ఓపీ చీటీకి నిరీక్షణే..!
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వచ్చే రోగులు ఓపీ చీటీ పొందేందుకు క్యూ లైన్లో చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అవసరమైన కౌంటర్లు లేకపోవడమే ఇందుకు కారణం.
రోగులకు సరిపడా కౌంటర్లు లేవు
జీజీహెచ్లో ఇదీ పరిస్థితి
బారులు తీరిన రోగులు
ఈనాడు-అమరావతి: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వచ్చే రోగులు ఓపీ చీటీ పొందేందుకు క్యూ లైన్లో చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అవసరమైన కౌంటర్లు లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం స్త్రీ, పురుషులకు కలిపి 8 కౌంటర్లు ఉన్నాయి. ఇవి వేర్వేరుగా ఉన్నా జనాల రద్దీ దృష్ట్యా మహిళల కౌంటర్లలోకి మగవాళ్లు, పురుషుల దానిలోకి స్త్రీలు చొచ్చుకెళ్లి సాధ్యమైనంత త్వరగా ఓపీ చీటీ పొంది వైద్యులకు చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై నిలబడే పరిస్థితి లేని రోగుల్లో కొందరు క్యూలైన్ల వద్ద రద్దీ చూసి వెనుదిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. గత్యంతరం లేని వాళ్లు తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా నిలబడుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు బోధనాసుపత్రి రిఫరల్ ఆసుపత్రిగా మారి సేవలు అందిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడకు వస్తున్నారు. సగటున రోజుకు 2 వేల మంది వరకు ఓపీ కి వస్తున్నారు. ఇన్ని వేల మంది వచ్చే చోట కౌంటర్లు తక్కువగా ఉండటంతో ఉదయం 9-12 గంటల మధ్య ఏ సమయంలో చూసినా రోగులు కిక్కిరిసి ఉండడం నిత్యకృత్యమే. ఇప్పుడున్న వాటికి రెట్టింపు సంఖ్యలో ఏర్పాటు చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదు. ప్రస్తుతం సగటున ఒక్కో రోగి ఆన్లైన్లో చీటీ తీసుకోవాలంటే కనీసం పావుగంటపైన పడుతోంది. అదే ఆఫ్లైన్ అయితే 5-10 నిమిషాలు వేచి చూడాల్సి వస్తోంది. ఓపీ బ్లాక్లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. ఆ తర్వాత మిలీనియం బ్లాక్లో అత్యవసర రోగులకు మాత్రమే అక్కడ చీటీలు ఇస్తారు. ఇక్కడ కూడా కేవలం ఒక్క కౌంటర్ మాత్రమే ఉంది.
సమస్యను గుర్తించినా..
ఆసుపత్రిలో గతంలో శస్త్రచికిత్సల వైద్యునిగా పనిచేసిన డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఈ సమస్యను గుర్తించారు. ఓపీ బ్లాక్ వద్ద ఉన్న సైకిల్ స్టాండ్ ఆవరణలో మరికొన్ని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఇంత వరకు అందుబాటులోకి తేలేదు. దీనిపై ఆసుపత్రివర్గాలు మాట్లాడుతూ కొత్తగా 16 కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు అసౌకర్యం లేకుండా చూస్తామన్నారు.
డేటా ఏదీ?
ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఓపీ చీటీలు డిజిటలైజేషన్ చేశారు. ఎవరైనా తొలుత ఓపీ చీటీ పొందాలంటే వారి ఆధార్ నంబరు, ఫోన్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు కౌంటర్ల వద్ద ఉండే సిబ్బందికి తెలియజేయాలి. ఆ తర్వాత రోగి చరవాణికి ఓటీపీ నంబరు వస్తుంది. అది అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేస్తే వారు సదరు రోగికి చిన్న స్లిప్పై లేదా అతని చేతిపైనో ఒక నంబరు రాసి ఓపీ కౌంటర్లో ఉన్న సిబ్బందికి చెబితేనే ఓపీ రసీదు జనరేట్ చేస్తారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం విద్యార్థులకు చెందిన చరవాణుల్లోనే చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్యాప్ను వారి ఫోన్లలో డౌన్లోడ్ చేశారు. నర్సింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులు నిత్యం జీజీహెచ్కు శిక్షణ నిమిత్తం వస్తారు. వారికి చెందిన ఫోన్ డేటా నుంచే ఈ పనులు చేస్తున్నారు. ఆసుపత్రిలోఈ వివరాల నమోదుకు వైఫై ఉన్నా సాంకేతిక సమస్యలతో పనిచేయదు. దీంతో తమ డేటానే ఆ వివరాల నమోదుకు వినియోగిస్తున్నామని తమకు కనీసం డేటా కూడా వేయించే వెసులుబాటు చేయలేదని విద్యార్థులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్తిపాడు నియోజకవర్గంలో నీటమునిగిన పంటలు
[ 06-12-2023]
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొండ వాగు పొంగడంతో నియోజకవర్గంలోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. -
TDP: తితిదే బడ్జెట్ను వైకాపా ఎలక్షన్ బడ్జెట్లా మార్చేశారు: తెదేపా నేత విజయ్కుమార్
[ 06-12-2023]
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో(TTD) అదనపు నిధులు లేకుండా, బడ్జెట్ ఆమోదం పొందకుండా ₹1200 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఎలా ఇచ్చారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. -
డ్రైనేజీ కాలువకు గండి.. నీట మునిగిన పంటలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా జిల్లాలోని చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి దక్షిణం వైపున ఉన్న డ్రైనేజీ కాలువకు గండి పడింది. -
నిర్వాసితులకు పరామర్శ
[ 06-12-2023]
చీరాల మండలం వాడరేవులో మంగళవారం తుపాను బాధితులను కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించారు. సముద్ర తీరంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న దాదాపు వంద మందిని సోమవారం రాత్రి అక్కడ నుంచి తరలించి, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చారు. -
తీరం.. అంధకారం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా వీచిన ఈదురు గాలులకు వందల సంఖ్యలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడి బాపట్ల జిల్లాలో అంధకారం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. భారీ వృక్షాలు నేలవాలాయి. -
బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి నాగార్జున
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బతిన్న బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి నాగార్జున భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో పలుచోట్ల వర్షాలకు నేలవాలిన వరి పంటను ఆయన మంగళవారం పరిశీలించారు. -
కష్టాలు ఆవరించి.. ఆశలు నేలకూర్చి
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులు, సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
జనజీవనం అస్తవ్యస్తం
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా అతలాకుతలమైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టలేకపోయారు. వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
‘దుకాణం ధ్వంసం చేశారు’
[ 06-12-2023]
తన అద్దె దుకాణాన్ని సంబంధిత యజమాని, స్థానిక వైకాపా నాయకులతో కలిసి ధ్వంసం చేయించారని వ్యాపారి పెదబాబు ఆరోపించారు. -
చాట, చీపిరితోనే శుభ్రం చేస్తారా..?
[ 06-12-2023]
ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేల మంది రోగులు, సహాయకులు వస్తుంటే పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఏజైల్ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట డాక్టర్ కిరణ్కుమార్ మంగళవారం తెలిపారు. -
అమరావతి ఉద్యమం.. రాజకీయాలకు అతీతం
[ 06-12-2023]
అమరావతి ఉద్యమం కులమతాలు, పార్టీలకు అతీతంగా జరుగుతోందని రాజధాని రైతులు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారానికి 1,449వ రోజుకు చేరాయి. -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు
[ 06-12-2023]
మిగ్జాం తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించి అక్కడకు వస్తున్న ఫోన్కాల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
వ్యవసాయంలో నికర ఆదాయమే ప్రధానం
[ 06-12-2023]
రైతులు యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రయత్నిస్తే మేలని జాతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ సంచాలకులు డాక్టర్ ఆర్.కె.మాధూర్ తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సు మంగళవారంతో ముగిసింది. -
గర్జించిన మిగ్జాం
[ 06-12-2023]
తుపాను ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఒకవైపు వర్షం.. మరోవైపు ఈదురుగాలుల ధాటికి ప్రజలు రహదారుల మీదకు రావడానికి భయపడ్డారు. -
కల్లాల్లో కల్లోలం
[ 06-12-2023]
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో తుడిచి పెట్టుకుపోయింది. దిగుబడులు బాగున్నాయని, ఈసారి నాలుగు డబ్బులు వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం