ఇబ్బంది పడతాడేమోనని భయంతో రాత్రులు నిద్రపట్టడం లేదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయనకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్యులకు ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బీసీల దెబ్బ రుచి చూపించాలని కోరారు. తెదేపా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, బీసీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధులు సైదారావు, బత్తుల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షులు బత్తుల గోవిందరాజులు, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్వాసితులకు పరామర్శ
[ 06-12-2023]
చీరాల మండలం వాడరేవులో మంగళవారం తుపాను బాధితులను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. సముద్ర తీరంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు వంద మందిని సోమవారం రాత్రి అక్కడ నుంచి తరలించి, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చారు. -
తీరం.. అంధకారం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీచిన ఈదురు గాలులకు వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలవాలాయి. -
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నాగార్జున
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నాగార్జున భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పలుచోట్ల వర్షాలకు నేలవాలిన వరి పంటను ఆయన మంగళవారం పరిశీలించారు. -
కష్టాలు ఆవరించి.. ఆశలు నేలకూర్చి
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులు, సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేకపోయారు. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘దుకాణం ధ్వంసం చేశారు’
[ 06-12-2023]
తన అద్దె దుకాణాన్ని సంబంధిత యజమాని, స్థానిక వైకాపా నాయకులతో కలిసి ధ్వంసం చేయించారని వ్యాపారి పెదబాబు ఆరోపించారు. -
చాట, చీపిరితోనే శుభ్రం చేస్తారా..?
[ 06-12-2023]
ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేల మంది రోగులు, సహాయకులు వస్తుంటే పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఏజైల్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ కిరణ్కుమార్ మంగళవారం తెలిపారు. -
అమరావతి ఉద్యమం.. రాజకీయాలకు అతీతం
[ 06-12-2023]
అమరావతి ఉద్యమం కులమతాలు, పార్టీలకు అతీతంగా జరుగుతోందని రాజధాని రైతులు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 1,449వ రోజుకు చేరాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించి అక్కడకు వస్తున్న ఫోన్కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వ్యవసాయంలో నికర ఆదాయమే ప్రధానం
[ 06-12-2023]
రైతులు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే మేలని జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ సంచాలకులు డాక్టర్ ఆర్.కె.మాధూర్ తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు మంగళవారంతో ముగిసింది. -
గర్జించిన మిగ్జాం
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఒకవైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలుల ధాటికి ప్రజలు రహదారుల మీదకు రావడానికి భయపడ్డారు. -
కల్లాల్లో కల్లోలం
[ 06-12-2023]
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
Priyanka Chopra: డీప్ ఫేక్ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్
-
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
-
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
-
Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ
-
Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ